‘ఈటెల’కు పీఎల తలనొప్పి…? ఈటెలను వదలనంటున్న పీఎలు?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా కొనసాగిన వారు ఉద్యోగం ఖాళీగా లేదు. ప్రస్తుతం తనకు పీఎల అవసరం ఎంతమాత్రం లేదన్న వినడం లేదట. వద్దుమొర్రో అని చెప్పిన మంత్రి పేషీ చూట్టే తిరుగుతూ పీఎలుగా పనిచేస్తాం అంటూ జబర్థస్తీ చేస్తున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు, ఇతరులకు పీఎల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పీఎలు, ఓఎస్డీల విషయంలో తానే స్వయంగా వారిని నియమిస్తానని, ఎవరి ఇష్టాలకు వారు నియమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఆ పనిని చేసి చూపించారు. కానీ సీఎం అంతగా ఆదేశించిన ప్రైవేట్‌ పీఎల విషయంలో మంత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఒక్కో మంత్రి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని అంటే అంత మందిని పీఎలుగా నియమించుకుంటున్నారు. దీని మూలంగా ప్రజల్లో, నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

ఈటెలను వదలనంటున్న పీఎలు

టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అప్పుడు కొంతమందిని పీఎలుగా నియమించుకున్నారు. అయితే ఈ పీఎల్లో ఓ ఇద్దరు పీఎలు ఆర్థిక అరాచకత్వాకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా నుంచి బయటకు వచ్చి ఈటెల పీఎగా కొనసాగిన వ్యక్తి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బుతో అదృశ్యమయ్యాడని తెలిసింది. ఈటెల పదేపదే ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా దాటవేసి మొహం చాటేసినట్లు సమాచారం. అయితే రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఈటెల తిరిగి మంత్రి కావడంతో పీఎగా కొనసాగుతానని ఈటెలను బ్రతిమిలాడగా అవసరం లేదని చెప్పినా వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చూసుకుంటానని చెప్పి తిరిగి విధుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వహించేందుకు ఈ పీఎ ఈటెలను ఒప్పించి హైదరాబాద్‌లోని జివికె మాల్‌ వెనకాల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఓ కార్పొరేట్‌ కార్యాలయాన్ని తెరిచినట్లు తెలిసింది. ఇదే పీఎ గతంలో తన సొంత మీడియా సంస్థ పేరుతో ఆర్థికశాఖ నుంచి ప్రకటనల రూపంలో లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక వనరుల విషయంలో తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం వల్లే ఈటెల ఈ మాజీ మీడియా జర్నలిస్టు, ప్రస్తుత పీఎకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ

ప్రస్తుతం మంత్రి ఈటెల వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ సైతం తన సెటిల్‌మెంట్ల ప్రతాపాన్ని చూపుతున్నట్లు తెలిసింది. అసలు పీఎ కాకున్న, మంత్రి పీఎగా ఒప్పుకోకపోయిన ఇతగాడు నిత్యం కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌కు తిరుగుతూ పైరవీల పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. మంత్రికే తెలియకుండా తాను పీఎనని అధికారులను పరిచయం చేసుకుని పనులన్నీ చేసుకుంటున్నట్లు తెలిసింది. టోకెన్‌ క్లియరెన్స్‌, బదిలీలు, ప్రమోషన్లు, సీఎం రిలీప్‌ఫండ్స్‌, ఎల్‌ఓసి, పనులు లేకుండా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి పేషీలో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని మెడికల్‌ సీట్లు సైతం ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న ఈ విషయాలేవి మంత్రి ఈటెల దృష్టికి రాకపోవడం గమనార్హం.

పొమ్మంటే…పోరు

ఈటెల వద్ద గతంలో పీఎలుగా పనిచేసిన వారు అవసరం లేదు అంటే కూడా వినడం లేదంటే. ఎందుకు అంతలా పీఎ పోస్టునే పట్టుకు వేలాడుతున్నారో అద్దం కావడం లేదు. ఈటెల సైతం వీరి విషయంలో సానుకూలంగా వ్యవహారించడం, అవసరం లేదని చెపితే ఏం జరుగుతుందోనని ఆలోచించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంత్రికి సంబంధించిన కొన్ని రహాస్యాలు వీరి వద్ద ఉండడం వల్లే మంత్రి వీరి విషయంలో సీరియస్‌గా ఉండలేకపోతున్నారే ప్రచారం జోరుగానే కొనసాగుతుంది.

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణలో బిజెపి కరీంనగర్‌లో బండి సంజీవ్‌, సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ సోయం బాబురావులు గెలుపొందారు.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలలో బిజెపి 4స్థానాలను గెలవడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ మొదటి నుండి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎలాగైనా కేంద్రంలో అధికారం చేపట్టి ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండాపోయింది. కేసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయస్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు వెలువడిన ఫలితాలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), నిజామాబాద్‌ ధర్మపురి అరవింద్‌ (బిజెపి), కరీంనగర్‌ బండి సంజీవ్‌ (బిజెపి), ఆదిలాబాద్‌ సోయం బాబురావు (బిజెపి), సికింద్రాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి (బిజెపి), పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్వర్లు (టిఆర్‌ఎస్‌), నాగర్‌కర్నూల్‌లో రాములు (టిఆర్‌ఎస్‌), వరంగల్‌లో పసునూరి దయాకర్‌ (టిఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌లో మాలోతు కవిత (టిఆర్‌ఎస్‌), ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు (టిఆర్‌ఎస్‌), మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), మహబూబ్‌నగర్‌లో యన్నం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), జహీరాబాద్‌లో బివి పాటిల్‌ (టిఆర్‌ఎస్‌), చేవేళ్లలో రంజిత్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసి (ఎంఐఎం) కైవసం చేసుకున్నారు.

దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం 50 స్థానాలను సొంతంగా సాధించగలిగింది.

రెండోసారి మోడీ హవా

దేశంలో రెండోసారి మోడీ హవా కొనసాగింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలు మోడీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారి ఘోరపరాజయాన్ని పొందుతాడని ప్రతిపక్షాలు కలలు కంటే వాటినన్నింటిని కల్లలుగా మార్చి, దేశప్రజలు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం దగ్గర నుండి బిజెపి తన ప్రభావాన్ని చూడగలిగింది. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. బిజెపి విజయంతో పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.

కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

ఈ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి ప్రధాని పీఠం ఎక్కవచ్చనే రాహుల్‌గాంధీ ఆశలపై బిజెపి నీళ్లు చల్లింది. ఘనవిజయంతో రాహుల్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఎంపీగా కేరళ వయనాడ్‌లో, యుపి అమేథీలో పోటీ చేసిన రాహుల్‌ కేవలం కేరళ వయనాడ్‌లో మాత్రమే తన ప్రభావాన్ని చూడగలిగాడు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీతో తలపడిన రాహుల్‌ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

పశ్చిమబెంగాల్‌లోను బిజెపి హవా

పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుండి దీదీ వర్సెస్‌ మోడీగా కొనసాగింది. అయితే ఇక్కడ బిజెపి అంతగా ప్రభావం చూపదని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 15స్థానాల్లో తన సత్తాను చాటుకుంది. తృణమూల్‌ 25స్థానాలతో సరిపెట్టుకుంది.

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు – ఖాతా తెరవని జనసేన

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్‌సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఖాతా తెరవని జనసేన

ఆంధ్ర ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీని ఆంధ్రప్రజలు ఎంతమాత్రం ఆదరించలేదు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. గాజువాకలో మొదట్లో పవన్‌ లీడ్‌లో ఉన్నా విజయం దక్కలేదు. మరోవైపు భీమవరంలో పవన్‌ మూడోస్థానంలో నిలవాల్సి వచ్చింది.

వెనుకంజలో మంత్రులు, మంత్రుల కుమారులు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ సునామీలో ఓటమి బాట పట్టారు. వీరితోపాటు కొంతమంది మంత్రుల కుమారులు సైతం ఓటమి పాలయ్యారు.

పార్లమెంట్‌ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ హవా

ఆంధ్రప్రదేశ్‌లోని పార్లమెంట్‌ స్థానాల్లో సైతం వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ మెరుపు వేగంతో దూసుకుపోయింది. టిడిపి, జనసేన పార్టీలు పార్లమెంట్‌ ఖాతా కూడా తెరవలేకపోయాయి. 25స్థానాల్లో వైఎస్సార్‌సీపీ లీడ్‌ ఇలాగే కొనసాగితే దేశంలో అతిపెద్ద మూడోపార్టీగా వైఎస్సార్‌సీపీ అంతరించి రికార్డు సృష్టించబోతుంది.

పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు

కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో తన అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కొంత మైర అయినా ప్రభావం చూపుతున్న జన సేన ఒకే ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ తన హావాను కొనసాగిస్తోంది. 13స్థానాల్లో అధిక్యాన్ని కనబరుచుతుండగా టిడిపి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తానికి వైఎస్సార్‌సీపీ ఆంధ్రలో గెలుపు సునామీని సృష్టించబోతుందని స్పష్టమవుతోంది.

జీవితాన్నిచ్చిన గ్రామానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టం : కౌడగాని కవితరాంబాబు

కష్టపడి వృద్ధిలోకి వచ్చిన కుటుంబంలో ప్రధాన పాత్ర ఆమెది.కోట్ల రూపాయల వ్యాపార వ్యవహారాలు చూసుకునే కుటుంబంలో కీలకపాత్ర కావడంతో వ్యాపార వ్యవహారాలే కాక అదనంగా కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకునేది. తీరిక లేని జీవితం. కుటుంబం,వ్యాపారాలే ప్రధాన అంశాలుగా సాగిపోతున్న కుటుంబమే అయినా అమే ఆలోచన జీవితాన్నిచ్చిన గ్రామంపై పడింది. పలు కంపనీలకు మెనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటికి తన బాధ్యతలను పక్కనబెట్టి పూర్తి సమయాన్ని గ్రామ అభివృద్ధికి కేటాయించి గ్రామం,గ్రామ ప్రజల ఋణం తీర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో వ్యాపారవ్యవహారాలను పక్కనబెట్టి గ్రామసేవ చేయడానికి ముందుకోచ్చింది. అందుకోరకు ముందుగానే గ్రామ పరిస్థితులను అధ్యయనం చేసింది. అందు కోరకు గ్రామంలో ముందుగా నాయకులు,ప్రజల మధ్య సఖ్యతకు బాటలు వేసి విజయం సాధించింది. గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు,అవసరమైన కనీస సౌకర్యాలు,జరగాల్సి అభివృద్ధి గురించి తెలుసుకుంది.గ్రామసేవకు అమె పడుతున్న తపనను గుర్తించి ప్రజలు అమేకు ప్రథమపౌరురాలిగా పట్టంకట్టారు.పాలన బాధ్యతలు చెపట్టింది మొదలు ప్రభుత్వ నిధులు,పాలకుల సహకారం కోరకు ఎదురు చూడకుండా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా స్థానిక ప్రజలకు అవసరమైన అన్ని కార్యమ్రాలు నిర్వహిస్తూ గ్రామ రూపురేఖలు మార్చేందుకు పాలుపడుతూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతూ మరో నాలుగేళ్ళలో మా గ్రామాన్నే చూసి ఆదర్శ గ్రామానికి నిర్వచనంగా చెప్పుకోవాలనే లక్ష్యంగా ముందుకు వచ్చిన కొత్తపల్లి గ్రామ ప్రథమపౌరురాలు కౌడగాని కవితరాంబాబు తో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామంలో ఎంతమంది జనభా ఉన్నారు, ఓటర్లు ఎంత మంది.?

సర్పంచ్‌:గ్రామంలో మొత్తం 2080 మంది జనాభా,1587 మంది ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నారు.

ప్రతినిధి: పన్నుల వసూళ్ళ కార్యక్రమం ఎంత వరకు జరిగింది?

సర్పంచ్‌:ప్రస్తుతం గ్రామంలో స్థానిక సిబ్బంది,సంబంధిత అధికారులు,గ్రామ ప్రజల సహకారంతో 50 శాతం పన్నులు వసూళు చేయడం జరిగింది. పన్నుల వసూళ్ల గురించి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.దాని కోరకు సంబంధిత స్థానిక అధికారులు,సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.పన్నుల చెల్లింపుల వలన జరిగే మార్పులను స్థానిక ప్రజలు గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుల్లో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి గ్రామంలో 100శాతం పన్నులు వసూలు చేస్తాం.

ప్రతినిధి: ఈ వేసవిలో గ్రామ ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారా..?

సర్పంచ్‌: ప్రస్తుతానికి గ్రామంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో నీటి సమస్యలు అధిగమించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు బోర్లను కూడా ఏర్పాటు చేశాం.వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చూసేందుకు శాయశక్తులా మా పాలకవర్గం పాటుపడుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది.ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా పాటుపడతా.

ప్రతినిధి: గ్రామంలో మిసన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయా…?

సర్పంచ్‌: గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాలేదు. మిషన్‌ భగీరథ పనులు ఇప్పటికే పూర్తి అయి ఉంటే మంచినీటి విషయంలో చాలా వెసులుబాటు ఉండేది.కాని పూర్తి అవ్వలేదు. మిషన్‌ భగీరథ పనుల్లో గ్రామంలో నల్లాలు ఎర్పాటులో జాప్యం జరుగుతుంది.పనులు జరగాల్సి ఉంది. సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం.వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రతినిధి: గ్రామంలో మరుగుదొడ్లు,ఇంకుడు గుంతల నిర్మాణాలు ఏ మేరకు పూర్తి అయ్యాయి.?

సర్పంచ్‌: గ్రామంలో ఇప్పటికే 70శాతం మరుగుదొడ్లు పూర్తి అయ్యాయి. మిగిలిన 30శాతం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులతో నిర్మాణాలు చేసుకోని వారికోరకు అవసరమైన ఆర్ధిక చేయూతను ఇస్తాం.అధే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణం కొరకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకుడుగుంతల నిర్మాణాల వలన కలిగే ప్రయోజనాలను గురించి ప్రజలకు చైతన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహించి మరుగుదొడ్లు,ఇంకుడుగుంతల నిర్మాణాలను పూర్తి చేస్తాం.

ప్రతినిధి: హరితహారం కార్యక్రమం కొరకు ఎలాంటి ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.?

సర్పంచ్‌: నూతన పంచాయితిరాజ్‌ చట్టంలో హరితహారం కార్యక్రమానికి ప్రత్యేకస్థానం ఉంది. హరితహారం కార్యక్రమం కోరకు ఇప్పిటికే గ్రామంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీలో మొక్కలు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో హరితహారం కార్యక్రమం కొరకు గ్రామం ప్రారంభం దగ్గర నుండి చివరి వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాం. అధే విధంగా గ్రామం మొత్తంలో రోడ్లకు ఇరువైపులా అవసరమైన మొక్కలను నాటడం,గ్రామంలో ప్రతి ఇంటికి పూల,పండ్ల మొక్కలను పంపిణీ చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాం. అధే విదంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి,మొక్కలను సంరక్షించడానికి ప్రథమ పౌరురాలిగా ప్రతి మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను సంరక్షణ కోరకు ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను నియమించడం జరుగుతుంది.

ప్రతినిధి:గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రధానం అంతర్గరోడ్ల నిర్మాణాలను ప్రధాన సమస్యగా ఉన్నాయి. వీటి నిర్మాణాలకు కోరకు ఇప్పటికే గ్రామంలో రోడ్ల నిర్మాణాలు లేని అన్ని వీధుల్లో మొరంతో మెటల్‌ రోడ్ల నిర్మాణం చేశాం.అధే విధంగా చాలాకాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయిన గ్రామపంచాయితి నిర్మాణ సముదాయాన్ని తిరిగా నిర్మాణం చేయడం సమస్యగా ఉంది . అందుకే పాలన బాధ్యతలు చేపట్టగానే నిర్మాణం కోరకు అవసరమైన అన్ని పనులను మొదలు పెట్టడం జరిగింది.గ్రామంలో స్మశాన వాటిక పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని దృస్టికి రాగానే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగింది. గ్రామంలో పక్కా గృహాల సమస్య ఉంది. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూం పథకం పరిధిలో గ్రామానికి 60 గృహాలు మంజూరు అయి ఉన్నాయి.వాటికి తోడు మరో 60 ఇండ్లు వస్తే గ్రామంలో ప్రజలకు పక్కా ఇండ్ల సమస్య తీరుతుంది.గ్రామంలో మరో ప్రధాన సమస్య ఆకేరువాగుపై చెక్‌డ్యాం నిర్మాణం జరగాల్సి ఉంది.వీలైనంత త్వరగా దీని నిర్మాణం ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్‌ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు కమ్యూనిటి భవనాల నిర్మాణాలు జరగాల్సి ఉంది. వీటిని మా పాలకవర్గం సమయంలో పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం.అధే విధంగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక వివో భవనం కావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు,గ్రామంలో డంపింగ్‌ యార్డు,స్మశాన వాటికనిర్మాణాలు జరగాల్సి ఉంది. ఈవిషయంలో సంబంధిత అధికారులు వీలైనంత త్వరగ పనులు పూర్తి చేయాలి.గ్రామంలో సైడ్‌ డ్రైనేజిల సమస్య కూడా తీవ్రంగా ఉంది.

ప్రతినిధి:గ్రామంలో విద్యాపరమైన అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. దాని కోరకు ప్రత్యేకంగా ఈ నెల 20వ తేదిన గ్రామం నుండి విద్యావంతులుగా ఉన్న వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు చేయాల్సిన కార్యక్రమాలను గురించి చర్చిస్తాం. అధే విధంగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు గ్రామ విధ్యావంతులు,సర్పంచ్‌,పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి,ప్రైవేటు పాఠశాల వద్దు- ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించే కార్యక్రమం చేయబోతున్నాం. గ్రామంలో విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసాగా వారికి స్వంత ఖర్చులతో వారి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధేవిధంగా విద్యకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలను దత్తత తీసుకొనే ఆలోచన ఉంది.ప్రజల సహకారం ఉంటే ఈ కార్యక్రమం తప్పక విజయవంతం అవుతుంది. విజయవంతం చేస్తాం

ప్రతినిధి: మీ విజన్‌ ఏమిటి..?

సర్పంచ్‌: గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతోనే సర్పంచ్‌గా పోటి చేయడం జరిగింది. ంశంలో వారి అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు నాకు సహకరిస్తారనే నమ్మకం నాకుంది.అందుకే గ్రామానికి నా శక్తివంచన లేకుండా సేవ చేయాలనే పట్టుదలతో ఉన్నాను.గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాదించే దిశగా అడుగులు వేస్తున్నాం.కాని ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధించి విజయానికి నిర్వచనంగా చెప్పుకునే స్థాయికి గ్రామాన్ని తీసుకెళ్ళడే లక్ష్యంగా పని చేస్తా.గ్రామంలో ప్రజలు అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలనేదె మా ప్రాధాన లక్ష్యంగా ఎంచుకుని తద్వారా ఆదర్శ గ్రామంగా తీర్చదిద్దుతా.అధే విధంగా గ్రామంలో యువతకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరి ఏర్పాటు,అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందకు ప్రత్యేక కార్యక్రమాన్ని చెపట్టడం,గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మాణం దీని కోరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాం.నిర్మాణం కోరకు తెలిసిన దాత 5లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది.అధే విధంగా గ్రామాన్ని నిజమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను సమయాణుగుణంగా నిర్వహించి పూర్తి ఆదర్శ గ్రామంగా నిర్మాణం చేసి ప్రజల మన్ననలు పొందుతాం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతే : పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి.

ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో కలిసి మంగళవారం నామినేషన్‌ ధాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని..ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్‌ఎస్‌ పార్టీదేనని అన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతి ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు.

రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషి చేస్తుంటే..కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ..అభివద్ధి నిరోధకులుగా మిగిలిపోతున్నారని ఆరోపించారు. ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాకరించాలని సూచించారు. అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచంపల్లి, అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు బండా ప్రకాష్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌లు, పలు కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాకవి కాళోజి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది : పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు

నల్లబెల్లి మండలంలో జరుగుతున్న మండల పరిషత్‌ ,జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్షంగా అన్ని స్థానాలతో పాటు జడ్పీటిసి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని నర్సంపేట శాసన సభ్యులు  .శుక్రవారం నర్సంపేట డివిజన్‌లోని ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి నల్లబెల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్నతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గత ఇరవైఅయిదు సంవత్సరాలుగా నల్లబెల్లి మండల ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నానని, ఇక్కడి నుండే తనకు రాజకీయ అవకాశం వచ్చిందని, నల్లబెల్లి మండల ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు. తన సతీమణి స్వప్నకు అధిష్టానం జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించిందని అన్నారు .

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా సతీమణికి జడ్పీటీసీ అవకాశం దక్కనందున కొందరు ఆరోపణలు చేశారని తెలుపుతూ తన ప్రచారానికి ఒక్కరోజు కూడా రాలేదన్నారు .అయినప్పటికీ మండల ప్రజలు ,ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎంతో విశ్వాసంతో ఆమె గెలుపు కోసం ఎవరికి వారిగా కషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని అన్ని జడ్పీటీసీ స్థానాలలో నల్లబెల్లి నుండి పదివేల మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ పదవిపై వస్తున్న ప్రచారం పట్ల అడుగగా అధిష్టానం మేరకు నడుచుకుంటానని ఇప్పటికీ త్పత్తి కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు. జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్న సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు సెవా వేసేందుకు తెలంగాణ ఉద్యమకారురాలుగా ఎన్నికల బరిలో దిగానని ఆమె తెలిపారు. మండల ప్రజలు, పార్టీ శ్రేణులు తనకు జడ్పిటిసిగా పట్టం కట్టడానికి ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాటలో నడుస్తామని తెలుపుతూ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్‌ రాజారాం, నాయకులు సట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, దార్ల రమాదేవి ,మాజీ సర్పంచ్‌ కోటిలింగాచారిలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఖర్చుల డబ్బులను ఇవ్వాలని కోరుతూ బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాక రాజు ఎంపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బహిరంగ లేఖను రాసారు .ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహబూబాబాద్‌ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మహిళలతో రోడ్‌షోను నిర్వహించారని తెలిపారు .కోలాటం మహిళలకు ఒక్కరికి వంద రూపాయల చొప్పున 550 మందికి 55000 అలాగే మంచినీటి ప్యాకెట్ల కోసం 800రూపాయలు ఖర్చు అయ్యాయని ,అందుకు పార్లమెంటు అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ , నర్సంపేట ఎన్నికల ఇంచార్జి బోడా వీరన్న ముప్పైనాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా 26300 రూపాయలను ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ రాజు ఆరోపించారు.

వీరన్నను ఎన్నికల ఖర్చుల మిగతా డబ్బులు ఇవ్వమని అడిగితే గతంలోనే ఇచ్చారంటూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఈ విషయంపై అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌ కు వివరించి తెలుపగా గతంలోనే మొత్తం డబ్బులను వీరన్నకు ఇచ్చామని తెలిపినట్లు ఆయన తెలిపారు. కోలాటం సంబంధించిన మహిళలు ప్రతిరోజూ తమ ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారని, దీంతో దిక్కులేని స్థితిలో మనస్తాపానికి గురైతున్నట్లు రాజు వివరించారు. వెంటనే డబ్బులను జిల్లా పార్టీ అధిస్థానం ఇప్పించాలని కందగట్ల రాజు కోరారు.

ఇక్కడ బిజెపి ఉందా…చెప్పుతో కొడతా : దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

 దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి

శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్‌ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి అభ్యర్థి కోడెపాక స్వరూప ఓటర్లకు బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, శాయంపేట జడ్పీటిసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర జ్యోతి మండలకేంద్రంలో స్వరూప వద్దకు వెళ్లి ఇక్కడ ఇంకా బిజెపి ఉందా…బిజెపి ఎక్కడిది…బిజెపికి ఓటు వేయాలని అడుగుతున్నావా…చెప్పుతో కొడతా…అంటూ దళిత మహిళ అయిన స్వరూపను ఇష్టం వచ్చినట్లు తిట్టిందని బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప తెలిపారు.

ఈ సందర్భంగా కోడెపాక స్వరూప మాట్లాడుతూ శుక్రవారం పోలింగ్‌ కేంద్రం వద్ద తాను ఓటర్లకు పువ్వుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గండ్ర జ్యోతి తన వద్దకు వచ్చి దళిత మహిళనైన నన్ను చెప్పుతో కొడతానని ఇష్టంవచ్చినట్లు తిట్టిందని ఆరోపించింది. గతంలో తాను ఉపసర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని కూడా మరచి నన్ను చెప్పుతో కొడతానని అనడం టిఆర్‌ఎస్‌ పార్టీ దౌర్జన్యానికి అగ్రకుల అహాంకారానికి గండ్ర జ్యోతి వ్యవహారించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-2 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా : ఐనవోలు మండల టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గజ్జెల శ్రీరాములు

పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా

పార్టీల్లో నాయకులుగా ఉండడం పదవులు ఆశించడం ఎలాగోలా ఎదో ఒక పదవి తెచ్చుకొవడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధరణంగా చూస్తునే ఉంటాం. మరికొంతమందైతే ధనబలాన్ని,బంధుత్వబలాన్ని ఉపయోగించుకుని నేరుగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తులను చూస్తూనే ఉంటాం. కాని ఎలాంటి పదవులు లేకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కనీస ఆదరణ లేని సమయంలో పార్టీలోకి వచ్చి ప్రజల ఆకాంక్షను నేరవేర్చే ఉద్యమంలో తనవంతు పాత ఉండాలనే సదుద్దేశ్యంతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి పార్టీ కార్యమ్రాల్లో పాలు పంచుకుంటూనే పార్టీని క్రమంగా ముందుకు తీసుకెళ్ళడంలో అహర్నిశలు కష్టపడ్డాడు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న విధానంతో నానాటికి కార్యకర్తలు పెరుగుతూ వచ్చారు. పార్టీ కొరకు,ప్రజల ఆకాంక్ష కొరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా వెచ్చించకుండా దొరికిన ప్రతి క్షణాన్ని పార్టీ నిర్మాణానికి,ఉద్యమ ఒరవడికే కేటాయించారు. పార్టీ నిర్మాణం కోరకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను 18 సంవత్సరాల కాలంపాటు మండలపార్టీ అధ్యక్షుడిగా కోనసాగించాయి. రాష్ట్రంలో తెలుగుదేశం,కాంగ్రేస్‌ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏనాడు ఉద్యమస్ఫూర్తిని వీడలేదు.తాను భాగస్వామ్యం అయిన ఉద్యమ ఫలితం రాష్ట్రం సిద్దించినా,తాను కార్యకర్తగా పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏనాడు పదవుల కోరకు పాకులాడని సహనం ఆయన సోంతం.అందుకే ఆయనను ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ,స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ల నిర్ణయం మేరకు జెడ్పీటీసి సభ్యుడిగా పోటి చేస్తున్నారు.ఆయనే మండలంలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల శ్రీరాములు.ప్రస్తుత ఎన్నికల ప్రచారం,తన అభ్యర్ధిత్వంపై గ్రామాల్లో ప్రజల నుండి వస్తున్న ఆదరణ తదితర అంశాలను గురించి ఆయన పంచకున్న విశేషాలు నేటిధాత్రిలో ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామాల్లో ప్రచారం ఎలా జరుగతుంది.?

జడ్పీటిసి అభ్యర్ధి: గ్రామాల్లో ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ అభ్యర్ధుల ప్రచారంతో పాటు జడ్పీటీసి అభ్యర్ధిగా నేను కూడా ఒక ప్రణాలికతో ప్రచారంలో ముందకు సాగడం జరుగుంది. ఇప్పటికే స్వయంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అధే విధంగా స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌,నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావులతో మరోమారు గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించాం.

ప్రతినిధి: ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.?

జడ్పీటీసి అభ్యర్ధి: ప్రజల చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల్లో ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పాల్సి వచ్చేది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను గురించి ప్రతి వ్యక్తి ఈ రోజు చర్చించుకుంటున్నారంటే ఫ్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల చెంతకు చేరాయి. ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అందుకే వారు ఈ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను వ్యక్తిగతంగా కంటే పార్టీ అభ్యర్ధులుగా ఆదరిస్తున్న తీరు హర్షనీయం.

ప్రతినిధి: పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఏఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నారు?

జడ్పీటీసి అభ్యర్ధి: పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్ధుల ఎంపికలో స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కోరకున్న అభ్యర్ధులకు అభ్యర్ధిత్వం ఇవ్వడానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.అధే విధంగా గ్రామాల్లో పార్టీ విధేయులకు,పార్టీ కోరకు పని చేస్తూ సేవ చేయగలగే వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపికను ప్రజలు గమనించారు.కాబట్టే ఇప్పటికే మండలంలో ఉన్న ఐనవోలు 1 ఎంపిటిసి,వనమాల కనపర్తి అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధే విధంగా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయం

ప్రతినిధి:మీకు జెడ్పీటీసి అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం?

జడ్పీటీసి అభ్యర్ధి: అధికారం కోసం మాత్రమే కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే స్ధానికంగా పార్టీ కోరకు,రాష్ట్రం కోరకు పని చేసిన గులాబీ సైనికులు చాలామంది ఉన్నారు. ఇంతకాలం పార్టీలో ఇచ్చిన బాధ్యతలు నిర్వహించిన తీరు,ఉద్యమ నేపథ్యం ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని తనకు అవకాశం ఇచ్చారు.ఇచ్చిన అభ్యర్ధిత్వం ప్రజలు ఆశిర్వదించి జెడ్పీటీసిగా ఎన్నుకుంటే ఈ తరుణంలో మరింత భాద్యత పెరుగుతుందనే అనుకుంటున్నా. ఎందేకంటే మండలంలో ఉన్న ఉద్యమకారులను,పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సి బాధ్యత నాపై ఉంది.బహూశా రానున్న రోజుల్లో ఉద్యమకారులకు మంచి రోజులు వస్తాన్నాయనే ఒక సూచనను ఇవ్వడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారని భావిస్తున్నా.ఎది ఏమైనా తనపై నమ్మకంలో తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుకుని తన విజయాన్ని స్థానిక శాససభ్యులు ఆరూరి రమేష్‌కు కానుకగా ఇస్తా. అధే విధంగా తన అభ్యర్ధిత్వానికి సహకరించిన నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు,అంతేకాకుండా తన ప్రచార కార్యక్రమాల్లో సహకరిస్తున మండల పార్టీ అధ్యక్షుడు మునిగాల సమ్మయ్య,మండల పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవిందర్‌, మార్నేని యువసేన బాధ్యులు డబ్బా శ్రీనులకు ఋణపడి ఉంటా.

ప్రజలే మా కుటుంబం…సేవయే కర్తవ్యం : ఐనవోలు-1 ఎంపిటిసి అభ్యర్ధి మార్నేని మధుమతి రవిందర్‌రావు

కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?

మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?

మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.

ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?

మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాల సమగ్ర అభివద్ధి జరుగుతుందని బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి జనగామ కిష్టయ్య, ఎల్కతుర్తి గ్రామ ఎంపిటిసి అభ్యర్థి బొజ్జ హరీష్‌, దామెర గ్రామ ఎంపిటిసి అభ్యర్థి పర్వీన బేగంకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతత్వంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గ్రామాలు అభివద్ధి చెందాలనే సంకల్పంతో అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఎక్కడ అవినీతి ఉండకూడదనే దఢ నిశ్చయంతో ప్రధాని నరేంద్రమోడీ వేలకోట్ల రూపాయలు తెలంగాణకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చిన అభివద్ధి శూన్యం అని అన్నారు. నేడు గ్రామాల అభివద్ధి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని, నరేంద్రమోడీ ద్వారా నిధులను తీసుకువచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ది చేయడానికి అవకాశం ఉంటుందని, ప్రజలందరూ కోరుకునేది ఒక్కటే జడ్పీటీసీ అభ్యర్థిగా, ఎంపిటిసి అభ్యర్థిగా బిజెపికి ఓటువేసి గెలిపించి గ్రామాల అభివద్ధికి తోడ్పడాలని రావు పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమూర్తి శివకుమార్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ పాశికంటి రాజేంద్రప్రసాద్‌, మండల అధ్యక్షుడు వర్ధన్‌, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి అశోక్‌, మండల నాయకులు చిరంజీవి, ఎర్రగొల్ల రాజు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో ముందుకు సాగనివ్వని పాలకుల దగ్గర ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించి ప్రజలు కోరకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అముల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ చేసిన అభివృద్ధి చూసి పరిషత్‌ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని శాసనసభ్యుడు అరూరి రమేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మండలంలోని చెన్నారం,ఉప్పరపల్లి,నల్లబెల్లి,ల్యాబర్తి,కొత్తపల్లి గ్రామల్లో జెడ్పీటీసి అభ్యర్ధి మార్గం భిక్షపతితో కలిసి ఆయా గ్రామాల ఎంపిటిసి అభ్యర్ధులతో ప్రచారం నిర్వహించారు. ఈసంధర్భంగా ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయా గ్రామాల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు దివించాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో ముందు నుండి ఉద్యమించి పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఇంత వరకు నిలిచిన నాయకుడు మార్గం భిక్షపతిని జెడ్పీటిసి అభ్యర్ధిగా ప్రజలపై నమ్మకంతోనే మీ ముందుకు పంపిందని అన్నారు. అదే విధంగా పార్టీ నిర్ణయాలు,ప్రజలు కోరకున్న వ్యక్తులకే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్ధులుగా ఖరారు చేసినట్లు అరూరి తెలిపారు. మండలంలో 11 స్థానాలకు గాను ఇప్పటికే 2 స్థానాలు ఎకగ్రీవం ఆయ్యాయని మిగతా 9 స్థానాలకు 9 స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మార్నేని రవిందర్‌రావు,జెడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి,మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,పార్టీ ఎన్నికల ఇంచార్జీలు,పార్టీ ముఖ్యనాయకులు,ప్రజలు పాల్గోన్నారు.

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పరిషత్‌ ఎన్నికల ప్రచారం మండలంలో జోరుగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి మార్గం బిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థిని అన్నమనేని ఉమాదేవి గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి మార్నేనీ రవిందర్‌రావు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ నిధులతో గ్రామాలలో అభివద్ధి పనులుచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్‌ నాయకత్వంలో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, గ్రామ ఇంచార్జ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, అధ్యక్షులు మున్నురు సొము, చీకొండ యాకయ్య, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నర్సింగరావు, మాజీ ఎంపిటిసిలు నిరంజన్‌, మండల నాయకులు తుమ్మల యాకయ్య, హరిప్రాసాద్‌, సుభాష్‌, గ్రామ ముఖ్యనాయకులు కోంరయ్య, సారంగం, ఉపసర్పంచ్‌ కళింగరావు, టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఉపాధి పనులు చేసి ప్రచారం

ఇల్లంద గ్రామంలో చెరువు గట్టు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలిల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి జడ్పిటిసి మార్గం భిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థి పిట్టల జ్యోతిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సాంబయ్య, మాజి సర్పంచ్‌ తూళ్ళ కుమారస్వామి, అధ్యక్షుడు ఎల్లస్వామి, ఇంచార్జులు, మోహన్‌రావు, పూజారి రఘు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌, అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదష్టకరమైన సంఘటనలుగా సిఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సిఎం విజ్ఞప్తి చేశారు.

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎ.అశోక్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల పేపర్ల వాల్యువేషన్‌, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ ఏడాది 9.74లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారని, వారిలో 3.28లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని, మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. వారి అనుమానాలు నివత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ-వెరిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ-వెరిఫికేషన్‌ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ-వెరిఫికేషన్‌ చేయాలి. రీ- వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్‌, జెఇఇ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియట్‌తోపాటు ఎంసెట్‌ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంటర్మీయట్‌ విద్యార్థుల డాటా ప్రాసెస్‌, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ-ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోడ్‌ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. ‘ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామనే బాధతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదష్టకరం. ఇంటర్మీడియట్‌ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? : విజయశాంతి

ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రధాన పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. తమిళనాడుకు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడు అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీ తరపున ప్రచారం చేసి, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను అక్కడి ప్రజలకు వివరించి ఉండొచ్చు కాదా అని అన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి ఆ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పే విషయంపై క్లారిటీ వచ్చేదని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు తాను మద్దతు తెలపడంతోపాటూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను జేడీఎస్‌ కాపీ కొట్టడం వల్లే కుమారస్వామి సీఎం అయ్యారని కేసీఆర్‌ ప్రచారం చేసుకున్నారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నుండి కుమారస్వామిని గెలిపించానని చెప్పుకున్న కేసీఆర్‌, పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక వైపు ఎందుకు ఒకసారి కూడా చూడలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని ఎద్దేవా చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి, కొందరు ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానని హడావుడి చేసిన కేసీఆర్‌ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. గతంలో తాను కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే, దాని అర్ధం కేసీఆర్‌ మాట ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు, మనిషి మాత్రం మోడీ నేతత్వంలోని బీజేపీ వైపు ఉన్నారనే విషయంపై తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందని అన్నారు. కొన్ని విషయాలను ఎంత దాచాలన్నా దాగవని తెలిపారు.

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

నేటిధాత్రి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ సీన్‌నే రిపీట్‌ చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ముఖాముఖి ఏకి పారేసిన చంద్రబాబు దేశ రాజధానిలోను అదే సీన్‌ను కొనసాగించారు. సిట్టింగ్‌ ఎంపీలు, మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఆయన వైఎస్సార్‌సీపీ, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని కౌంటింగ్‌ కాకముందే బాబు కొత్త పల్లవి అందుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన ఈ కామెంట్లపై ఏపీలో రకరకాల విమర్శలు వినవస్తున్నాయి. ఓటమికి కావల్సిన సాకులను బాబు ముందస్తుగానే వెతుక్కుంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రం రావణకాష్టం

ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు చంద్రబాబు ఆరోపించారు. శని, ఆదివారాలు ఢీల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి కారణం ఎవరు అని ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15మంది టిడిపి ప్రతినిధుల బందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అధికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైఎస్సార్‌సీపీ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

మోడీ సూచనలతో ఈసీ ఏకపక్ష వైఖరి

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓటువేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోడీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదన్నారు.

తెల్లవారు వరకు పోలింగ్‌..ఇదేం ప్రజాస్వామ్యం?

సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదని, తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరిగిందంటే ఇదేం..ప్రజాస్వామ్యం..ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందంటూ సీఎం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హత్య జరిగినా..మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వేలసంఖ్యలో ఈవీఎంలు ఫెయిల్‌ కావడానికి కారణమేంటని నిలదీశారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని సీఎం గుర్తు చేశారు.

ఆ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులా?

పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని, తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేపర్‌ బ్యాలెట్‌లపై అందరికీ అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయన్నారు. బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16గంటల సమయం పడుతుందని, మరి వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరురోజుల సమయం ఎందుకు అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

 

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?

నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…? అక్కడ జగన్‌ వాహా కొనసాగుతుందా…? గురువారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఆంద్రప్రజలు జగన్‌ వైపే మొగ్గుచూపారా…? ప్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలు కానుందా…? ఇలాంటి అనేకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్నాయిట. మెజార్టీ ప్రజలు జగన్‌నే సమర్థించారని సంకేతాలు వెలువడుతున్నాయట. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఇక్కడ జోరుగానే కొనసాగుతుంది. రెండోసారి అధికార పీఠం ఎక్కేందుకు చంద్రబాబు తన సర్వశక్తులు ధారపోసి విజయం బాటన కొనసాగేందుకు ప్రయత్నించిన ఈసారి జగన్‌కే ఎపీ ప్రజలు పట్టం కట్టనున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

బాబుకు ముందే తెలుసా…?

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఆధారంగా తాము ఓటమి బాటపట్టనున్నామని అర్థమయిపోయిందని తెలిసింది. అయితే దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈసితో గొడవకు దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఈసి పక్షపాంతంగా వ్యవహరిస్తుందని ఎన్నికల కార్యాలయం ముందు ధర్నాకు దిగడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు నేరుగా వార్నింగ్‌లు ఇవ్వడం ఇవన్ని ఓటమిని ఒప్పుకున్నట్లు సంకేతాలేనని అంటున్నారు. దీనికి తోడు ఓట్ల లెక్కింపు విషయంలో సైతం అనుసరించాల్సిన విషయాలు, వివిప్యాట్‌ స్లిప్పుల విషయంలో సైతం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ టూర్‌ పెట్టుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేంద్ర ఎన్నికలకమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం…వింటే సరేసరి లేదంటే అక్కడ ధర్నా చేస్తాం అంటూ బాబు మరోసారి సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు నిజంగానే ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఎపీలో కొనసాగుతుంది.

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తోందా…?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం కోల్పోనున్నాడు. జగన్‌ అధికారంలోకి వస్తాడని తెలంగాణ సీఎం కేసిఆర్‌ ముందే తెల్చేశారు. చంద్రబాబుకు తాము రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని ప్రకటించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే బాబు ఓడిపోవడం, జగన్‌ అధికారంలోకి రావడమేనని ప్రస్తుతం ఆంధ్రా ప్రజలకు అర్థమయ్యిందట. బాబు అధికారం కోల్పోతే కేసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ విజయవంతం అయినట్లేనని ప్రజలు భావిస్తున్నారట. మొత్తానికి కేసిఆర్‌ జగన్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ పాఠాలు చెప్పి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేలా సహకరించారని తెలంగాణ కేసిఆర్‌ సక్సెస్‌ కావడమే కాకుండా ఎపీలో జగన్‌ను సైతం తానే విజయం బాట పట్టించాడని, అనుకున్న రీతిలో జరిగితే ఇద్దరికి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికసంఖ్యలో ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సైతం టిఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలు కీలకం కానున్నాయనే తెలుస్తుంది. కేంద్రంలో ఒకవేళ హంగ్‌ చాన్స్‌ ఉంటే వీరు కీలకం కావడంతోపాటు, ఇటీవల మోడ శత్రువునైనా కలుపుకుంటామని అనడంతో వీరు ఎన్డీయే వైపు మొగ్గుచూపుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తానికి ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుపు గుర్రం ఎక్కబోతుందనే భయం బాబులో కనపడుతుందని టిడిపిలో సైతం చర్చజరుగుతోందట.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version