కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగసుధ మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే వరద నీరుమొత్తం కాలనీలోకి చేరి ఇండ్లు బురద మయంగా మారుతున్నాయని ,దీంతో విష సర్పాలు ఇళ్లలోకి చేరి కాలనీ వాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లె అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు కాలనీవాసులు అందరు కూడా అర్హులేనని,వారందరికీ వెంటనే ఇల్లు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అనర్హులకు కాకుండా అర్హులకు వర్తించేలా చూడాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ యు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , స్థానిక నాయకులు గజవెల్లి జగపతి , గణిపాక బిందు ఎండి ఆరిఫ్ , జను జమున , చొప్పరి పద్మ గుజ్జుల శివ , క్రొర్ర మాలమ్మ బైరవైన నరసయ్య ,ఎస్.కె సద్దాం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి -బయ్యారం :-

 

 

 

 

అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి,ప్రజానాయకుడు, మనసున్న మారాజు,అవినీతి లేని నాయకుడు, గిరిజన ముద్దుబిడ్డ,మాజీ కేంద్రమంత్రి కోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బయ్యారం పట్టణ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మహిళ కమిటీ మండల అధ్యక్షురాలు తగిరా నిర్మల రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెప్పించి బయ్యారం ఏజెన్సీ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి మల్లయ్య, తగిరి సత్తి రెడ్డి, భూక్యా రవి నాయక్, చెరుకుపల్లి నాగమణి, దాసరి శ్రీధర్, చల్ల గోవర్ధన్, సరోజ, సుజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి – భజరంగ్ దళ్.

అచ్చంపేట/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎస్పీని కలిసి, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అచ్చంపేట ప్రఖండా సంయోజక్ శివ చంద్ర మాట్లాడుతూ, గోవధ వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గోవులను రక్షించడం మనందరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు వినతి పత్రాన్ని స్వీకరించి, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు శివాజీ నరేష్, చందులాల్ చౌహాన్, అమర్, అజయ్, చైతన్య చారి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.

వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం.

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ

ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధన వసతులు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలి

బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలు వసతులు తల్లిదండ్రులకు తెలియచేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తేదీ జూన్ 6 నుండి 19 వరకు జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాల, బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఆయా ఏఎన్ఎం వివోఏలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యా బోధన, వసతులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వివిధ పోటీ పరీక్షలు జేఈఈ నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు.

 

School Walk Program

 

 

జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, పిల్లలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ శేషాద్రి, జిల్లా వైద్య అధికారి రజిత ,విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పురస్కారాలు.

విద్యార్థులకు.. పురస్కారాలు

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ కల్వకుర్తి మండలంలోని,
పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పదవతరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక సంతోష్ యువజన విభాగం అధ్యక్షుడు సంబు తరుణ్ కుమార్ ఆద్వర్యంలో మెమెంటో లతో సన్మానం కార్యక్రమం నిర్వహిoచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా దేశానికి ముందు నడపాలని విద్యార్థుల చేతుల్లోనే దేశ బాధ్యత ఉంటుందని ఇలాగే చదివి మంచి ప్రతి కనబడచాలని మరి అబ్దుల్ కలాం లాగా దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండలం అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, వాస శేఖర్ ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ మహాసభ నాయకులు, ఆర్యవైశ్య సంఘం మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్..

నేటిధాత్రి, కొత్తపేట, వరంగల్

 

 

 

వరంగల్ మండలం పరిధిలో గత మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిన్న పైడిపల్లిలో దరఖాస్తులు స్వీకరించిన వరంగల్ మండల రెవెన్యూ అధికారులు. వాటిలో బాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో ఎన్నో ఏండ్లగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామ దరఖాస్తులను కూడా భూభారతిలో పరిశీలించి పట్టా చేయుటకు వరంగల్ తహసిల్దార్ కు దరఖాస్తు అందచేశారు కొత్తపేట రైతులు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రైతులు నేరెళ్ల రాజు, లంక రాజగోపాల్, బల్లని ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

-బడిబాట కార్యక్రమం ను విజయవంతం చేయాలి

-ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

–మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక

మంగపేట-నేటిధాత్రి

 

 

 

ప్రభుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అధిక సంఖ్యలో చేసి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దీనికోసం చేపట్టే బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని మంగపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ లో పాల్గొన్న మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు మంగపేట ఉన్నత పాఠశాల గెజిటెడ్
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక
అన్నారు.

 

Quality education

 

ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గూర్చిఅవగహన కల్పించడం జరిగింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య ,ల్యాబ్ సౌకర్యం,ఆటపాటలతో కూడిన విద్యార్థి కేంద్రీకృత విద్యాబోధన,ఉచిత యూనిఫాంలు,పుస్తకాలు, నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం,ఆడపిల్లలకు కరాటే శిక్షణ,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తదితర ఎన్నెన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని ,కావున విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాల్లో నమోదు చేపించి ప్రభుత్వం పాఠశాల లకు పూర్వ వైభవం కల్పించాలని ,ఈ దిశగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని,తద్వారా నేటినుండి చేపట్టబడినప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంను విజయ వంతం చేయాలని అన్నారు.

 

Quality education

 

ఈ సందర్భంగా బడిబాట ర్యాలీ ని కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకటస్వామి,ఉపాధ్యాయులు , సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, అనంత రావు ,వందన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన
• గ్రామ సభలో గ్రామస్తులకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం “మనబడి మన – బాధ్యత” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన విద్యాబోధన లభిస్తుంది అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ వడ్ల నర్మద, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు గణేష్, దశరథం, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ పుష్పలత, గ్రామస్తులు బురాని మంగ, బురాని వాణి, ఉడెపు శ్రీశైలం, మంగలి అమరేందర్ లు ఉన్నారు.

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు.

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

◆ అపూర్వం.. అద్వితీయం..!

◆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

◆ 22 ఏళ్లకు కలిసిన మిత్ర బృందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూ ర్వ విద్యార్థులు గురువారం పాఠశాల ఆవర ణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించా రు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు స ర స్వతీ, మధుసూదన్, పద్మజ, జ్యోతి, నాగిశెట్టి, ఈ శ్వర్లకు పాదపూజ నిర్వహించి ఆశీర్వాదం తీసు కున్నారు. జ్ఞాపిక లందించి ఘనంగా సన్మానిం చారు. అనంతరం అలనాటి మధుర స్మృతులు నెమరువేసుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు హాజర య్యారు. 22 ఏళ్ల తర్వాత విద్యార్థులు కలవడంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆనంద భాష్పాలు రాల్చారు.

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజన పథకం,ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చిన్న కిష్టాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాటోత్ ప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, సర్వన్ తండ, ఎస్ టీ కాలనీ, మంగలి తండ గ్రామాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శనగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా జాటోత్ ప్రసాద్ మాట్లాడుతూ, నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, యువతి, యువకులు తమ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా చైతన్య పరచాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సయ్య, కిరణ్, గ్రామ యువకులు ఎం. సురేష్, అంగన్వాడీ టీచర్ లు మాలోత్ నీలా దేవి, బోడ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో బడిబాట గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ దొండి రావు పెట్లోళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్డు, రాగి జావ వడ్డిస్తారన్నారు.

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల.

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నాపూర్ గ్రామానికి చెందిన గుడిసె ఆకాశ్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-మంజూరైన LOC మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు ,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,నాయకులు అందజేశారు.
ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కోర మీసాలు,ఉగ్రరూపంలో వేట వెంకటేశ్వర స్వామి…

కోర మీసాలు,ఉగ్రరూపంలో వేట వెంకటేశ్వర స్వామి…

కొలిచిన వారికి కొంగు బంగారం…

ఆపద మొక్కులు తీర్చే వేట వెంకటేశ్వర స్వామి…

వేటకు వచ్చి మర్రిగూడెంలో వెలసిన వేట వెంకటేశ్వర స్వామి…

మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న వేట వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు.

ఈ ఆలయం భక్తులకు అత్యంత ప్రితిపాత్ర మైనది.

వేట వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం యాటపోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

కోరిన కోరికలను తీర్చమని ముడుపులు కట్టి మేకపోతుని బలి ఇస్తారు.

వెంకటేశ్వర స్వామికి మేకను బలివ్వడం ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.

వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.

వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అశ్వ వాహన రూపాన్ని వదిలి వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధరించిన ప్రదేశంలో గోపాద ముద్రలు దర్శమిస్తాయి.

ఇక్కడికి వచ్చే భక్తులు ముందు గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతే వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు.

సంతానలేమిటో బాధపడే భార్యా,భర్తలు కళ్యాణం కోసం ఎదురుచూసే యువతి,యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నించే ఉద్యోగార్థులు, ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు

 

Venkateswara Swamy.

 

ఈ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి తమ కోరికలను తీర్చాలని,తమ కష్టాలను గట్టేక్కించాలని మొక్కుకుంటారు.

శాలివాహన శకం 1525 శ్రీముఖ నామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ విదియ శుభదినాన స్వామి వారు ఇక్కడ అవతరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.

క్షేత్ర పాలకూడిగా హనుమంతుడు కొలువై ఉన్న ఈ దేవాలయంలో ఆల్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం.

ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వేట వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం భారతదేశమంతట ఎక్కడ వెతికిన దొరకదు.

ఈ వింత ఆచారం మర్రిగూడెంలోని వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

పాతకాలం నాటి పంచలోహ విగ్రహాలను, స్వామివారి ఆభరణాలను ఉత్సవాల అనంతరం గార్ల దేవాలయం లో భద్రపరిచి ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన

ఈ ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం రివాజు.

 

 

Venkateswara Swamy.

 

 

అశ్వయుజ పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో జరిగే కళ్యాణానికి డోర్నకల్ మండలం, అమ్మపాలెం గ్రామం నుంచి తెచ్చిన తలంబ్రాలతో వేద పండితులు కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా వేటాడుతూ ఈ ప్రాంతానికి విచ్చేసి మర్రిగూడెం సమీపంలో వెలసినట్టు భక్తుల విశ్వాసం.

ఆలయం ఎదుట గల కోనేరు తేప్పోత్సవమును ఘనంగా నిర్వహిస్తారు.

తిరునాళ్ల ఉత్సవానికి మహబూబాబాద్ జిల్లా నలుమూలల నుండి కాక, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కృష్ణ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకిస్తారు.

ఇంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యేలు,ఎంపీలు చొరవ చూపాలని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలయం అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు.

 

Venkateswara Swamy.

 

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

 

వెల్దండ /నేటి ధాత్రి.

 

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో చర్చి సమీపంలో నివాసం ఉంటున్న జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై గురువారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఆంధ్రయ్య పై ఒక్కసారిగా దాదాపు 10 కి పైగా వీధి కుక్కలు మీద పడి ముఖంపై దాడి చేశాయి. దీంతో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి నాగర్ కర్నూలుకు వైద్యులు రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం హజ్రత్ ఇబ్రాహీం (అలై), ఆయన కుమారుడు ఇస్మాయీల్ (అలై) అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించిన కాబా గృహం నేడు గొప్ప ఆరాధనా స్థలంగా మారింది.

‘ఈ గృహాన్ని సకలజనావళికి కేంద్రంగా, శాంతి నిలయంగా రూపొందించాం.

ఇబ్రాహీం ఆరాధన కోసం నిలిచిన ఈ పవిత్ర ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా ఏర్పాటుచేయమని ఆదేశించాం.

అలాగే ఈ గృహానికి ప్రదక్షిణ, అందులో ఏతెకాఫ్, రుకూ, సజ్దాలు మొదలైనవన్నీ పాటించేవారి కోసం ఈ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచమని ఇబ్రాహీంను, ఇస్మాయీలును నిర్దేశించాను’ అని ఖురాన్లో అల్లాహ్ పేర్కొన్నాడు.

అందుకే ముస్లింలు ఏటా మక్కా వెళ్తారు. అక్కడ ఖుర్బానీ ఇస్తారు.

పండుగకు ముందురోజైన ‘యౌమె అరపా’ నాడు ఉపవాసం పాటిస్తే..

వారు గత సంవత్సరం చేసిన పాపాలు క్షమకు నోచుకుంటాయని ప్రవక్త (స) తెలియజేశారు.

హజ్ యాత్ర

 

Qurbani.. inspiring.

 

 

 

ఇస్లాం ఐదు మూలస్తంభాల్లో హజ్ ముఖ్యమైంది.

స్తోమత ఉన్న ముస్లింలు జీవితకాలంలో ఒక్కసారైనా తప్పక చేయాల్సిన ధార్మిక విధి.

ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలున్న విశిష్ట ఆరాధన ఇది. ఏటా లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు వెళ్తారు.

ప్రపంచం నలుమూలల నుంచి అల్లాహ్ పట్ల భక్తితో ఆయన ఆహ్వానానికి జవాబుగా ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అని పలుకుతూ కాబాగృహానికి వస్తారు.

జాతి, ప్రాంతం, భాషా భేదాలు అక్కడ కనిపించవు.

అందరూ ఒకేరకమైన నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఒకే విధమైన హజ్ కర్మలు నిర్వర్తిస్తారు.

సర్వమానవ సమానత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తారు.

హజ్ యాత్రికుల హృదయాల్లో అల్లాహ్ పట్ల అంతులేని విశ్వాసం, ప్రేమ తొణికిసలాడుతుంటాయి.

హజ్ యాత్రికుల అంతరంగంలో దేవుడొక్కడే అనే భావన, సమాజపరంగా అందరూ ఒక్కటేనన్న ఆలోచన బలపడతాయి.

హజ్ యాత్ర ప్రజల్లో సమానత్వాన్ని, సహోదర భావాన్ని దర్శింపజేస్తుంది.

ఒకే దైవం, ఒకే ప్రవక్త (స) అన్న విశ్వాసం, ఒకే జీవిత లక్ష్యం (ఖురాన్), ఒకే జీవన విధానం (కిల్లా.. కాబా ప్రదక్షిణ) ఇవన్నీ సామాజిక సమైక్యతకు బలమైన పునాదులు

ఇబ్రాహీం గాథ

 

 

Qurbani.. inspiring.

నేటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అరబ్బు భూభాగంలో దైవగృహం సాక్షిగా జరిగిన ఇబ్రాహీం గాథను, ఆయన త్యాగస్ఫూర్తి, సహనశీలతలను బక్రీద్ నాడు స్మరించుకుంటారు.

ఇబ్రాహీం (అలై) మహా దైవప్రవక్త.

ఆయనకు ఖలీలుల్లాహ్ (దేవుని మిత్రుడు) అనే బిరుదు కూడా ఉంది.

ఒకనాడాయన తన పుత్రుడి గొంతు కోస్తున్నట్లు కలగన్నారు.

దీన్ని దైవాజ్ఞగా భావించి పుత్రుణ్ణి సంప్రదించారు. ‘ఆ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చండి.

నేను సిద్ధంగా ఉన్నాను.

అది దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు’ అన్నాడు.

దీంతో ఇబ్రాహీం తన ప్రాణం కంటే మిన్న అయిన పుత్రుడి మెడ నరికేందుకు కత్తి తీసుకున్నారు.

బాల ఇస్మాయీల్ తన మెడ కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.

మెడపై కత్తి పెట్టగానే ‘ప్రియమైన ఇబ్రాహీం!

నువ్వు నీ కలను నిజం చేయడానికి పూనుకున్నావు.

నా ఆజ్ఞను అమలుచేసేందుకు మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను ప్రసన్నుడనయ్యాను.

పరీక్షలో అత్యుత్తమంగా ఉత్తీర్ణులయ్యారు.

ఇక భౌతిక చర్యగా మిగిలిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు.

ఇది మీ పరిపూర్ణ విశ్వాసానికి మచ్చుతునక అంటూ దైవవాక్కు వినిపించింది.

స్వర్గం నుంచి పొట్టేలు ప్రత్యక్షమై ఇస్మాయీల్ స్థానంలో కనిపించింది.

దాంతో పుత్రుడికి బదులు పొట్టేలును బలి ఇచ్చారు. ఇలా బలివ్వడాన్ని ఇస్లామీయ పరిభాషలో ఖుర్బానీ అంటారు.

బక్రీద్ అంటే త్యాగోత్సవం.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు మధ్య భారతంలో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. శాంతి చర్చల కమిటీ, 10 వామపక్ష పార్టీలు, లౌకిక శక్తుల ఆధ్వర్యంలో ఈ నెల మూడు నుంచి ఆరు వరకు అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో సభలు, సమావేశాలు జరపాలని, ఈనెల 14న హైదరాబాదులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయని, వీటన్నింటినీ జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భూముల సమస్యలు పరిష్కరించేందుకే.!

భూముల సమస్యలు పరిష్కరించేందుకే రెవిన్యూ సదస్సులు

తహశీల్దార్ కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణవేణి అన్నారు. మరిపెడ మండల పరిధిలోని రాంపురం, ఉల్లెపల్లి,భూక్య తండ, లూనావత్ తండా గ్రామాలలో నాల్గవరోజు నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాంపురం గ్రామపంచాయతీలో తాసిల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో రైతులు పడుతున్న బాధలపై,ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ కృష్ణవేణి స్వయంగా ప్రజలతో మమేకమై వారు ఇచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. వారికి భూభారతి ద్వారా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది, ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి, గిర్ధవర్ శరత్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్లు సందీప్,ప్రవీణ్,నరేష్,గ్రామపంచాయతీ సిబ్బంది హాఫీజ్,మెకానిక్ వెంకన్న,గ్రామ రైతులు రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,సుదగానికి శంకర్,దిడ్డి వెంకన్న,చింతపల్లి మల్లేశం,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం

సర్కారు బడిని బలోపేతం చేద్దాం

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు , సర్కారు బడిని బలోపేతం చేద్దామని డీఈవో రవీందర్, ఎంఈఓ అనిత దేవి ఆదేశానుసారం మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం మరిపెడ మండల కేంద్రం లోని రాంపురం, చిల్లంచర్ల, భావోజిగూడెం, వెంకంపాడు గిరిపురం,తానంచర్ల, మండలంలోని వివిధ గ్రామాల్లో బడి బాట కార్యక్రమం చేపట్టారు, రాంపురం గ్రామంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణవేణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో విద్యార్థులను చేర్పించాలని వారు కోరారు.గ్రామాల్లోని పిల్లలను వారి తల్లిదండ్రులు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు.ఆర్థిక భారం తగ్గించుకుందామని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఇంగ్లీష్ మీడియం తో పాటు, కంప్యూటర్ విద్యాబోధన జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాగి జావా, పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్, అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శశిధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి అజయ్,ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి,హరి శంకర్, గణేష్,శ్రీనివాస్,కిన్నర శ్రీను, మన్సూర్ ఆలి,చంద్ర ప్రకాష్ విద్యార్థుల తల్లిదండ్రులు పరశురాములు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version