లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు…
నేటి ధాత్రి / మర్చి 22
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో వింటేజ్ కంపెనీలో పని చేసే వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీను మూడు నెలల క్రితం కల్వకుర్తి పట్టణంలో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీలో పని చేసే తోటి స్నేహితులు శనివారం రూ.60 వేలు బాధితుడికి అందజేశారు. శ్రీను కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొంగల్ల జగదీష్, గంగదారి శ్రీశైలం, రౌతు శ్రవణ్ కుమార్, బాలకృష్ణ, అనిల్ గౌడ్, మట్ట నరేష్, మల్లయ్య, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.