సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు
◆ అపూర్వం.. అద్వితీయం..!
◆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
◆ 22 ఏళ్లకు కలిసిన మిత్ర బృందం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూ ర్వ విద్యార్థులు గురువారం పాఠశాల ఆవర ణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించా రు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు స ర స్వతీ, మధుసూదన్, పద్మజ, జ్యోతి, నాగిశెట్టి, ఈ శ్వర్లకు పాదపూజ నిర్వహించి ఆశీర్వాదం తీసు కున్నారు. జ్ఞాపిక లందించి ఘనంగా సన్మానిం చారు. అనంతరం అలనాటి మధుర స్మృతులు నెమరువేసుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు హాజర య్యారు. 22 ఏళ్ల తర్వాత విద్యార్థులు కలవడంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆనంద భాష్పాలు రాల్చారు.