ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన
• గ్రామ సభలో గ్రామస్తులకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం “మనబడి మన – బాధ్యత” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన విద్యాబోధన లభిస్తుంది అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ వడ్ల నర్మద, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు గణేష్, దశరథం, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ పుష్పలత, గ్రామస్తులు బురాని మంగ, బురాని వాణి, ఉడెపు శ్రీశైలం, మంగలి అమరేందర్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version