తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు
శాయంపేట నేటిధాత్రి:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ఎంపిక
పర్వ తా రోహణ శిక్షణ శిబిరానికి – మొగుళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఈనెల 25 నుంచి అక్టోబర్ 1 వ తేదీ వరకు
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో జరుగు పర్వతాహరణ శిక్షణ శిబిరానికి మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాల ఎన్.సి. సి విద్యార్థులు నలుగురు , ఎం .అర్జిత్ కుమార్ (10వ); బి అరవింద్ (10వ); జే .అరవింద్ (10వ) , పి. వీరమల్లు( 9వ) లు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పింగిలి విజయపాల్ రెడ్డి ; ఎన్.సి సి అధికారి గుండెల్లి రాజయ్యలు తెలిపారు
ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా శిబిరానికి ఎంపిక అవ్వడం పాఠశాలకు గర్వకారణం అని ఈ శిక్షణ జాతీయ సమైక్యత భావం పెంపొందించుకోవచ్చు, సాహసోపేతమైన కఠినమైన దారుల వెంట నడవడం , క్యాడర్స్ లోపల ఆత్మవిశ్వాసం ధైర్యం సోదర భావాన్ని నెలకొల్పడం కొరకు ఈ శిక్షణను ఇస్తారు అందువల్ల శిక్షణలో
మెలుకువలు తెలుసుకొని దేశభక్తిని పెంపొందించుకొని పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారిని అభినందించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. రాజు విద్యార్థులు పాల్గొన్నారు.
ధనుష్ .. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. రఘువరన్ బీటెక్తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ తమిళస్టార్… శేఖర్ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.
అమ్మాయి కోసమే ట్యూషన్లో చేరా…
మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. నేను చదువుకోవాల్సిన సమయంలో తెగ అల్లరి చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసమే ట్యూషన్లో చేరా.
ట్యూషన్ టీచర్ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్ మానేశా. కానీ స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్తో సౌండ్ చేసేవాణ్ని. దాంతో టీచర్…
‘మీరంతా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు. కానీ బయట బైక్ మీద ఉన్నవాడు మాత్రం పెద్దయ్యాక వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందే’ అని అన్నారట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… అప్పట్లో చదువు ఎందుకు అశ్రద్ధ చేశానా? అని బాధపడుతుంటా.
అందుకే ఆ పేరు…
నేను, అనిరుధ్ (సంగీత దర్శకుడు) కలసి ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’ అనే హాలీవుడ్ చిత్రం చూశాం. ఆ సినిమాలో అందరూ ‘వండర్బార్’ అనే పదం పదేపదే వాడుతుంటారు. నిజానికి అదొక జర్మన్ పదం.
ఎందుకోగానీ అది మైండ్లో బాగా రిజిస్టరైపోయింది. కట్చేస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నా. రెండో ఆలోచన లేకుండా నా నిర్మాణ సంస్థకు ‘వండర్బార్ ఫిల్మ్స్’ అని పేరు పెట్టా.
ఆయన ప్రేరణతో…
కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘హీరో మెటీరియల్ కాదు. లుక్స్ బాగాలేవు’ అని విమర్శలు గుప్పించారు. దాంతో ఆత్మన్యూనత భావన కలిగింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు బాలు మహేంద్ర…
‘నువ్వు ఇటాలియన్ మోడల్లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయి.
జోక్ చేస్తున్నారనుకున్నా..
‘కుబేర’ తమిళ్లో నాకు 51వ సినిమా. తెలుగులో రెండో స్ట్రయిట్ చిత్రం. ‘సార్’ కన్నా ముందే నాకు శేఖర్ కమ్ముల ఈ కథ చెప్పారు. ఈ సినిమా కోసం నన్ను శేఖర్ సన్నబడమని చెప్పినప్పుడు మొదట నమ్మలేదు.
‘నిజంగానే చెబుతున్నారా? లేక జోక్ చేస్తున్నారా’ అని అడిగా. ఎందుకంటే నా పర్సనాలిటీ చూసి, నన్ను సన్నబడమని చెప్పిన డైరెక్టర్ ఇప్పటిదాకా లేరు. మొత్తానికి సన్నబడి యాచకుడిగా నటించా. డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయానంతే.
7 గంటలపాటు డంప్యార్డ్లో మాస్క్ లేకుండా నటించా. నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది.
చెఫ్ అయ్యేవాడిని…
ఒకసారి మా నాన్నగారికి సరదాగా ఆమ్లెట్ వేసి పెట్టా. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత రోజు వేరే వంటకం చేసి పెట్టా. దాన్ని కూడా ఆయన చాలా ఆస్వాదించారు. దాంతో నాకు చెఫ్ అవ్వాలనే కోరిక కలిగింది.
వంట చేసి, వడ్డించేటప్పుడు ఎదుటివారి కళ్లలో కనిపించే ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఇప్పటికీ మా ఇంటికి ఎవరైనా వస్తే, నేను నా స్వహస్తాలతో వారికి వడ్డిస్తుంటా. హీరోని కాకపోయుంటే కచ్చితంగా చెఫ్ అయ్యేవాడిని.
ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన
నడికూడ నేటిధాత్రి:
మండల కేంద్రం లో రైతు భరోసా సంబురాలు.
కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతలా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించింది. అందులోనే భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతు భరోసా సంబరాలు నిర్వహించారు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి వర్గానికి, ఎమ్మెల్యే కు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ గడచిన 18 నెలలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం 1.04 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పది సవంత్సరాల కాలంలో18 వేల కోట్లు రైతుబందు ఖర్చుపెడితే కేవలం18 నెలలోనే 21వేలకోట్లు రైతు భరోసా కింద ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు.ఇది రైతు ప్రభుత్వం మని వెల్లడించారు
ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి మాలహల్ రావు,మాజీ జడ్పీటీసీ పాడి కల్పనా ప్రతాప్ రెడ్డి,పరకాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం తిరుపతి రెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,రైతులు,వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా..
గోదారి జలాలపై తెలంగాణ నీటివాటా కోల్పోయే ప్రమాదం.
చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ రాష్ట్ర నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉన్నదా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడిపై రైతులు,ప్రజలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.తన గురువు చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాజెక్టులకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కాలేశ్వరంపై అవినీతి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వినియోగించకుండా రైతుల పొలాలను ఎండబెడుతూ ఆంధ్రాలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు రామప్ప పాకాల రంగాయా చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను ఎండబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వలన గోదావరి జలాలపై తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందని, నిన్న తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను గోష్ కమిషన్ ముందు పిలిపించి రాక్షసానందం పొందిన రేవంత్ సర్కార్ కు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న నేపంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.నేడు
గ్రామాలలో,పట్టణాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.ఈ సమావేశంలో రాయుడి రవీందర్ రెడ్డి,నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,వేములపల్లి ప్రకాష్ రావు,సుకినే రాజేశ్వర్ రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి, గందె శ్రీనివాస్ గుప్త, చెట్టుపెళ్లి మురళిదర్ రావు, కామిశెట్టి ప్రశాంత్, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు
నిజాన్ని నమ్ముకున్న మహా నేత మొగుళ్ళపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాథరాజు రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాహుల్ గాంధీ దేశంలో జోడో యాత్ర ద్వారా కార్మిక , కర్షక, సబ్బండ వర్గాల స్థితిగతులపై ఏం అంశం తీసుకున్న ఆ అంశం పట్ల హుటాహుటిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం..నాడు అధికారుల వంతైతే..
నేడు ప్రతిష్టాత్మకంగా జన గణన తో పాటు కులగణన అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోడీ అంతటి నేతనే ఒప్పించిన ఘనత ముమ్మాటికి రాహుల్ గాంధీకే సాధ్యమైంది.. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వచించడం చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా కులగల చేయడం శుభపరిణామమని బీసీలు ఇంకనైనా ఆర్థికంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని యావత్ దేశం హర్షించదగ్గ విషయం.. అన్నారు