అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో జమ్మికుంట :నేటిధాత్రి
shine junior college
జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది అలాగే కొంతమంది బినామీ పేర్ల పైన కొత్త పాసు బుక్కు ఉండంగా కూడా వాళ్లు వేలిముద్ర వేయకుండా వాళ్ల సంతకాలు పెట్టకుండా వేరే వాళ్లకు మార్పు చేయించినాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆట స్థలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇట్టి పోరుపై చాలాసార్లు కలెక్టర్ను ఆర్డీవోను ఎమ్మార్వో మారినప్పుడల్లా మా బాధలను వినిపిస్తున్నాము ఈ అక్రమార్కుని పై పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు భూభారతి కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో జరుగుతుందని తెలుసుకుని బాధితులంతా రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపినారు తర్వాత అధికారులకు వారి యొక్క వినతి పత్రాలు అందజేసినారు ఇకనైనా ఈ భూభారతి లోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు కనుక అధికారులు గమనించి సమగ్ర విచారణ జరిపి పేదల భూములు వారి వారికి పాసుబుక్కులు ఇప్పించాలని బాధితులంతా కోరుకోవడం జరిగింది
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హసన్ పర్తి మండలం పెంబర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ, నేటిధాత్రి:
shine junior college
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం హనుమకొండ హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణాలు, రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులను ఏ విధంగా చేయిస్తున్నారని, మేస్త్రీలు ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకుంటున్నారు, నిర్మాణ పనులను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేస్తున్నారా అని లబ్ధిదారులు స్వరూప, రజిత, నిర్మల, అరుణ, సమ్మక్క, మంజుల, సులోచన, రాజేశ్వరిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, కాబట్టి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ రహీం పాషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు…
అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.
వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట( నేటిధాత్రి ):
shine junior college
నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ, నేటిధాత్రి:
shine junior college
స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు..
*అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.
*వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు
*వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట( నేటిధాత్రి ):
shine junior college
నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు…
వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానన్నారు. స్థానిక దళిత, గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు. గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….
బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్ బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
shine junior college
దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు
బడిబాట కార్యక్రమం నిర్వహించని వారిపై చర్య తీసుకోవాలి…
నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ పై చర్య తీసుకోవాలి
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
shine junior college
టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాల ను కాపాడాలని బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించి ప్రభుత్వ స్కూల్లో చదివే విధంగా తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలని ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కానీ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక్కరోజు కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించిన దాఖలు లేవు … ఈ పాఠశాల మూతపడే పరిస్థితి ఉంది ఇందులో ఒక విద్యార్థి కూడా వచ్చిన దాఖలు లేవు వచ్చిన ఉపాధ్యాయుడు మాత్రం కూర్చుండి వెళ్ళిపోతున్నాడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు…. ఈ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు మాత్రం ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపే విధంగా ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యం ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు టాటా మ్యాజిక్ ల ద్వారా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడే సక్రమంగా రాడు మా పిల్లలు ఏమి చదవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో ఉన్నటువంటి మండల అధికారి ఎంఈఓ గారు కనీసం స్పందించిన దాఖలు లేవు ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల పైన చర్య తీసుకున్న పరిస్థితులు లేవు విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాల వాళ్ళు అధికఫీజులు తీసుకుంటూ డ్రెస్ కోడ్ పేరుతో బుక్స్ పేరుతో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారు అయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎంఈఓపై చర్య తీసుకోవాలని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలల కు టాటా మ్యాజిక్ ద్వారా పిల్లలను తీసుకపోతున్న ప్రైవేటు యజమాన్యంపై చర్యలు తీసుకొని స్కూలు గుర్తింపు రద్దు చేయాలని అన్నారు తక్షణమే బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్చి అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం
-MEO లింగాల కుమారస్వామి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
shine junior college
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడ పాఠశాల నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలను గురువారం మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి తెలిపారు. మంగళవారం మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సన్నద్ధత సమావేశoలో ఆయన మాట్లాడారు. ఎంపికు వచ్చే అభ్యర్థుల వయస్సు 8 నుండి 9 సంవత్సరాలలోపు (అనగా 01.09.2016 నుండి 31.08.2017 వరకు) ఉండాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, మండల స్థాయిలో ఎంపికలు తేది 19.06.2025న మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల స్టడీ సర్టిఫికెట్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో( కలర్).మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జిరాక్స్ఆధార్ కార్డు జిరాక్స్.కమ్యూనిటీ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని కోరారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఎం.ఆర్.సీ, సీ.సీ.వో వేణును 9866744719 చరవాణిలో సంప్రదించాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, మహేష్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన బంధు ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం
జైపూర్ నేటి ధాత్రి:
shine junior college
జైపూర్ మండలం ఇందారం 4 అంగన్వాడీ కేంద్రం లో సామూహిక అక్షరాభ్యాసాలు చేపట్టి మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడి సెంటర్ కి పంపించాలని పిల్లల తల్లి తండ్రులకు సూచించారు.ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అంగన్వాడి కేంద్రం లో ప్రతీ నెల పిల్లల ఎత్తు,బరువు,పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పిల్లలకు పోషకాలు కల్పించే ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ వెంకటస్వామి,స్వప్న, వివో అధ్యక్షురాలు రాజేశ్వరి, ఏఎన్ఎం కృష్ణవేణి,అంగన్వాడి టీచర్స్ కళ్యాణి,నళిని,పిల్లలు, తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
shine junior college
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో కలిసిన తెలంగాణ కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి అయినటువంటి గడ్డ వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా మంగళవారం కలవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,రైతుల సంక్షేమ, కార్మికుల హితానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో మంత్రి వివేక్ వెంకటస్వామి సుదీర్ఘంగా చర్చించారు.
చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతరావు
నేటిధాత్రి చర్ల
shine junior college
చర్ల మేజర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి అని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆద్వర్యంలో పంచాయతీ సెక్రటరీ సురేష్ కు వినతిపత్రం అందజేశారు మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో వుంచుకొని ముందుగానే సైడ్ డ్రెయిన్ లను శుభ్రం చేయాలి అని రోడ్డు కి ఇరువైపులా వున్న పిచ్చి మొక్కలను తొలగించాలి అని అదేవిధంగా దోమల మందు పిచికారి చేయాలి అని వీధి దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి అని రోడ్లమీద నిలువ నీరు లేకుండా చూడాలి అని తెలియచేశారు సానుకూలంగా స్పందించిన పంచాయతీ సెక్రటరీ సురేష్ సమస్యలను తొందర్లోనే పరిస్కరిస్తము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వరరావు ఎస్సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము మహిళా ఉపాధ్యక్షురాలు కొప్పుల సౌజన్య టౌన్ కార్యదర్శి గాధంసెట్టి కిషోర్ యువజన నాయకులు తడికల బుల్లెబాయ్ ఎన్నామూరి సృజన్ గంపల రమేష్ మైప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని కవేలి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతి సదస్సును గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల రెవెన్యూ అధికారులు గిర్దావరి అశ్విని కుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి భూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాలు సేకరించారని అన్నారు. మొత్తం 40 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు.
మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ లో బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారం లోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని,5 ఏళ్లలో బీసీ ల సంక్షేమాన్ని లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ లు 42% పెంచుతామని,ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని,అన్నీ జిల్లా కేంద్రాల్లో బీసీ భావనాలు నిర్మిస్తామని,అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం నర అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్య పెట్టడమే అవుతుంది అని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా డిమాండ్ చేస్తూన్నాం.లేకపోతే ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ములశ్రీనివాస్, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మదనబోయిన రాజన్న యాదవ్,నాయకులు శాఖపురి భీంసేన్,సీపతి రాములు, అంకం సతీష్,చెలిమెల అంజన్న తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవేస్తున్న ప్రభుత్వం
శాయంపేట నేటిధాత్రి:
shine junior college
శాయంపేట మండలం మైలా రం గ్రామంలో మండల పిఏసి యస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవే స్తున్న ప్రభుత్వం. 18 నెలలు కాంగ్రెస్ పాలన వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది రైతులు సాగునీరు లేక రైతు బంధు పెట్టుబడి పైసలు లేక పండించిన ధాన్యం కొనక ఉచిత ఎరువులు జాడలేక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈరోజు వరకు దాదాపు 600 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వం లో రోజు లాగా బతికిన రైతు నేడు గోస బడుతూ చస్తూ బతుకుతున్నాడు ఈ పరిస్థితి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోకపోవడం రైతుబంధు లాంటి పథకాన్ని ఆపేసి రైతు భరోసా తీసుకొస్తా మని కాలయాపన చేయడమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు భరోసా పైసలకు ఆశపడి రైతులు మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మళ్ళీ గోస పడే పరిస్థితి ఏర్పడతా యని రైతులు భావిస్తున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో రైతు భరోసా ప్లాన్ పని చేస్తుందో లేదో చూడాలి!
– ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
shine junior college
తొర్రూరు మండలంలోని చర్లపాలెం కాంప్లెక్స్ పరిధిలో సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) లో సి ఆర్ పి గా విధులు నిర్వహిస్తూ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్వి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్ఎస్ఎ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం తొర్రూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేసి మృతుడు రమేష్ కు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెల్తూరి మల్లేశం ,CRP ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుల సహదేవ్ , మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మారగోని జానకిరామ్ , షేక్ ఖాదర్ పాషా మాట్లాడుతూ ఎస్ఎస్ఏ లో గత 13 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో సిఆర్పి గా పని చేసిన రమేష్ అకాల మరణం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు మృతుని భార్యకు ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చయ్య, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిఆర్పి రమేష్ మృతికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఉపాధ్యాయులు తమ వంతు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంఈఓ బుచ్చయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రమేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో crp ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ పాషా, రాష్ట్ర కోశాధికారి కంచర్ల మహేందర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ , ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబులాల్,రు ,సంతోష్ ,కల్పన, ఉదయ్,రమేష్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, నాగరాజు, రవి, వెంకటేశ్వర్లు, కరుణ పద్మావతి. తది తరులు పాల్గొన్నారు,
చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసిడిపిఓ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని మడిపల్లి గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ర్యాలీ తీసి అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో గ్రామాల్లోని వీధుల్లో తిరుగు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో విద్య బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గౌసియా, గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి,అంగన్వాడీ టీచర్లు బి. అరుణమ్మ,ఎ.ఉదయశ్రీ,బి. సుజాత,ఆశ కార్యకర్త ఎం. ఉపేంద్ర, ఆయాలు సమ్మక్క,సరిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ఒకటి నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత ఆధ్వర్యంలో ఫ్రీ స్కూల్ సంబంధించిన పిల్లల అసెన్మెంట్ కార్డులను ప్రదర్శించి వాటిపైన అవగాహన కల్పించారు.ఇ సిసిఇపై అమ్మమ్మ తాతలకు సెంటర్లో టీచర్లు మరియు పిల్లలు తయారు చేసిన మెటీరియల్స్ మరియు ఐసిడిఎస్ వారు అందించిన సామాగ్రిని ప్రదర్శించి అవగాహన కల్పించారు పిల్లల మేధో శక్తిని పెంచి ఆటలు పాటలు సృజనాత్మకత వారు గీసిన బొమ్మలు అన్ని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి.సరిత, కోడెపాక సుప్రియ, పి రజిని కుమార్, ఎం లక్ష్మి, ఆయాలు రాధ, వనజ,ముత్యాలు,రమ పిల్లల తల్లులు, పిల్లల గర్భిణీ బాలింతలు, గ్రామస్తులు హాజరై విజయవంతం చేశారు.
కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని బాలరాం నగర్ 9 వార్డ్ లో మంగళవారం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన MRO ఇబ్రహీం కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ CDPO భాగ్యమ్మ గారు UPS హెడ్మాస్టర్ శ్రీనివాస్ గారు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పరుశపాకుల శేఖర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఎగ్ బిర్యాని పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అంగన్వాడి కేంద్రం పండుగ వాతావరణం లాగా ఉండాలని అలాగే పేరెంట్స్ చిన్నపిల్లలను మూడు సంవత్సరాల నుంచి అంగన్వాడీలో చేర్పించాలని టీచర్స్కు సూచించడం జరిగింది బాలామృతం ఎగ్స్ మురుకులు చిన్నారులకు అలాగే గర్భిణులకు కూడా అన్ని విధాల టాబ్లెట్స్ ఇంజక్షన్స్ టీకాలు అంగన్వాడి కేంద్రంలో ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ ఆయమ్మలు ఆశా వర్కర్స్ పేరెంట్స్ అంగన్వాడి విద్యార్థులు తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు
రైతు బంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపిటిసి వాసాల రామస్వామి
జమ్మికుంట :నేటిధాత్రి
shine junior college
రైతుబంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి,, ఇ సందర్బంగా మాట్లాడుతూ..ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు సాగు చేసిన అన్ని ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, పంటకు ఎకరాకు 6 వేలు చొప్పున సోమవారం రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొని రైతు బందు నిధులు విడుదల చేయడం పట్ల దన్యవాదాలు తెలుపుతున్నం అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు, తనుగుల తాజా మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి మాట్లాడారు.ప్రస్తుత పంట సాగు ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త రైతులకు ఈ బెట్టుబడి సహాయం ఎంతో లబ్ధి చేకూరుతుందని రామస్వామి అన్నారు. నిజానికి రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.