కవేలి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని కవేలి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతి సదస్సును గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల రెవెన్యూ అధికారులు గిర్దావరి అశ్విని కుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి భూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాలు సేకరించారని అన్నారు. మొత్తం 40 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు.