అంబేద్కర్ యువజన సంఘం మండల.

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులుగా యుగేందర్ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏవైఎస్ మండల నూతన కమిటీ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా జన్నె యుగేందర్,ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ లను ఎన్నుకోవడం జరిగింది,ఉపాధ్యక్షులుగా కనకం తిరుపతి,గుర్రం అశోక్,సహాయ కార్యదర్శిలుగా దాసరపు నరేష్,బోనగిరి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా కట్కూరి రాజు, కోశాధికారి కట్కూరి రాజేందర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు యుగేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు , ఈ కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, చిట్యాల మండల గౌరవ అధ్యక్షుడు గుర్రపు రాజేందర్,ఏవైఎస్ సభ్యులు సరిగోమ్ముల రాజేందర్, కట్కూరి రమేష్, గుర్రం రాజమౌళి, గుర్రం తిరుపతి, శీలపాక ప్రణీత్ కుమార్, మైదం మహేష్, పాముకుంట్ల చందర్,ముత్యాల సాంబయ్య, కట్కూరి శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్, అంబాల సాంబయ్య (అచ్చి) తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన.

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన
చర్యలు తప్పవ్

ఎస్ ఐ నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

తెల్లవారుజామున ముత్తారం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ శివారులో పెద్ది లక్ష్మీరాజం తండ్రి లక్ష్మయ్య ,వయస్సు: 35 సంలు ఖమ్మంపల్లి ప్రాంతంలో ట్రాక్టర్ లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తు ఉండగా పట్టుకోవడం జరిగింది. వెంటనే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను డ్రైవర్ ను ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి, ట్రాక్టర్ ను సీజ్ చేశారు ఈ విధంగా ఎవరైనా కాని అక్రమంగా ఇసుకను, మట్టి రవాణా చేస్తే చట్ట ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోన బడతయాని
ఎస్ ఐ నరేష్ తెలిపారు

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం.

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ సెంటర్లో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి శుక్రవారం ఉదయం 9 .30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు మండలంలో రెండు సెంటర్లు 360 మంది విద్యార్థులకు గాను 359 మంది హాజరు కాగా ఒకరు ఆఫ్ సెంట్ అయినట్లు ఎంఈఓ ఊరుకొండ ఉప్పలయ్య తెలిపారు మొదటి రోజు ఎలాంటి మాస్ షాపింగ్ జరగకుండా స్థానిక ఎస్సై రేఖ అశోక్ పటిష్ట భద్రత ను ఏర్పాటు చేశారు

వృక్షో రక్షతి రక్షితః.

వృక్షో రక్షతి రక్షితః

 

నడికూడ,నేటిధాత్రి:

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థుల చేత నాటకీకరణ చేయించడం అందరినీ ఆకట్టుకున్నది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ మనం ఈనాడు ఎంతో అందమైన నగరాలలో నివసిస్తున్నప్పటికీ,మానవుని తొలి నివాసాలు మాత్రం అడవులే.అలాంటి అడవులపై ఈనాటికి కూడా మానవుడు ఎంతగానో ఆధారపడి జీవిస్తున్నాడు.
అడవులు మనకు మేఘాలను చల్లబరచి వర్షాన్ని ఇస్తున్నాయని, గృహోపకరణాలకు, వంటచెరకుకు అవసరమైన కలపను అందిస్తున్నాయని,అనేక రకాలైన జంతువులకు, పక్షులకు నివాసప్రాంతాలుగా ఉంటున్నాయని,అనేక రకాలైన మూలికలు, ఔషదాలు అడవులనుండి లభిస్తున్నాయని,కాలుష్యాన్ని నివారించి,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయని, వరదలు సంభవించినపుడు, నేలకోతకు గురికాకుండా అడ్డుకుంటున్నాయని
కాని,నేడు మానవుడు వివిధ అవసరాల కోసం అడవులను నరికివేయడం వలన వర్షపాతానికి,ఆహారానికి లోటు ఏర్పడడమే కాకుండా, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని,కాబట్టి మనం మన ఇళ్ళలోను, పాఠశాలలోను,ఖాళీ ప్రదేశాలలోను చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం.అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి…

– చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే

– అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

– 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది

– ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు

– ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం

– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

 

మంథని:- నేటి ధాత్రి

 

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్‌బాబుకు కల్పించిన మంథని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఆయన మొండి చేయి చూపించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.

శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో కుటుంబం, బంధువులు లేని మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40ఏండ్లు అవకాశం కల్పించారని,

ఈనాటి మంత్రికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గానికి బడ్జెట్‌లో ఒక్కరూపాయి కేటాయించకపోగా ఈప్రాంత ప్రజలకు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహరం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషదమూలికలు లభించే రామగిరి ఖిల్లాను అభివృధ్ది చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృధ్దికి ప్రాధాన్యత ఇస్తానని మెడికల్‌ కళాశాల తీసుకువస్తానని హమీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వం రాగా సీఎం రేవంత్‌రెడ్డి తన నియోకవర్గానికి మెడికల్‌కళాశాల తీసుకువెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్‌కళాశాలను మంజూరీచేయించలేక పోయారని ఎద్దేవా చేశారు.

పోతారం లిఫ్ట్‌ అయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందుతుందనే ఆలోచనతో ఆనాడు సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఆనాడు ప్రతిపాదనలు కూడా చేశామని ఆయనగుర్తు చేశారు.

కానీ మంత్రిగా పోతారం లిఫ్ట్‌ గురించి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరంను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి హోదాలో మాట్లాడి ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరణ చేయలేదన్నారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులను వాడుకుంటున్నాడే తప్ప ఈ నియోజకవర్గంలో 80శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయడం లేదని, వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదని విమర్శించారు.

బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే బదనాం చేసి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే ఉండే మంత్రి వంత పాడకుండా ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారేది కాదన్నారు.

కేవలం ఇసుక దందాను కొనసాగించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు.

అయితే ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్‌ అని ప్రకటించారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.

ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్వయంగా తమకు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదంటూ మాట్లాడిన తీరు రాష్ట్ర పరువు పోయిందని ఆయన అన్నారు.

అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీడియాపై అక్కసు వెల్లబోసుకున్న ముఖ్యమంత్రి బట్టలూడదీసి కొడుతానని మాట్లాడుతుంటే మంథనిలోమాత్రం మంత్రి ప్రెస్‌క్లబ్‌లను ఏర్పాటు చేయిస్తున్నాడని, దేశంలో ప్రెస్‌క్లబ్‌లకు పార్టీలను అంటగట్టిన చరిత్ర మంత్రికే దక్కిందన్నారు.

మంథని ఎమ్మెల్యే ఎప్పుడు అదికారంలో ఉంటే అప్పుడు కొత్త పద్దతులను చూపించే అలవాటు నాటి నుంచే ఉందన్నారు.

ఆనాడు మంత్రి తండ్రి సైతం ప్రజలను హింస ఏవిధంగా పెట్టాలే, నక్సల్స్‌ పేరుమీద ఎలా మట్టుబెట్టాలనే కొత్త పద్దతులు అవలంబిస్తే ఈనాడు మంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టాలని చూశాడన్నారు.

మనలోమనకు వైషమ్యాలు పెంచి దాన్ని వాడుకుని గొప్పగా వర్థల్లాలనే చూస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐటీ మంత్రిగా పది మందికైనా ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతూనే ఉన్నామన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కుటుంబానికి ఇన్నేండ్ల అవకాశం కల్పిస్తే కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.

రెండుసార్లు మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంథని ప్రాంత అబివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆనాలోచిత విధానాలతో గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లోని పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.బీద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చేస్తామన్నారు.

అనంతరం మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో 23న కరీంనగర్ లో జరిగే భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం గురించి నాయకులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిశా నిర్దేశం చేశారు

తహసీల్దార్ సస్పెండ్

తహసీల్దార్ సస్పెండ్

“నేటిధాత్రి”, బీబీనగర్.

బీబీనగర్ తహశీల్దార్ ను సస్పెండ్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్స్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు

రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

 

#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.

 

#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.

 

#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు

రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల

కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య.!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు.!

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర నాయకులు జన్నె మొగిలి మాతృమూర్తి జన్నె దుర్గమ్మ మధ్యాహ్నం మృతి చెంది నాట్లు తెలియగానే వచ్చి వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిషిధర్ రెడ్డి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం యుగదీశ్వర్ రాష్ట్ర నాయకులు బట్టు రవి గణపురం బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు భాస్కర్ రావు రామచంద్ర రావు సోమా దామోదర్ దుప్పటి భద్రయ్య మంద మహేష్ దుగ్గిశెట్టి పున్నం చందర్, భూక్యా హరిలాల్, మాదాసు మొగిలి, పెండ్యాల శ్రీకాంత్ వేణు రావు రాజు శివరాత్రి వేణు, రాకేష్ రెడ్డి శాస్త్రాల తిరుపతి తదితరున్నారు

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం.

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు జ్యోతిష పండితుల ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 23 న జరిగే జాతీయస్థాయి వైదిక జ్యోతిష్య సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రవన్ శాస్త్రి బూరుగుపల్లికి ఆహ్వానం అందింది.విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున విజయవాడలో నిర్వహించనున్న వైదిక జ్యోతిష సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన వాస్తు సిద్ధాంతులు, జ్యోతిష్య పండితులను ఆహ్వానించగా వారిలో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందని శ్రవణ్ శాస్త్రి శుక్రవారం తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు సెషన్లుగా జ్యోతిష్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పలు జ్యోతిష్య ,వాస్తు గ్రంథాల రచయిత, దైవజ్ఞరత్న పుచ్చా శ్రీనివాసరావు చే
ద్రేక్కాణ చక్ర రహస్యాలు,
శతాధిక జ్యోతిష గ్రంధ సంకలనకర్త ఆదిపూడి శివ సాయిరామ్ చే
జాతక దోషాలు- సులభ నివారణలు,
జ్యోతిష గ్రంథ రచయిత
శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ తో
ప్రశ్నా జ్యోతిషం- ఫలితాలు,
శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి
లక్కావఝుల విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి
తో వైదిక జీవనం-అనుసరణీయం అనే అంశాలపై ప్రసంగాలు,
శ్రీ శృంగేరి శంకర మఠం – శ్రీ మహాలక్ష్మి ఆలయ ధర్మాధికారి- ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ, రాజమండ్రి కి చెందిన బహు గ్రంథ రచయిత గురురాజేష్ కొటేకల్, పంచాంగ కర్త శ్రీనివాస శశికాంత్ శర్మతో సమకాలిన వాస్తు జ్యోతిష అంశాలపై చర్చ గోష్టి ఉంటుందన్నారు.ప్రముఖ వైదిక జ్యోతిష వాస్తు పండితులతో నిర్వహించే ఈ సమ్మేళనం కో ఆర్డినేటర్ డాక్టర్ డి విశ్వనాథ్ నుండి ఆహ్వానం అందినట్లు శ్రవణ్ శాస్త్రి తెలిపారు.

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం..

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

The annual exams for class 10th have begun…

10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆల్ఫాన్సా పాఠశాల, తవక్కల్ పాఠశాల ల్లో 291 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

 

The annual exams for class 10th have begun…

పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి కాలం కావడం తో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. ఏఎస్ఐ రజిత, పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేశారు.

మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం అంబేద్కర్ కాలనీలోని ఎమ్మార్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది.ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం అమరుల త్యాగాల ఫలితంగా వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ ఎస్సీ లోని 59 ఉప కులాలకు సమాన న్యాయం జరగాలని మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ కి పాదాభివందనాలు తెలియజేశారు.అలాగే పాలాభిషేకం అనంతరం కాలనీవాసులు టపాసులు పేల్చి డబ్బు చప్పుళ్లతో ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు కొప్పర్తి రాజం,అంబేద్కర్ కాలనీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మాడుగుల మహేష్,ప్రధాన కార్యదర్శి ఇరికల్లా మనోజ్,ఎమ్మార్పీఎస్ నాయకులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

శాతవాహన విశ్వవిద్యాలయం గురువారం 20.3.2025 రోజున ప్రకటించిన 1, 3, 5 సెమిస్టర్ ఫలితాలలో సిరిసిల్ల జిల్లాలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యార్థులు జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందుకుగాను సిరిసిల్ల జిల్లా ఎస్. పి మహేష్ బి. గితే కళాశాల విద్యార్థులను శాలువా, మెమెంటో తో సత్కరించారు.
అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారని తెలిపారు. ఈ ఫలితాలలో 9 జి. పి. ఏ మరియు ఆ పైన జి. పి. ఏ సాధించిన మా కళాశాల విద్యార్థులు
1. బి దినేష్ నాయక్ 9.4 జి.పీ. ఏ ( ఫుడ్ సైన్స్)
2. కే అక్షిత 9.24 జి.పీ.ఏ(బీ కాం)
3. కే శ్రావణి 9.19 జి.పీ.ఏ(బీ కాం)
4. ఈ భవాని 9.11 జి.పీ.ఏ(బీ కాం)
5. టీ.మేఘన 9.20 జి.పీ.ఏ(బీ కాం)
6. జి సుప్రియ 9.12 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
7. వి నవ్య 9.04 జి.పీ.ఏ(బీ కాం)
8. వి .సుప్రియ 9 జి.పీ.ఏ( డేటా సైన్స్)
9. జ.వైష్ణవి 9 జి.పీ.ఏ(ఫుడ్ సైన్స్)
10. అబ్దుల్ అఖిబ్ 9 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
11. నల్ల శ్రేయ 9 జి.పీ.ఏ( ఏం.పీ. సీఎస్)

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన సోషల్ మండల కోఆర్డినేటర్.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా కొత్తగూడ మండల నికి అదనంగా యూనిట్లు కేటాయించాలని కోరడం జరిగింది.. అందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని  తెలిపారు…

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఓటర్ జాబితా సవరణ పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటర్ జాబితా చాలా కీలకమని, సరైన ఓటర్ జాబితాతో ఎన్నికల నిర్వహిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు.
ఓటర్ జాబితా, పారదర్శకమైన పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, బ్యాలెట్ ఎన్నికల వ్యవస్థకు కీలకమని అన్నారు.

ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణ పై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని,ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించే సమయంలో తప్పనిసరిగా నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని అన్నారు.
ఓటరు జాబితాలో డబల్ ఎంట్రీ ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమందికి ఓట్లు ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదులను జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వివరాలు పరిశీలిస్తూ పరిష్కరిస్తామని అన్నారు.
ప్రతి సంవత్సరం 4 సార్లు ఓటర్ జాబితా సవరణ చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రజాప్రతినిధుల చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం ఓటర్ నమోదు సమయంలో తప్పుడు సమాచారం అందిస్తే నేరమని, మోసపూరిత ఉద్దేశాలతో రెండు చోట్ల ఓటు హక్కు కల్గి ఉండే ఓటర్ల వివరాలు ఆదారాలతో అందిస్తే తప్పనిసరిగా విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటి పరిధిలో ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 157 మంది పురుష ఓటర్లు, 2 లక్షల 47 వేల 977 మంది మహిళా ఓటర్లు, 38 మంది ఇతరులు మొత్తం 4 లక్షల 77 వేల 182 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ , ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు నిర్దిష్ట సమయంలో నమోదు చేయాలని , లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరారు.

 

ఓటర్ జాబితా సవరణపై ఎటువంటి సందేహాలు ఫిర్యాదులు సూచనలు ఉన్న తెలియజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రాధాబాయి రాజేశ్వర్ భాజాపా పార్టి ప్రతినిథి నాగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సంపత్, భారస పార్టీ ప్రతినిధి రాజన్న, బి.ఎస్.పి పార్టీ ప్రతినిధి రమేష్, సి.పి.ఐ(ఎం) పార్టీ ప్రతినిధి రమణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version