పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును.!

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును కల్పిద్దాం

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పిలుపు

నమోదు కొరకు ప్రచార జాతా ప్రారంభం

చర్ల నేటిధాత్రి:

 

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపునిచ్చారు.

గురువారం తేది 29మే 2025 నాడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను స్థానిక అంబెడ్కర్ సెంటర్ భద్రాచలం నందు జెండా ఊపి సీనియర్ నాయకులు పి లక్ష్మి నారాయణ ప్రారంభించారు.
జాతాను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే
కొఠారి కమిషన్ చెప్పినట్లు దేశ జీడీపీలో ఆరు శాతం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్య కు కేటాయించాలి కానీ దేశ బడ్జెట్లో 2.9 శాతం రాష్ట్ర బడ్జెట్లో 7.5 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు కోడిగుడ్లు రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను.

ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు గుడి మసీదు చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకమై బడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.
గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్ యుటిఎఫ్ శ్రేణులు ఈరోజు నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని
చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం.

సన్నాహాలు చేస్తోందని ఏఐ ఆధారిత బోధన డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు పిల్లలకు నాణ్యమైన విద్య.

ఉచితంగా అందుతుంది తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని బి రాజు పిలుపునిచ్చారు చర్ల మండలంలో దేవరపల్లి.
కుదునూరు ఆర్ కొత్తగూడెం సత్యనారాయణపురం తేగడ చర్ల పట్టణం ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు బి మురళీమోహన్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర.

జాయింట్ సెక్రటరీ ఎన్ కృష్ణ జిల్లా కార్యదర్శులు డి తావుర్య ఎస్ విజయ కుమార్ వెంకటేశ్వర్లు చర్ల మండల అధ్యక్షులు కాక రాంబాబు సకినం బాలకృష్ణ రాధ జలంధర్ సీనియర్ నాయకులు పి నరసింహరావు గోపాలరాజు హిమగిరి రవికిషోర్ శ్రీలక్ష్మి వర్షిణి  పాల్గొన్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం

ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి.

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే

రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి.

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి

బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వర్ణోత్సవ మంగళ ఆహ్వానము

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో భగవాన్ శ్రీ సత్య నంద మహర్షి ఆశ్రమ వేడుకలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం
ఈ కార్యక్రమం మూడు రోజులు ఫిబ్రవరి 7 8 9 రోజులలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం స్వామీజీల ప్రవచనాలు ఆలగే నిత్య అన్నదానం తీర్థ ప్రసాద వితరణ ప్రతిరోజు సాయంత్రం భగవత్ సంకీర్తన అలాగే రామాయణ ఇతిహాసాల మీద ప్రవచన కార్యక్రమం ఉండును
కావున కథలాపూర్ మండల ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా సత్యానంద మహర్షి బృందంవారు ఈ సందర్భంగా తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version