అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

తొర్రూర్ ( డివిజన్ ) నేటి ధాత్రి

 

ఎన్. పి.డి. సి.ఎల్ పరిధిలో మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంచారి మడూర్ గ్రామంలోని రైతు వేదికలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ & సేఫ్టీ ఆఫీసర్ శ్రీ పెద్ది రాజం మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు మరియు వినియోగదారులు తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు మరియు సూచనలు విపులంగా తెలియజేశారు. తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో తొర్రూరు డివిజన్ పరిధిలో జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల 16 గురు మనుషులు మరియు 30 జంతువులు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణం రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని కావున నిత్యావసరమైన విద్యుత్ వినియోగించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లలో బట్టలు ఆరేసుకోవటానికి బిగించుకునే జి.ఐ. వైర్లు పై కప్పుగా వేసుకునే ఇనుప రేకులకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగాయని అలాగే ఆకేరు వాగు వెంట ఉన్న గ్రామాల్లోని చాలామంది యువకులు చేపలు పట్టడానికి కరెంటును వినియోగించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు తమ పొలం చుట్టూ జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బిగించుకునే విద్యుత్ కంచె వలన కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఈ విధంగా చేయటం చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీ సి.ఎస్. చలపతిరావు, చిన్న వంగర మరియు తొర్రూరు అసిస్టెంట్ ఇంజనీర్లు , విద్యుత్ సిబ్బంది, రైతులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version