రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్…

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version