భూముల సమస్యలు పరిష్కరించేందుకే.!

భూముల సమస్యలు పరిష్కరించేందుకే రెవిన్యూ సదస్సులు

తహశీల్దార్ కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణవేణి అన్నారు. మరిపెడ మండల పరిధిలోని రాంపురం, ఉల్లెపల్లి,భూక్య తండ, లూనావత్ తండా గ్రామాలలో నాల్గవరోజు నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాంపురం గ్రామపంచాయతీలో తాసిల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో రైతులు పడుతున్న బాధలపై,ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ కృష్ణవేణి స్వయంగా ప్రజలతో మమేకమై వారు ఇచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. వారికి భూభారతి ద్వారా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది, ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి, గిర్ధవర్ శరత్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్లు సందీప్,ప్రవీణ్,నరేష్,గ్రామపంచాయతీ సిబ్బంది హాఫీజ్,మెకానిక్ వెంకన్న,గ్రామ రైతులు రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,సుదగానికి శంకర్,దిడ్డి వెంకన్న,చింతపల్లి మల్లేశం,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version