క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి.

దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ…. క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జి కళ నెరవేరనున్నది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బ్రిడ్జి మీదుగా రవాణా జరిగే అవకాశం ఉన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి పన్నెండు సంవత్సరాల క్రితం అప్పటి పెద్దపల్లి ఎంపీ గా వివేక్ వెంకటస్వామి బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన నుండి బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి ఆరాతీస్తూ పనులను వేగవంతం అయ్యేలా చొరవ తీసుకున్నారు. సుమారు 35 కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణాపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది..

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

Railway

 

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండే వారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

ఎంపీ వంశీ ,ఎమ్మెల్యే వివేక్ కు రుణపడి ఉంటాం…

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

Railway

 

గత 12 సంవత్సరాల క్రితం వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, గత బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకుండా ఉండటంతో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ప్రయాణికులకు దూర భారం తగ్గనుంది…

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్

 

Railway

స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రయాణికులకు దూర భారం తగ్గనుందని అన్నారు. ఎంపీకి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

రైల్వే గేటు కష్టాలు తప్పునున్నాయి…

 

Railway

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు రైల్వే గేట్ అడ్డం ఉండడంతో రైల్వే గేటు పడిన సమయాలలో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయేవి. రైల్వే గేట్ సమీపంలో గేట్ పడిన సమయంలో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు గేట్ కష్టాలు తప్పి రవాణా సులభతరం కానుందని, ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version