సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 

యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా ఏ-ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు ఔట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ నాక్‌తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు.

 

నోళ్లు మూయించాడు..

ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే గాక బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.. ఇలాంటోడ్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు.

అగార్కర్ ముందే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. అగార్కర్ ముందే బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతడ్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌కు మీడియా, అభిమానులను అనుమతించలేదు.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే చేతుల మీదుగా యంత్రచేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి దైవకార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి విషయంలోనూ ఏకతాటిపై ఉండాలని సూచించారు.ఆలయ ప్రాంగణంలో సీసీ నిర్మాణం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి శిష్యులు కిడాంబి నరసింహ దేశికనచార్యులు యాగ్గిక బృందం, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్ రెడ్డి జంగా జనార్దన్ రెడ్డి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి రామ్ రెడ్డి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి వివిధ కుల సంఘాల బాధ్యులు ఆలయ కమిటీ బాధ్యులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version