దీపక్ నగర్ 16వ వార్డులో కుప్పలు కుప్పలుగా చెత్త..

దీపక్ నగర్ 16వ వార్డులో కుప్పలు కుప్పలుగా చెత్త

ఖాళీ స్థలంలో చెత్త కుప్ప పిచ్చి మొక్కలు పాములు, పందులు, దోమలతో అపాయం.

చెత్త కుప్ప నుండి నివాసాలలోకి వస్తున్న పాములు, దోమలు.

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ దీపక్ నగర్ 16వ వార్డులో ఖాళీ స్థలం ప్రాంగణం లో అడ్డగోలుగా చెత్త పిచ్చి మొక్కలు ఉండడం వలన చేత ప్రక్కన నివాసం కలిగి ఉన్న ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. దీనివలన పాములు, పందులు, దోమలు వలన చుట్టుపక్కల ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. వర్షాకాలం అయితే మరి దుర్బలమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఈ కాళీ స్థలం చెత్త కుప్పగా మారడంతో. ప్రక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్త మురికి నీరు పేరుకపోయి.కాలువ ఇరు ప్రక్కల పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పట్టించుకోని అధికారులు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి. స్ట్రీట్ లైట్ వెలగకపోవడంతో. అంధకారంగా మారిన ప్రాంతం దీనితో ఈ చెత్త కుప్ప పక్కన ఉన్న నివాసాలలోకి చాలాసార్లు విషపూరితమైన సర్పాలు చొరబడ్డ సందర్భాలు ఉన్నాయి. దీనివలన అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకోవాలని అక్కడి ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

ఈనెల 16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బ్యాండు సమస్యల కోసం ఈనెల 16న సిటిజన్ ఫంక్షన్ హాల్ లష్కర్ బజార్ హనుమకొండ లో జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగినది వాయిద్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా వర్తిoప చేయాలి హెల్త్ కార్డు లిపించి ఉచిత వైద్యం కల్పించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న
చిట్యాల మండల అధ్యక్షుడు
పర్లపెల్లి రవి కోశాధికారి లద్దునూరి ప్రభు జాయింట్ సెక్రెటరీ భద్రయ్య తదితరులు అంకుశవాలి బోనగిరి రాజు వైనాల మొగిలి సాయబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 3న పెద్దాయపల్లి మరియు కేతిరెడ్డిపల్లి, 4న బాలానగర్ మరియు బోడ జానంపేట, 5న చిన్న రేవల్లి మరియు పెద్ద రేవల్లి, 6న నేరళ్ల పల్లి మరియు మోతి ఘనపూర్, 9న గుండేడ్ మరియు ఉడిత్యాల, 10న హేమాజీ పూర్ మరియు తిరుమలగిరి, 11న మొదంపల్లి మరియు సూరారం, 12న నందారం, నామ్యతాండ, లింగారం, సేరిగూడ, 13న గౌతాపూర్ మరియు అప్పాజీపల్లి, 16న మాచారం గ్రామాలలో.. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version