అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి :
చిన్నారుల ఎదుగుదల, మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసిడిపిఓ విజయలక్ష్మి అన్నారు.
మండలంలోని మడిపల్లి గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ర్యాలీ తీసి అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో గ్రామాల్లోని వీధుల్లో తిరుగు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో విద్య బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గౌసియా, గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి,అంగన్వాడీ టీచర్లు బి. అరుణమ్మ,ఎ.ఉదయశ్రీ,బి. సుజాత,ఆశ కార్యకర్త ఎం. ఉపేంద్ర, ఆయాలు సమ్మక్క,సరిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.