బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్. నేటి ధాత్రి
భారత దేశ మాజీ ఉపప్రధాని డా:బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం పస్తాపూర్ గ్రామంలో గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి,మరియు కోహిర్ మండలం చింతల్ ఘాట్ చౌరస్తా వద్ద గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన పస్తాపూర్ గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ వారు దేశానికి ఎంతో సేవ చేసారని కుల రహిత సమాజం కొరకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పోరాడిన మహానేత అని వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్,రాజేందర్,రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,ధన్ రాజ్,సామెల్,విఠల్,చెంగల్ జైపాల్,రాజ్ కుమార్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు.