రక్తదాన శిబిరం విజయవంతం.

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని గవర్నమెంట్ స్వతంత్ర సమరయోధులు షహిద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పురస్కరించుకొని సంవేదన 2లో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆక్టివిటీస్ (నిఫా), యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశ సమైక్యత సంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ” గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ” సాధించడం కోసం 1,50,000 యూనిట్ల బ్లడ్ ను కలెక్ట్ చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో 20 దేశాలలో,భారత్లో 28 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు,800 జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,బ్లడ్ క్యాంపు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ),కొత్తకొండ అరుణ్ కుమార్,ఎస్.కె ముస్తఫా ను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా 35 మంది రక్తదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకృష్ణ,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు),కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,విజయ, చందర్రావు,సాధు ప్రసాద్, కునూరు గణేష్,బండి ప్రశాంత్,ఆనంద్,నరేష్, రాజేష్,రమేష్,సాంబరాజు, సంతోష్,శ్రీకాంత్,ఆనంద్, రాకేష్,వినయ్ కుమార్, రాజేష్,రంజిత్,రాజు,అనిల్, నాగరాజు,సాధు రోహిత్, అమర్నాథ్,సంతోష్,మధుకర్, సంజయ్ కుమార్,శివ సాయి, మడి కొండ సదానందం,మడి కొండ షిండే,ప్రవీణ్,రంజిత్, బండి శ్రీధర్,అన్వేష్, కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్,ఊరటి రవికుమార్,సృజన,జ్యోతి, భావన,బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్),యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము,సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రోజా,ప్రమీల, ప్రశాంత్,సుమలత,రమేష్ విష్ణు లు పాల్గొన్నారు.

Blood donation
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version