సివిల్ ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లోటిజి సెట్ పాలిటెక్నిక్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ స్టేట్ 9వ ర్యాంక్ సాధించి జేఎన్టీయూ హైదరాబాదులో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించిన మా పాఠశాల పూర్వ విద్యార్థి గోల్కొండ నిఖిల్ కౌశిక్ ను పాఠశాల అధ్యాపక బృందం శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ చిన్నప్పటినుండి నిఖిల్ కౌశిక్ చదువులో చురుకుగా ఉండేవాడు కష్టపడి చదవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులకు పాఠశాలకు మా మండలానికి పేరు తీసుకొచ్చి హైదరాబాదులోని జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు పొందినందుకు సంతోషిస్తూ ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది ఇంకా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో సాఫ్ట్వేర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేస్తూ సమాజానికి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తెస్తున్నందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉన్నదని తెలియజేశారు ఈ విధంగా విద్యార్థులు కష్టపడి చదివి నిఖిల్ కౌశిక్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.