నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు..

నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని తోపనపెల్లి గ్రామ వాసి ఒంటెల యకమ్మ 90 గారు మరణించగా, దుఃఖం లో యుండి కూడా కుటుంబ సభ్యులు కుమారులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మధుసూదనరెడ్డి, మనుమడు కరుణాకర్ రెడ్డి మనుమలు ‘’సమాజ హితం కోరి, ‘’నేత్రదానం చేయడానికి అంగీకరించగా, “” తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో “” వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ లక్షమన్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.మృతురాలు యాకమ్మ గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునివ్వడం తో పాటు భావి వైద్యుల నేత్ర వైద్య విద్యకు ఉపయోగ పడినవారయ్యారన్నారు కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడుదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వివరాలకు 8790548706, 9908088011సెల్ నెంబర్ లలో సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లీ ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి,పాల్గొన్నారు. ‎

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని.!

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని ఇచ్చిన మాట 

తప్పకుండా నెరవేర్చిన కేటీఆర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్ళగా. సౌదీలో ప్రమాదవశావస్తు. 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో. తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా. ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దీనితో దిక్కులేని పరిస్థితులు మధ్య ఉన్న పరిస్థితిని ఇండియాలో గ్రామంలోని కుటుంబ సభ్యులకు తన దీన పరిస్థితిని వివరించారు. ఈ విషయమై మాజీ మంత్రి సిరిసిల్ల కెటి రామారావు దృష్టికి తీసుకురాగా. గ్రామంలో పర్యటించి. కుటుంబ సభ్యులను. ఓదార్చి వారికి మనోధర్యం చెప్పి. మీ బాబుని ఎలాగైనా ఇండియాకు తీసుకొచ్చి మంచి వైద్యం కల్పించే బాధ్యత నాది అని. సదురు గాయపడిన వ్యక్తితో సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడి తమకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తానని తనకు ధైర్యం చెప్పిన కేటీఆర్. సదురు గాయపడిన వ్యక్తి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీ రామారావును వేడుకున్నారు ఈ విషయమై మహేష్ కి ధైర్యం చెప్పి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు ఈ విషయమై. కేటీ రామారావు ప్రత్యేక చొరవ తీసుకొని మహేష్ నీ. ఇండియాకు తీసుకువచ్చి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అంగీకరిస్తూ సౌదీ లోని. కేటీఆర్ సంబంధించిన వ్యక్తులను పంపించి వారితో మాట్లాడి ఎలాగైనా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పంపించాలని అక్కడ వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా సౌదీలోని.ప్రభుత్వ ఆసుపత్రికి. హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ . యజమాన్యం లేఖ రాశారు. దీనిపై కేటీ రామారావు చెప్పినట్లుగానే సౌదీ నుంచి నేడు స్వదేశానికి చేరుకున్న మహేష్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మహేష్ ని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన స్థానిక నాయకులు. కెటి రామారావు చెప్పడంతో. మండలంలోని మాజీ ఎంపీపీ. భర్త. అయినా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజు.పాక్స్. చైర్మన్ బండి దేవదాస్. పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మహేష్ ను తీసుకువెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో. కేటీఆర్ ఆదేశాలతో ప్రత్యేక చొరవ తీసుకొని వైద్య సహాయ నిమిత్తం మెరుగైన వైద్యం చేయాలని. డాక్టర్ల బృందానికి కేటీ రామారావు ప్రత్యేకంగా తెలియజేశారు. మా కొడుకు. ప్రమాదవశావాస్తు గాయపడి. దిన పరిస్థితులు ఉన్న. మా వాడి పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇండియాకుతీసుకురావడానికి. కృషి చేసి. ప్రత్యేకంగా కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న మాజీ మంత్రి కేటీ రామారావుకి మా కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version