ఏళ్ల బాలికపై అత్యాచారం.. పుట్టిన గంట తర్వాత ఆ బిడ్డ..

 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పుట్టిన గంట తర్వాత ఆ బిడ్డ..

 

 

అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక, అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 31 ఏళ్ల ఓ వివాహితుడు 11 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఏడు నెలలకే డెలివరీ అయింది. పుట్టిన బిడ్డ గంట తర్వాత ప్రాణాలు విడిచింది. పోలీసులు, బాలిక అన్న చెప్పిన వివరాల మేరకు.. బరేలీ జిల్లాలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 31 ఏళ్ల రషీద్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి దగ్గరలో నివసించే 11 ఏళ్ల బాలికపై అతడి కన్నుపడింది. తినడానికి పండ్లు ఇస్తానని చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఇక అప్పటి నుంచి బాలికను భయపెట్టి తరచుగా అత్యాచారం చేస్తూ ఉన్నాడు. గురువారం బాలిక తీవ్ర కడుపునొప్పికి గురైంది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక, అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలల్లోనే పుట్టడంతో గంట తర్వాత బిడ్డ చనిపోయింది. బాలిక పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. డెలివరీకి ముందు బాలిక రషీద్ పేరును కుటుంబసభ్యులకు చెప్పింది. వారు పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం అతడ్ని అరెస్ట్ చేశారు.

చనిపోయిన బిడ్డనుంచి డీఎన్ఏ సాంపిల్స్ సేకరించి టెస్ట్‌కు పంపారు. ఈ సంఘటనపై నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘అత్యాచారం గురించి బయటకు చెబితే ఇంట్లో వాళ్లను చంపేస్తానని రషీద్ బాలికను బెదిరించాడు. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. శుక్రవారం రషీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. బిడ్డ, రషీద్ నుంచి డీఎన్‌ఏ సాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపాము’ అని తెలిపారు.

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం.

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం

ఆగస్టు 12 విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డా. ఆర్. పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ చేయాలని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు దీనిలో భాగంగా జేఏసీ బందుకు పిలుపునివ్వడం జరిగినది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందున మరింత ఉదృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని జేఏసీ భావించింది దానిలో భాగంగా ఈనెల ఆగస్టు 12వ తేదీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు ఇచ్చే ప్రతీ పిలుపును ప్రజల పిలుపుగా భావించి రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే జేఏసీలో ప్రజలు భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్షను నెరవేర్చడం చేర్యాలకు పూర్వ వైభవాన్ని సాధించి రానున్న భవిష్యత్తు తరాలకు చేర్యాల ప్రాంతం యొక్క ఔన్నత్యం సామాజిక, రాజకీయ నేపథ్యం పరిపాలన యొక్క గొప్పతనాన్ని రేపటి తరాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ మనసారా ఆస్వాదించడానికి మాత్రమే ఆగస్టు12న విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. కావున నాలుగు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కు ఉపాధ్యాయులు, యజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును ప్రజల పిలుపుగా భావించి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, కత్తుల భాస్కర్ రెడ్డి, జంగిలి యాదగిరి, పోలోజు వెంకటాద్రి, పొన్నబోయిన మమత, కుడిక్యాల బాలమోహన్, వలబోజు నర్సింహ చారి, పెండ్యాల రాజు, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కవ్వం నారాయణ రెడ్డి, గడిపే రవి, కర్రె నర్సిరెడ్డి, పీ. శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version