ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి.

Quality education Quality education

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

-బడిబాట కార్యక్రమం ను విజయవంతం చేయాలి

-ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

–మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక

మంగపేట-నేటిధాత్రి

 

 

 

ప్రభుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అధిక సంఖ్యలో చేసి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దీనికోసం చేపట్టే బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని మంగపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ లో పాల్గొన్న మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు మంగపేట ఉన్నత పాఠశాల గెజిటెడ్
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక
అన్నారు.

 

Quality education
Quality education

 

ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గూర్చిఅవగహన కల్పించడం జరిగింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య ,ల్యాబ్ సౌకర్యం,ఆటపాటలతో కూడిన విద్యార్థి కేంద్రీకృత విద్యాబోధన,ఉచిత యూనిఫాంలు,పుస్తకాలు, నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం,ఆడపిల్లలకు కరాటే శిక్షణ,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తదితర ఎన్నెన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని ,కావున విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాల్లో నమోదు చేపించి ప్రభుత్వం పాఠశాల లకు పూర్వ వైభవం కల్పించాలని ,ఈ దిశగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని,తద్వారా నేటినుండి చేపట్టబడినప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంను విజయ వంతం చేయాలని అన్నారు.

 

Quality education
Quality education

 

ఈ సందర్భంగా బడిబాట ర్యాలీ ని కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకటస్వామి,ఉపాధ్యాయులు , సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, అనంత రావు ,వందన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!