కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన
బిజెపి కుల గణన అంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధి
గద్వాల /నేటి ధాత్రి
60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్రన్నారు. జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్గా నిలిచారన్నారన్నారు. ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు. శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, 6 దశాబ్దాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
దేశ జనగణనలో భాగంగా కులగణనను చేపట్టి, దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక – సామజిక – సంక్షేమ లాభాలు చేకూర్చాలని ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, జిల్లా ఓబీసి మోర్చా అధ్యక్షుడు జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఐటి సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,బిజెపి నాయకులు ఢిల్లీవాల కృష్ణ,మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు ,బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి,మోహన్ రెడ్డి, రమేష్,వెంకటేష్, నరసింహ తదితరులు ఉన్నారు.