ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

నిజాంపేట నేటి ధాత్రి:

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పలు పార్టీల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాసులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజీరెడ్డి, పార్టీ కార్యాలయాల్లో కాంగ్రేస్ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మవురం రాజు, గ్రామాలలో నూతన గ్రామ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 వసంతాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నస్కల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు, దేశెట్టి సిద్ధ రాములు, గుమ్ముల అజయ్, శ్రీనివాస్,లక్ష్మా గౌడ్ ,బక్కనగారి లింగం గౌడ్, దేవరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version