ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo.

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo

ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇ పరిస్థితి

ధాన్యం కటింగ్ లపై ఎమ్మెల్యే మాట్లాడాలి

వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేయాలి

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు గణపురం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇ పరిస్థితి ఏర్పడిందని, ప్రతిసారి వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేసేవారని, ఇసారి మాత్రం అలా జరగలేదని, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్, పి పి సి ఇంచార్జి లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని అన్నారు, గత ప్రభుత్వంలో కటింగ్ లపై మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు చెప్పాలని, కటింగ్ లపై స్పందించాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు
వెంటనే ప్రభుత్వ గోదాములు తీసుకొని ధాన్యం నిలువ చెయ్యాలని,
ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే , జిల్లా మంత్రి చొరవ తీసుకొని ధాన్యం సరఫరా వేగవంతం చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version