ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే చేతుల మీదుగా యంత్రచేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి దైవకార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి విషయంలోనూ ఏకతాటిపై ఉండాలని సూచించారు.ఆలయ ప్రాంగణంలో సీసీ నిర్మాణం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి శిష్యులు కిడాంబి నరసింహ దేశికనచార్యులు యాగ్గిక బృందం, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్ రెడ్డి జంగా జనార్దన్ రెడ్డి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి రామ్ రెడ్డి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి వివిధ కుల సంఘాల బాధ్యులు ఆలయ కమిటీ బాధ్యులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version