ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన.

Principal Srikanth Principal Srikanth

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన
• గ్రామ సభలో గ్రామస్తులకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం “మనబడి మన – బాధ్యత” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన విద్యాబోధన లభిస్తుంది అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ వడ్ల నర్మద, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు గణేష్, దశరథం, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ పుష్పలత, గ్రామస్తులు బురాని మంగ, బురాని వాణి, ఉడెపు శ్రీశైలం, మంగలి అమరేందర్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!