జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నర్సంపేట విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఈ తిరుపతి బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తి గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈ బి.లక్ష్మణ్, టౌన్ ఏ.ఈ ఎన్ .విజయభాస్కరరావు టెక్నికల్ ఏ ఈ సంపత్ తో పాటు నర్సంపేట టౌన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

తొర్రూరు( డివిజన్) నేటి ధాత్రి

 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం గర్వకారణం అని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ పేర్కొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…..
సామాజిక ఉద్యమాల్లో అద్దంకి దయాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దళితుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశాడని తెలిపారు.
మాలలు, దళిత వర్గాల అభివృద్ధికి అద్దంకి దయాకర్ పాటుపడ్డాడని తెలిపారు.
అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే విషయ పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన దయాకర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు యనమల రాకేష్, డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు గారలాజర్, నెల్లికుదురు అధ్యక్షులు కారం ప్రశాంత్, నాయకులు చిట్టి మల్ల కిరణ్ ఎనమాల లక్ష్మి, ప్రసన్న కుమార్, చిట్టి మల్ల గోపి, బన్నీ మనో, శివకుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి;*

 

అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు,భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని నర్సంపేట టౌన్ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు నిర్వహించారు. దళిత రత్న,దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ కళ్ళేపెళ్లి ప్రణయ్ దీప్ ఆధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు జనగాం కుమార్,అందె రవి దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్ దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్ తడుగుల విజయ్ లు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోయిని నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాంబయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్, కుల పెద్దలు మాదాసి సదానంద,కరుణాకర్, నవీన్, రాజు,మాల మహానాడు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె.

సిరిసిల్ల చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె

డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు

ఏప్రిల్ – 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం

CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జోళి శాఖ ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ , వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈరోజు 5 వ రోజు కు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా బి.వై నగర్ లోని సమ్మె శిబిరం నుండి కార్మికులు గోపాల్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ గార్లు మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం , అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.

సమ్మె డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్..

Musham Ramesh’s

కూరపాటి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరుతున్నారని ఇట్టి కార్యక్రమంలో పవర్లూమ్ కార్మికులు , వార్పిన్ , వైపని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క దేవదాస్ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్ నాయకులు ఉడుత రవి , ఒగ్గు గణేష్ , ఎలిగేటి శ్రీనివాస్ , సబ్బని చంద్రకాంత్ , భాస శ్రీధర్ , వేణు , తిరుపతి , రాజు , రాము , వెంకటేశ్వర్లు , సదానందం పెద్ద ఎత్తున పవర్లూమ్ , వార్పిన్ , వైపని యూనియన్ల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో.!

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి

 

భారత దేశ మాజీ ఉపప్రధాని డా:బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం పస్తాపూర్ గ్రామంలో గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి,మరియు కోహిర్ మండలం చింతల్ ఘాట్ చౌరస్తా వద్ద గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన పస్తాపూర్ గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ వారు దేశానికి ఎంతో సేవ చేసారని కుల రహిత సమాజం కొరకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పోరాడిన మహానేత అని వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్,రాజేందర్,రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,ధన్ రాజ్,సామెల్,విఠల్,చెంగల్ జైపాల్,రాజ్ కుమార్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న.!

వీరాంజనేయ మండల పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న మాజీ మంత్రి

సతీమణి సింగిరెడ్డి.వాసంతి

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ సందర్భంగా పాతబజార్ వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్ణిర్మానం లో భాగంగా 45రోజులు మండల పూజ, గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు
వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గుడి పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చారు
ఈ సందర్బంగా పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ని ఆలయ నిర్వాహకులు సన్మానించారు, అన్న ప్రసాద వితరణ చేసి భక్తుల తో పాటు స్వీకరించారు
ఆలయ నిర్వాహకులు నీలస్వామి, ఎర్రశ్రీను గణేష్ వాకింగ్ టీమ్ అధ్యక్షులు. గోనూరు వెంకటయ్య, బాలస్వామి,సూర్యావంశం గిరి, మెహన్, సునీల్ వాల్మీకి, శివ లక్ష్మణ్ గౌడ్, బాలరాజు, రాజు, రవి, జస్వంత్ వాల్మీకి, ఇమ్రాన్, మునికుమార్, అలీం మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

: రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్‌ రామ్‌ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు , నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలోడి ధనరాజ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ . మధుకర్. బాగప్ప.ఏవన్ గోల నర్సింలు. గోల సురేష్.హబ్రహం. మెషె. పి.లక్మ్యాన్. చింటూ . సంగన.ఈశ్వర్.కజమియా.ఉపరి వినయ్. జ్యోత్ . నాగప్ప పటేల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

రైతాంగ ఉద్యమాల బలోపేతంకై 7,8తేదీలలో జాతీయ సమావేశాలు

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.శనివారం స్థానిక నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగిన అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే తీరా చేతికి పంటలు వచ్చే దశలో అకాల వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, వరి, మిర్చి,మామిడి, అరటి తదితర పంటలు నేలమట్టమై 10 లక్షల ఎకరాలలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని దాంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పంట చేనులను పరిశీలించి బాధిత రైతాంగానికి భరోసా కల్పించి ఎకరాకు కనీసం 50వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్నలను వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి కుంటి సాకులు లేకుండా భేషరత్తుగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ క్రమంలో రైతు సంఘం కార్యకర్తలు ఎక్కడికి అక్కడ రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈనెల 7 8 తేదీల్లో జలంధర్ లో ఏఐకేఎఫ్ జాతీయ సమావేశాలు

జాతీయస్థాయిలో రైతాంగ ఉద్యమాలను మరింత బలోపేతం చేయడానికి అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 7 8 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరగనున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దారపు రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరికుప్పల వెంకన్న, గిరిజన రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వి తుకారాం నాయక్ హాజరవుతారని తెలిపారు.

ముగిసిన పాదయాత్ర..

ముగిసిన పాదయాత్ర..

సగర బంధువులకు సన్మానం.

తెలంగాణ రాష్ట్ర సగర యువజన అధ్యక్షులు మర్క సురేష్ సగర..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

తొమ్మిదవ రోజు పాదయాత్ర ముగించుకొని రాత్రి భద్రాద్రి జిల్లా పాల్వంచ లో అయ్యప్ప స్వామి టెంపుల్ లో రాత్రి స్టే చేశారు. పాల్వంచ సగర బంధువులు టెంపుల్ దగ్గరికి వొచ్చి పాదయాత్రని ప్రోత్సహిస్తు శాలువాతో సత్కారించి సానుభూతి తెలిపారు. పాల్గొన్నవారు రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు ఆవుల నారాయణమ్మ సగర. పాల్వంచ కోశధికారి ఆవుల మహేశ్వరి సగర. ఆవుల పార్వతి సగర, ఆవుల లక్ష్మి దేవమ్మ సగర,ఆవుల సువర్ణ సగర, గుంటి జయలక్ష్మమ్మ సగర,ఆవుల నిరంజన్ సగర, ఆవుల సత్యం సగర, మరికొందరు సగర బంధువులు కలిశారు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

 

మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పైనే ఉందని చెప్పారు. ఈ విషయంగా శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మిషన్ భగీరథ వాటర్ మెన్ ల పనితీరుపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొంతమంది వాటర్ మెన్ లు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం, నిర్ణీత వేళలలో తగినంత సమయం నీటి సరఫరా చేయకపోవడం వల్ల పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కి ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో ప్రజలకు తక్కువ నీటిని సరఫరా చేసి తమకు కావాల్సిన పరిశ్రమలకు ఎక్కువ నీటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయన్నారు.ప్రత్యేకించి బాలానగర్, జడ్చర్ల మండలాల్లో వాటర్ మెన్ లపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో తాము ఆ పని చేయలేదన్నారు. అయితే ప్రస్తుతం వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటర్ మెన్ ల కారణంగా ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను సహించేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా వాటర్ మెన్ లు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణీత వేళలలో నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాగా మిషన్ భగీరథ వాటర్ మెన్ ల కారణంగా ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటే ప్రజలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అనిరుధ్ రెడ్డి ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాను, వాటర్ మెన్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో ఇందిరా గాంధీ ఎదురులేని నాయకురాలుగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురు తిరిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన బీహార్ రాష్ట్రంలో చాంద్ గ్రామంలో 19O8 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు.తల్లి వసంతి దేవి తండ్రి శోభిరామ్ లు ఆయన చిన్నతనంలోనే స్కూల్లో హిందువులకు ఒక కుండ క్రైస్తవులకు ఒక కుండా ముస్లింలకు ఒక కుండా అంటరాని వాళ్లకు ఒక్కకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కుండలను చూసి చలించిపోయి అందరికీ ఒకే కుండా ఉండాలన్న ఆలోచనతో అన్నిటిని మొదలుపెట్టడం జరిగింది. మనుషులంతా ఒక్కటే ఒకే కుండలో అందరం తాగాలి అని ఒక గొప్ప మనసుతో ఆలోచించేవాడు, బాబు జగ్జీర్రావ్ తండ్రి శోభిరామ్ సైన్యంలో పనిచేసేవాడు, అక్కడ అంటరానితనం వివక్ష చూసి అక్కడి నుండి ఇంటికి వచ్చి 20 ఎకరాల భూమి లో వ్యవసాయం చేస్తూ, అంటరానితనం కులవ్యక్ష మీద ప్రజలకు చైతన్యం చేయడంజరిగింది. బాబు జగ్జీవన్ రావు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుని పేరు సురేషు కూతురు పేరు మీరా కుమారి కలరు.
ఆయన సామాజికంగా ఆర్థికంగా పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు 1929లో అంటరాని ప్రజల గురించి ఉత్తర ప్రదేశ్ బెంగాల్ బీహార్ ప్రజలను సమీకరించి 35 వేల మందితో ఊరేగింపు నిర్వహించాడు. ఆయన జీవితంలో అదొక గొప్ప చరిత్ర కలిగిన రోజు అదే ఆయన రాజకీయానికి పునాది 1935లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో బాబు రాజేంద్రప్రసాద్ తో స్నేహం ఏర్పడింది,బాబు జగ్జీరావ్ 1931లో గొప్ప సైంటిస్ట్ కావాలని నిర్ణయంతో సైంటిస్ట్ ను అయితే నేను బాగుపడతా నా కుటుంబాలు బాగుపడతాయి, కానీ పేద బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి అని నిర్ణయించుకొని అంటరాని వాళ్ళు కులవ్యవక్షత దుర్భారం గడుపుతున్న మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వారి గురించి, నేనే పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఆలోచన చేస్తాడు అంటరాని వాళ్ళు చదువుకోవాలి అంటరాని వాళ్ళు మద్యపానం నిషేదించాలి పిల్లలను పశువుల కొట్టలాల్లో పనిచేయడం మానేయాలి,
నా జాతి పిల్లలు చదువుకోవాలి అని కొన్ని అభిప్రాయాలతో అట్టడుగు వర్గాలకు ఒక దిక్సూచిగా నిలిచాడు, ఆయన జీవితంలో 50 సంవత్సరాలుగా ఓటమెరుగని పార్లమెంటు సభ్యులుగా గొల్లిపొందిన మహా ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఈ భారత దేశ ఉప ప్రధాని పనిచేశారు, ఆయన ఈ దేశ కేంద్రకార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు, అందులో 7000 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అమలు చేశారు, అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అమర్
మాల మహానాడు కార్యదర్శి టంకరి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం,ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, కొతాడి నర్సింలు, ఎండి బిలాల్, కొమ్మాట స్వామి, నందిగామ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ ఫైటర్గా పోరాటం చేసిన మహనీయుడు ఆయన సేవలు మరువలేని కాబట్టి ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా లైన్స్ క్లబ్ వారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం బీసీ నాయకులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ దళిత నాయకులు కరికివిద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లద్ద నర్సింలు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు జేరిపోతుల అశోక్ గడ్డం సిద్ధరాములు ఎర్ర రాములు లైన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కైలాష్ గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ కుటుంబంలో పుట్టి సినిమా రంగంలో రాణింపు.

‘వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినిమా రంగంలో రాణింపు’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి.

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బోయిన్ పల్లి శేఖర్ గౌడ్ వ్యవసాయ కుటుంబం. శ్రీశైలం హైవేలో కొంతకాలం హోటల్ నిర్వాకుడిగా పనిచేశాడు. అనంతరం అంది వచ్చిన అవకాశంతో.. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్ గా మిత్రుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి పనిచేశారు. ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలయ్యింది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, సినిమా రంగంలో రాణించడంతో బంధువులు, స్నేహితులు శేఖర్ గౌడ్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.

క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి.

దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ…. క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జి కళ నెరవేరనున్నది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బ్రిడ్జి మీదుగా రవాణా జరిగే అవకాశం ఉన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి పన్నెండు సంవత్సరాల క్రితం అప్పటి పెద్దపల్లి ఎంపీ గా వివేక్ వెంకటస్వామి బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన నుండి బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి ఆరాతీస్తూ పనులను వేగవంతం అయ్యేలా చొరవ తీసుకున్నారు. సుమారు 35 కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణాపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది..

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

Railway

 

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండే వారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

ఎంపీ వంశీ ,ఎమ్మెల్యే వివేక్ కు రుణపడి ఉంటాం…

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

Railway

 

గత 12 సంవత్సరాల క్రితం వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, గత బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకుండా ఉండటంతో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ప్రయాణికులకు దూర భారం తగ్గనుంది…

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్

 

Railway

స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రయాణికులకు దూర భారం తగ్గనుందని అన్నారు. ఎంపీకి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

రైల్వే గేటు కష్టాలు తప్పునున్నాయి…

 

Railway

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు రైల్వే గేట్ అడ్డం ఉండడంతో రైల్వే గేటు పడిన సమయాలలో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయేవి. రైల్వే గేట్ సమీపంలో గేట్ పడిన సమయంలో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు గేట్ కష్టాలు తప్పి రవాణా సులభతరం కానుందని, ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ఏరియాలోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం యువజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
బి.సదానందం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.నర్సింగ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్
బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు.అనంతరం జె. నర్సింగ్ మాట్లాడుతూ..
దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట యోధుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం సంఘ సంస్కర్తగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సంకల్పించిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ వారు మన దేశానికి తొలి దళిత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శ పాలక అధ్యక్షులుగా పేరు గడించారని తెలియజేశారు.అలాగే అతి పిన్న వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 40 ఏళ్ల పాటు భారత దేశ పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులను చేపట్టిన గ్రామీణ కార్మికుల కోసం అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పని చేసే వారని అలాంటి మహనీయుడైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 118 వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మంచిర్యాల నియోజకవర్గ కమిటీ మరియు యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శులు సిహెచ్ వాసు,టి.విజయ్ యూత్ నాయకులు,సుజిత్,ప్రజ్వాల్, జశ్వంత్,అరవింద్,బబ్లూ, నరేష్,తేజ,యశ్వంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ, వారోత్సవాలు, జరపాలని నిర్ణయం తీసుకున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
సతీష్ యాదవ్ నివాసంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయీ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని, ఇకనుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు, ఊరు, మండలం, జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని, ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిస్కారమయ్యే వరకు పోరాడుతామని, ఇప్పటివరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని, దాడులకు భయపడమని అన్నారు
ఈ సమావేశంలో సతీష్ యాదవ్ తో , వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, పుట్టపాక బాలు,పాషా,కుమార్, శ్రీనివాసులు, సురేష్, రాముడు, కృష్ణయ్య, నాగరాజు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version