ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు.
వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు…

విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల ప్రధానోత్సవం…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.

Education

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం

పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే.!

ప్రతీ ధాన్యంగింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పని

పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

*రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320,కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17 శాతం మాయుచర్ ఉండాలని అన్నారు. నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలనీ సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బొనస్ లభిస్తుందన్నారు.

government.

రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,డిసిఓ నీరజ,సివిల్ సప్లైస్ జిల్లా అధికారి డి.కిష్టయ్య,సివిల్ సప్లైస్ డిఎం సంధ్యారాణి,ఏడీఏ దామోదర్ రెడ్డి ,తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, అగ్రికల్చర్ మండల ఆఫీసర్ మాధవి,కొనుగోలు కేంద్రాల మండల నోడల్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,సొసైటి ఇంచార్జీ సిఈఓ భిక్షపతి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెల బాబు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ వైస్ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లు, పలువురు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన.!

శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఇండియన్ నేషనల్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి అధ్యక్షతన అభినందించి బహుమతిని(ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి దుంపేటి లాస్య నీ
శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య, ఎ.జి.యం అన్నపూర్ణ అకాడమిక్ కోఆర్డినేటర్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్ కుమార్,రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ఆస్తులు

మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ ఆస్తులు

గుడ్లప్పగిచ్చి చూస్తున్న అధికారులు

నాకు రాజకీయ పలుకుబడి ఉంది

ఆనాడు పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పా?

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక వెయ్యి క్యూబిక్ మీటర్లు తరలింపునకు కోమండ్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి నాలుగు లారీల ద్వారా పరిమిషన్ ఇచ్చియున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలించడమే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్, మూడు విద్యుత్ పోలను విరగగొట్టి మట్టిని తరలించుచున్నారు.

 

Goervnment

ఈవిషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. పరిమిషన్ రైతులకు ఇచ్చినట్లయితే సంబంధిత చెరువులో పదుల సంఖ్యలో ర్యాలీలు గ్రామపంచాయతీ ముందు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తుంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్ళున్న గుడ్డివాడి లాగా ప్రవర్తించడం మండలంలోని ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. విద్యుత్ పోల్లు మరియు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం విషయమై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కమలేష్ ను వివరణ కోరగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.

 

Goervnment

ఇరిగేషన్ శాఖ ఏఈ రఘురాంను వివరణ కోరగా సమాచారం అందించిన పిదప మేము వర్క్ ఇన్స్పెక్టర్ మల్లయ్యను మోఖాపై పంపి రెండు ఎక్సావేటర్ లను సంబంధిత టిప్పరులను నిలిపివేయడం జరిపామని సంబందిత ఫోటోలు పంపడం జరిగినది. ఒక అధికారి ఎంతవరకైతే మార్కింగ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే మట్టి తరలింపునకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది సంబంధంలేని వెహికల్ ద్వారా ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న సంబంధిత ఏఈ రఘురాం మోఖాపై వెళ్లి పరిశీలించకుండా నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం చూస్తుంటే వారిచ్చిన అమ్యామ్యాలకు తలోగ్గి నిమ్మకు నీరెత్తి ఉన్నట్లు గ్రామ, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

 

Goervnment

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని మార్కింగ్ ఇచ్చిన స్థలంపై కాకుండా ఇంకా ఎన్నాచోట్ల నుండి మట్టిని తోలగించారో పూర్తి విచారణ జరిపడంతో పాటు ఎన్ని వాహనాల ద్వారా మట్టి తరలింపు జరిగిందో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారో లెక్కగట్టి ఒక్క క్యూబిక్ మీటర్ ఎక్కువ తరలించిన సంబంధిత కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పరిమిషన్ లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయవలసిందిగా మండల ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుకుంటున్నారు. ఈవిషయమై పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ ఇవ్వాలని కోరగా మంగళవారం సంబంధిత ఏఈ రఘురాం మోకాపై వచ్చినప్పుడు మోకాపై నుండి వాహనాలను వెళ్ళగొట్టామని తెలియపరిచారు. ఏఈ మోఖాపై ఉన్నప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు ఉన్న ఎందుకు సీజ్ చేయకపోవడం లేదో చూస్తుంటే కళ్ళున్న గుడ్డివాళ్ళ లాగా అధికారులు నటిస్తున్నారని మండలంలోని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’. 

తల్లోజు ఆచారి.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:

 

ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు  పాల్గొన్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన.

ఈదురు గాలుల బీభ త్సవం.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన

పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి కోతకు వచ్చే దశలో మొక్కజొన్న నేలకొరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి .

 

farmeres

ఈదురు గాలులతో 100 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాత్రి వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల తండా గ్రామ రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారితో చెప్పగానే వెంటనే రైతుల పొలం కాడికి నేరుగా వచ్చి పరిశీలించి రిపోర్టు రాసుకొని రైతులకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది రైతులు చాలా ఆనందంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరడమైనది.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు.

కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు
అడ్డుకున్న పోలీసులు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
• కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు లేడనీ నేడు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం తో పాటు ముందుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్” స్కూల్ ప్రారంభించుకోవడం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గల్లి గల్లికి సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ హేనని కొనియాడారు. అందరి సహకారంతో మండల కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ఇన్చార్జి ఎమ్మార్వో రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, నజురుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, అమర సెనరెడ్డి, సిద్దారములు, గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ , వెంకట్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.

రేషన్ కార్డు లేక.. బడుగు బలహీన వర్గాలు దూరం

511 కొత్త రేషన్ కార్డులు పంపిణీ.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారని అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కేజీల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల వద్ద సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే పంచడం నిజంగా విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. మీ బాగుకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఖాజా పాషా, చిన్న , మోసిన్ , నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలి, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజిజ్ అహ్మద్, తులసిరాం నాయక్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, , తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

 

పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సమత యోధుడని సామాజిక న్యాయమైన లక్ష్యాన్ని ధరించి జీవితాంతం వ్యవస్థపై పోరాడారని బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మోర్ అశోక్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్ణయ సభలో కీలకపాత్ర వహించి కేంద్రంలో సుదీర్ఘంగా కీలక పదవులు పొంది పదవులకే వర్ణతిచ్చే విధంగా ప్రజానాయకుడని కొనియాడారు.

Ram Jayanti

 

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్.మల్లయ్య,ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి. రామకృష్ణ,డాక్టర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి,బి.మహేందర్ రావు,డాక్టర్ జి.పావని,డాక్టర్ భీంరావు, డాక్టర్ టి.కల్పన,ఏం. సమ్మయ్య,డాక్టర్ ఏ.రమేష్,డాక్టర్ ఎలిశాల అశోక్,డాక్టర్ కె.జగదీష్ బాబు, ఈశ్వరయ్య,డాక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి,రాజశ్రీ,డాక్టర్.సంజయ్ కుమార్,డాక్టర్.స్వప్న,సతీష్ మరియు అధ్యాపక బృందం, సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

సరైన వైద్య నిపుణులను నియమించాలి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, పేరుకే 100 పడకల ఆసుపత్రి అని నాతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా గుర్తించలేదని, 30 పడకల ఆసుపత్రికి పరిమితమైందని, బడ్జెట్ విషయంలోనూ అదే విధంగా ఉందని, స్పెషలిస్టు డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనరల్ ఫిజీషియన్ కూడా లేరని, సరైన డాక్టర్లు,వైద్య పరికరాలు లేక జబ్బులతో వచ్చిన రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారని, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని, పలుమార్లు సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ 30 పడక ల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు తీసుకొని బడ్జెట్ను ఇప్పించాలని, ఆసుపత్రికి సరిపోయే సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని,24/7 గంటలు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని,టెక్నీషియన్ లను అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరొక గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించి ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సమస్యలను తెలుసుకుంటూ ఉండాలని, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
◆ – అబ్రహం మాదిగ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అమరులైన మాదిగ అమరవీరులకు జహీరాబాద్ లోని స్థానిక అతిథి గృహంలో ‘ఉల్లాస్ మాదిగ’ ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.

అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాగిన ముప్పై యేండ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం హర్షనీయమన్నారు. యావత్ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారికి ఋణపడి ఉంటుందని అన్నారు. మాదిగ జాతి విజయం సాధించిన ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తూ అమరులైన (అమృత్,ప్రకాష్,రవీందర్, బాలరాజ్,మొల్లప్ప,భూమన్ మధు,పద్మారావు) ఉద్యమ వీరులకు నివాళులు అర్పించడం మాదిగ బిడ్డలుగా మన నైతిక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో మంది త్యాగాలు ఉద్యమాన్ని విజయ తీరాలకు నడిపించాయని అన్నారు. వారు ఉద్యమమే ఊపిరిగా జీవించారని వారి స్ఫూర్తి, త్యాగం, అమరత్వం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ఈ ముప్పై యేండ్ల కాలంలో ఎమ్మార్పిఎస్ ఉద్యమంలో జహీరాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తూ చనిపోయిన మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కుటుంబాల వివరాలు సేకరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చొరవ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో..నవీన్ కూమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అరుంధతి సంఘం నాయకులు రాంచందర్, జె జైరాజ్  ఎమ్మెఎస్పి నాయకులు జైరాజ్,పద్మారావు
ఆయా మండలాల అధ్యక్షులు టీంకు మాదిగ,మైకల్ రాజ్, రవికుమార్, నిర్మల్,మాదిగలు మరియు నాయాకులు సుకుమార్, శ్రీనివాస్,అజయ్, సుధాకర్,సునీల్,కిట్టు,అనిల్,పవన్,దయానంద్,ప్రశాంత్, రమేష్,షాలేం,సుదీష్  మాదిగలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.. పేదలకు సంక్షేమ పథకాలు

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో గురువారం.. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

బూర్గుల గ్రామం నుండి హేమాజీపూర్ గ్రామానికి రూ. 1 కోటి 62 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపడతామని, భవిష్యత్తులో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హేమాజీపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

Congress

 

అనంతరం బిల్డింగ్ తండా, కోయిలకుంట తండా నేల బండ తండా, లింగారం, గాంధీ పాలెం తండాలలో పాదయాత్ర సాగింది.

గాంధీ పాలెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నదని
టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని 23 వ వార్డులో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వార్డు ఇంచార్జ్ మాదాసి రవి కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, 16వ వార్డ్ ఇంచార్జ్ భాణాల శ్రీనివాస్ బైరగొని రవి, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, కోమటి సరోజన, సంగెపు తేజ, పెద్దపెల్లి కేదారి, వేముల జంపయ్య, సృజన, ప్రభుదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

21,22 వ వార్డులలో సన్నబియ్యం పంపిణీ..

Congress

 

ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్

నర్సంపేట పట్టణంలోని 21, 22,వ డివిజన్లో 8 నెంబర్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా భాగస్వాములై చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, బాణాల శ్రీనివాసు, దండెం రతన్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, పట్టా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి పటేల్, 22వ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి వాజిద్, స్వచ్ఛంద సంస్థల నాయకులు బెజ్జంకి ప్రభాకర్, డీలర్ శశిరేఖ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version