ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు అప్పగించడంతో సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వికరించారు. ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.

‘‘బిఆర్‌ఎస్‌’’ బలమేమిటో చూపిస్తాం!

రజతోత్సవ సభ కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరేలా నిర్వహిస్తాం.

తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ వెంటనే వున్నారనేది రుజువు చేస్తాం.

‘‘బిఆర్‌ఎస్‌’’ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరిపోయేలా నిర్వహిస్తామంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఖైరతాబాద్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ ఇన్‌ చార్జ్‌ ‘‘మన్నె గోవర్ధన్‌ రెడ్డి’’, నేటిధాత్రి

ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో సభ సమయం దగ్గర పడుతున్న వేళ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

`కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభతో చూస్తారు.

`ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతుందో తెలుసుకుంటారు.

`ఏమరపాటు ఎంత నష్టం చేసిందో ప్రజలు తెలుసుకున్నారు.

`కేసిఆర్‌ ను దూరం చేసుకొని ఎంత మధనపడుతున్నారో చూస్తూనే వున్నారు.

`కేసిఆర్‌ కు తెలంగాణ మీద వున్న మమకారం మరెవ్వరికీ లేదు.

`కేసిఆర్‌ అంటేనే తెలంగాణ… తెలంగాణ అంటేనే కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ మరింత పదిలంగా వుంది.

`టిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ వేరువేరు కాదు.

`కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు.

`తెలంగాణ ప్రజల్లో ఎవరికీ అపోహలు లేవు.

`కాంగ్రెస్‌, బిజేపి నాటకాలు ఇక చెల్లవు.

`ఇకపై తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ మాట తప్ప మరెవ్వరి మాట వినరు.

`తెలంగాణ ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వైపే వున్నారు.

`ఇక భవిష్యత్తులో కాంగ్రెస్‌, బిజేపిలకు చీమకాలంత కూడా చోటుండదు.

`తెలంగాణ అంతా గులాబీ మయమే!

`మరో ఇరవై సంవత్సరాలు బిఆర్‌ఎస్‌ కు ఎదురుండదు.

`కేసిఆర్‌ నాయకత్వాన్ని ఢీ కొట్టే దమ్ము ఎవరికీ లేదు.

`రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

`జిల్లాల నుండి ఎడ్లబండ్లు కట్టుకొని లక్షలాది మంది రైతులు ఇప్పటికే బయలు దేరారు.

`ఇక కాంగ్రెస్‌ మీద రణమే..ఎన్నికల దాకా రణరంగమే!

                            హైదరాబాద్‌,నేటిధాత్రి:  

వాపును చూసి బలుపు అనుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, లేని బలాన్ని అతిగా ఊహించుకుంటున్న బిజేపిలకు ఒకేసారి బిఆర్‌ఎస్‌ పార్టీ సత్తా ఏమిటో..తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ బలమేమిటో వరంగల్‌ రజతోత్సవ సభతో నిరూపిస్తాం. ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్దమౌతున్నారు. కొన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్చంధంగా కొన్ని వేల మంది రైతులుఎడ్ల బండ్ల ద్వారా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హజరై బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. చిన్న ఏమరపాటు చేసిన పొరపాటు వల్ల తెలంగాణ రైతాంగం ఎంత ఆగమైందో స్వయంగా రైతులే వరంగల్‌ సభకు హజరైన చెప్పాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌,బిజేపి పార్టీల గుండెలదరిలా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెగోవర్ధన్‌రెడ్డి , నేటి ధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రజతోత్సవ సభ సమయం దగ్గర పడుతున్న వేళ, అందిస్తున్న సమాచారం ఆయనమాటల్లోనే…

దేశ రాజకీయాల్లోనే బిఆర్‌ఎస్‌ది ఒక గొప్ప చరిత్ర. అటు ఉద్యమ చరిత్ర, ఇటు రాజకీయ చరిత్ర రెండూ కలిసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. అందుకే తెలంగాణ ప్రజల్లో నిండి వుంది. ఆ బలమేమిటో, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ స్ధానమేమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే రోజు దగ్గర్లోనే వుంది. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్‌ నాయత్వమే కావాలని బలంగా ఎంత కోరుకుంటున్నారో మూడు రోజుల్లో ప్రపంచం చూస్తుంది. బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని లేనిపోని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ స్ధానం తెలంగాణలో ఎక్కడుతో తేలుతుంది. పది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరుగబాటు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరిసిస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాన్ని తిట్టనన్ని తిట్లు, ప్రజలు కాంగ్రెస్‌ ఫ్రభుత్వాన్ని తిడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే కేసిఆర్‌ పాలనలో అందిన సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడారు. రైతు బందుకు రాం..రాం చెప్పారు. దళిత బంధుకు ఎగనాం పెట్టారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలనువేధిస్తున్నారు. ప్రజలను గోసూ పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రాపేరిట జరుగుతున్న దౌర్జన్యంతో ప్రజలు ఉపాదికోల్పోతున్నారు. ముప్పై ఏళ్ల క్రితం, నలభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారు. వారికి గూడులేకుండా తరిమేస్తున్నారు. బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నారు. రాత్రికి రాత్రి సామాన్యుల జీవితాల్లో కాళ రాత్రులు నింపుతున్నారు. వారి జీవితాలను బజారున పడేస్తున్నారు. ప్రజలను ఆగమాగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభ ద్వారా తేలిపోనున్నది. ప్రజల ఆసక్తిని చూస్తుంటే గతంలో వరంగల్‌లో జరిగిన మహాగర్జనను మించి సభ జరుగుతుందనిపిస్తోంది. సభలు అంటేనే బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలను అదిగమించిన సభలు ఏ పార్టీకి ఇప్పటి వరకు సాద్యం కాలేదు. ప్రజల్లో వున్న ఆదరణ ఎంత గొప్పదో బిఆర్‌ఎస్‌ పార్టీకి తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్‌ సభలు అంటేనే ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ వస్తారు. ఆ మధ్య జరిగిన కొంగరకలాన్‌ సభను చూసే కాంగ్రెస్‌, బిజేపిల గుండెలు బెదిరిపోయాయి. ఇప్పుడు వరంగల్‌ రజతోత్సవ సభను చూసి ఆ రెండు పార్టీలు అదిరిపోవాల్సిందే.. కేసిఆర్‌ను దూరుం చేసుకొని ప్రజలు మధనడుతున్నారు. సాఫీగా సాగుతున్న పాలనను కాదకున్నందకు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారిని పట్టుకొని ఏడుస్తున్నారు. మళ్లీ మా కేసిఆర్‌ పాలన కావాలని కోరతున్నారు. ఇకపై మళ్లీ కాంగ్రెస్‌ను నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. సందిట్లో సడేమియాలాగా ఒంటె పెదవుల కోసం నక్క ఆశపడినట్లు బిజేపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌ అడినట్లే ఒక్క అవకాశంటూ జనం ముందుకు వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలి. ఇప్పటికే తెలంగాణ మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లింది. మరోసారి పొరపాటు చేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఎనమది మంది బిజేపి ఎంపిలను తెలంగాణ ప్రజలు గెలిపస్తే కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలే అంటున్నారు. ఆ రెండు పార్టీల నాయకులను దగ్గరకు కూడా రాన్విడం లేదు. ఎందుకంటే కేసిఆర్‌..కేసిఆరే…ఆయనకు వున్న ఆత్మ మరేపార్టీకి లేదు. మరే పార్టీ నాయకులకు వుండదు. ఎందుకంటే తెలంగాణను కేసిఆర్‌ పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చారు. కేసిఆర్‌ చేసిన త్యాగ ఫలితమే తెలంగాణ. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. వచ్చేదే కాదు. ప్రజల తెలంగాణ కల కలగానే మిగిలిపోయేది. తెలంగాణ మరింత ఆగమయ్యేది. తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగానే మిగిలిపోయేవారు. తెలంగాణ మరింత ఎడారిగా మారిపోయేది. పల్లెల ఆకృతిమరింత క్షీణించేది. తెలంగాణలో రైతులు అనిచెప్పుకునేవారు లేకుండాపోయేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ హాయంలో తెలంగాణ రైతులు ఎంతో మంది అప్పార్టుమెంట్లలో వాచ్‌ మెన్‌లుగా పనిచేశారు. యాభై ఎకరాలున్న రైతులు కూడా ఏటిఎంల మందు, ఇతర షపుల ముందు వాచ్‌మెన్‌ పనులు చేశారు. తెలంగాణ పల్లెల్లో ఎంతో గౌరవంగా బతికిన రైతు కూడా హైదరాబాద్‌ వచ్చి హోటళ్లలో పనిచేసిన వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. మరి కొంత మంది సాగుమీద ఆశతో, వ్యవసాయం మానుకోలేక, భూమిని అమ్ముకోలేక నష్టాలను, కష్టాలను ఓర్చుకుంటూ, ఏటా అప్పులు చేస్తూ కష్టాల సాగు చేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేయించి, అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చుకునేందుకు హైదరాబాద్‌లో కూలీలుగా మారిపోయారు. మరి కొందరు బొంబాయి, షోలాపూర్‌, పూన వంటి నగరాలకు పొట్ల చేత్తో పట్టుకొని వలసలు పోయేవారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మహారాష్ట్రలకు నిత్యం బస్సుల్లో వందల సంఖ్యలో వలసలుపోయిన రోజులు వున్నాయి. కాని కేసిఆర్‌ తెలంగాణ తేవడంతోనే దశ మారింది. రైతుల జీవితాల్లో వెలుగులొచ్చాయి. వలసలు పోయిన లక్షలాది మంది రైతులు మళ్లీ తమ తమ పల్లెలకు చేరుకున్నారు. దశబ్ధాల తరబడి వదిలేసిన భూములను మళ్లీ సాగుయోగ్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ పాలనకు వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటలు కరంటు వస్తుందని తెలిసి తెలంగాణ సంబురాలుచేసుకున్నారు. తెలంగాణలోని చెరువులన్నీ నింపుతున్నారని తెలిసి, బతపోయిన రైతులంతా మళ్లీ పల్లెలు చేరుకున్నారు. పాడుబడిపోయిన బావుల్లో కూడా నీటి ఊటలు జలపాతాల్లా వస్తుంటే చూసి ఆనందంతో గంతేలేశారు. మళ్లీ తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతికే రోజులు చూసి మరిసిపోయారు. సాగు వాటు కోసం ఏ షావుకారు దగ్గరకో, అప్పులు ఇచ్చేవారినో బతిమిలాడుకునే పరిస్దితి లేకుండా కేసిఆర్‌ రైతుబంధు ఇచ్చారు. దాంతో రైతుల్లో ఎంతో ధైర్యం పెరిగింది. మనకు ఏమైనా సరే కేసిఆర్‌ చూసుకుంటారన్న నమ్మకంతెలంగాణ రైతుల్లో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంటను కొనాలంటే దళారులు, మధ్య వర్తులు, మిల్లర్లు లేనిపోని కొర్రీలు పెట్టేవారు. ఎంత మంది వడ్లనైనా అడ్డికిపావు శేరుకు కొనుక్కునేవారు. డబ్బులకు తిప్పించుకునేవారు. కాని కేసిఆర్‌ వచ్చిన తర్వాత వడ్లలలో పెళ్లలలున్నా, ఒడిపిల్లున్నా, వడ్లు తడిసినా, రంగు మారినా, మొలకలు వచ్చినా సరే ప్రభుత్వమే నేరుగా రైతులను వడ్లు కొనుగోలు చేసింది. రైతులునష్టపోకుండా కేసిఆర్‌ కాపాడారు. దాంతో పదేళ్ల కాలంలో ఏనాడు రైతునష్టపోయింది లేదు. దళారుల చేత కాకుండా, రైతులకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకు అకౌంట్లలో వడ్ల సొమ్ము వేసేది. దాంతో రైతుకు రూపాయి కూడా నష్టం జరిగేది కాదు. ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయడం అన్నది దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే వుండేది. దాంతో తెలంగాణలో పండిన వడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణకు వచ్చి, మ్ముకున్నారు. లాభపడ్డారు. రైతు బాంధువుడుగా కేసిఆర్‌ పేరు తెచ్చుకున్నారు.

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ఆరుముల్ల ఎల్ల స్వామి కుమార్తె అరుణ్ జ్యోతి కిషోరల వివాహ మహోత్సవానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక.!

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వెలుగు సమాఖ్య పాలకవర్గ సభ్యుల ఎన్నిక కార్యదర్శి కొండ్ర శోభ సమక్షంలో నిర్వహించారు. బాగా నూతన అధ్యక్షురాలుగా రంగాపురం గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు కొలిపాక రమాదేవి, కార్యదర్శిగా పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు రేళ్ల సునీత, కోశాధికారిగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నాయకురాలు బత్తిని శిరీష లను నియమించినట్లు ఏపిఎం రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రతినిధులు, సీసీలు గాజుల బాబురావు, బత్తిని ప్రవీణ్, మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో .!

జిల్లా పరిషత్ పాఠశాలలో
తల్లిదండ్రులు ఉపాద్యాయుల సమావేశానికి హాజరైన ఎస్సై దీకొండ రమేష్

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా పోత్కపల్లి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ధీకొండ రమేష్ హాజరయ్యారు.2024-25 విద్యాసంవత్సరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ చేసిన ఓదెల యం ఈ ఓ Y. రమేష్ ఈ సందర్భంగా SI రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్త గా ఉండాలని ఈత కోసం వెళ్లి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది అని, మొబైల్ ఫోన్లను వాడే క్రమం లో ఆన్లైన్లో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని. విద్యార్థినులు ఫేస్ బుక్,వాట్సాప్,ఇన్స్తా గ్రామ్ లలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని,చిన్న పిల్లలకు బైక్ లు మొదలైన వి డ్రైవింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అన్నారు.ఓదెల MEO మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చదవడం రాయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పై తరగతులకు చెందిన తెలుగు,హిందీ పుస్తకాలు విద్యార్థులకు అందించి వాటిని తిరిగి పాఠశాల ప్రారంభం నాటికి వాటిని చదవడం రాయడం చేస్తూ భాష పట్ల ప్రావీణ్యం పెంచుకోవాలని, ప్రమాదాల వైపు పోకుండా తల్లి దండ్రుల సంరక్షణలో ఉండాలని కోరారు.2024-25 విద్యాసంవత్సరం FLN లో ఓదెల మండలం యం ఈ ఓ సమర్ధ వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఓదెల 3వ స్థానం లో నిలిపినందుకు డి ఈ ఓ చేతుల మీదుగా ప్రశంస అందుకున్న యం ఈ ఓ కు గ్రామస్తులు విద్యార్థుల తల్లి దండ్రులు శాలువాతో సన్మానం చేశారు.ఈ సమావేశం లో కనగర్తి మాజీ సర్పంచ్ తాళ్లపల్లో లక్ష్మణ్ , కొట్టిరెడ్డి మహేందర్ రెడ్డి ,మాజీ వార్డు సభ్యులు తాళ్లపెల్లి శ్రీనివాస్ ,జాగిరి కిషోర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఎస్.వి.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన పస్తాపూర్ గ్రామం పట్నం అశోక్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో క్రిష్ణారెడ్డి, సి.యం. మాణిక్ రెడ్డి,చెంగల్ జైపాల్, సి.యం.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి???
స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు
కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం
మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు
కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక..

నేటిధాత్రి ఐనవోలు :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు గతంలో పార్టీలో పనిచేసిన కార్యకర్తలుకక్కిరాలపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కండవు కప్పుకున్న నాయకులు కార్యకర్తలు తిరిగి మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్ ఆధ్వర్యంలో బుధవారం అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని. కె ఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ బిజెపి నాయకులు చెప్పిన మాటలు విని ఆగమాగం కావద్దని అధికార పార్టీతోనే అన్ని సాధ్యమైతాయని ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యే కంటికి రెప్పలా కాపాడుకుంటాడని పార్టీలో చేరిన వారికి ఈ సందర్భంగా మహేష్ గౌడ్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారిలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు పొన్నం గోపాల్. బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కంజర్ల సురేష్ మాజీవార్డు మెంబర్ కంజర్ల అశోక్ బీఆర్ఎస్ నాయకులు కంజర్ల మధుకర్ కత్తెర శాల రమేష్ అరుణ, బర్ల సుమలత రాజు, అరూరి లలిత, అరూరి పూలమ్మ, రావుల సాంబయ్య, కంజర్ల మమత, కంజర్ల యాకమ్మ, అన్నెపు రాజు,నూనె రాజ్ కుమార్, పిట్టల యాదమ్మ, నాయిని శ్రీను మరియు నూనె రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

ఘనంగా చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు.!

ఘనంగా.. చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు

జడ్చర్ల / నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దయపల్లి చౌరస్తాలో బుధవారం రాజపూర్ మండలంలోని దొండ్లపల్లి మాజీ ఎంపీటీసీ.. చొక్కంపేట గ్రామానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమన్యు రెడ్డికి గజమాలతో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. రాజాపూర్, బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్న..40 మంది గిరిజన విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం.!

ఘనంగా.. ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం

హన్వాడ /నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో శివ సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా ప్రతిష్టించిన ధ్వజస్థంభం ప్రతిష్ట మహోత్సవానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యజ్ఞశాలలో ముందుగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, టంకర కృష్ణయ్య, నాయకులు మండల బిసి సెల్ చైర్మన్ పాశం సత్యయ్య, కేశవులు , అక్కపల్లి నర్సింహులు, మోహన్, పార్పల్లి మోహన్, కృష్ణయ్య, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక.!

స్టెరాయిడ్స్ వాడొద్దు.. నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక

*స్టెరాయిడ్స్ పై జిమ్ సెంటర్ నిర్వాహకులకు, వరంగల్
నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.*

వరంగల్, నేటిధాత్రి:

 

తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు, ఎస్పీ రూపేష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, 23 ఏప్రియల్ బుధవారం నాడు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, వరంగల్ నందు హన్మకొండ, వరంగల్ పట్టణ పరిధిలోని జిమ్ ఓనర్స్ అలాగే జిమ్ కోచ్‌లకు మాదకద్రవ్యాలు మరియు సింథటిక్ ఇంజేక్షన్స్, స్టెరాయిడ్స్ కు సంబంధించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎవరైనా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వరంగల్ నార్కోటిక్ పోలీసులు. ఈ సదస్సులో జిమ్‌ సెంటర్ల రికార్డుల నిర్వహణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకం, రవాణా, వాడకంపై ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. జిమ్ కు వచ్చిన కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డుల సేకరణ, జిమ్‌లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేయబడిందని వారికి వివరించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిని నిరోధించడం ప్రతీ పౌరుడి బాధ్యత అని తెలిపారు. మన రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి మరియు డ్రగ్స్ కి సంభందించిన అమ్మకాలు, కొనుగోలు, త్రాగే వారి వివరాలు తెలిసినచో, టోల్ ఫ్రీ నంబర్ 1908, టిజిఎన్ఏబి కంట్రోల్ రూమ్ నంబర్: 8712671111 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపారు. ఈ సమావేశంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె. సైదులు, ఇన్స్పెక్టర్ బి. రవిందర్ , మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపి, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు, నార్కోటిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్.

కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కష్టపడి చదివే విద్యార్థులు ఎక్కడ చదివిన వారు తమ ప్రతిభను కనబరుస్తారని టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ర్ జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూప్ నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బిజీ సరయు 440/436 సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించడం పట్ల ఆయన అభినందించారు
నేడు ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా మారుమూల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే ఇది విద్యార్థిలకు పట్టిన ప్రతిభను బట్టి గుర్తించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి సరయు రాష్ట్ర స్థయిలో ర్యాంకు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులకు అభినందించి విద్యార్థినికి పూలమాల, శాలువాలతో సన్మానించీ ఇంకా ఉన్నతమైన ర్యాంకులు సాధించి జహీరాబాద్ నియోజకవర్గానికి తమ కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈరోజు ఏ రంగంలో చూసిన గ్రామీణ స్థాయి విద్యార్థులే రాణిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో ఏ కార్యక్రమం చేయాలనుకున్న దాన్ని విజయవంతంగా చేయగలుగుతారని అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉత్తమమైన విద్యాబధన చేయడంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాన్ కాల్ సుభాష్ గుప్తా, సీనియర్ నాయకులు రంజుల్ వైద్యనాథ్, శ్రీ కాంత్ రెడ్డి, మహమ్మద్ కుతుబుద్దీన్, మహమ్మద్ జహంగీర్ , రంగా అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, బిజీ సందీప్, బాల్ రెడ్డి, నిజాం తదితరులు పాల్గొన్నారు.

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లే.!

అమ్మమ్మ ఇంటికి వచ్చి… అనంత లోకాలకు వెళ్లే…

శోకసముద్రంలో మునిగిన శివశంకర్ కుటుంబ సభ్యులు

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని గేటు పల్లిలో భూక్య శివశంకర్ వయసు (8) సంవత్సరాలు విద్యుత్ షాక్ తాకి మృత్యువాత వాత పడడంతో ఇ టు గెట్ పల్లి లో విశ్వనాధపురం లో విషాదం ఛాయలు అమ్ముకున్నాయి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూక్య నరేష్ కుమారుడు శివ శంకర్ తన అమ్మమ్మ అయినటువంటి బాధావత్ గొజి నివాసముంటున్న గేటు పల్లి గ్రామానికి వేసవి కాలం సెలవుల కోసం రావడంతో మంగళవారం సాయంత్రం గేటు పల్లి లోని భూక్య శంకర్ ఇంటి వద్ద శివశంకర్ ఆడుకుంటున్న సందర్భంలో శంకర్ ఇంటికి కరెంటు సప్లై రావడంతో అది గమనించని శివశంకర్ ఇంటికి సంబంధించిన మెట్ల కు ఉన్నటువంటి ఇనుప చువ్వలను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లాడని మృతుని తండ్రి భుక్య నరేష్ బోరున వినిపిస్తూ బుధవారం నెక్కొండ ఎస్సై మహేందర్ కు దరఖాస్తు ఇవ్వడంతో దరఖాస్తు స్వీకరించిన ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన.!

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన.

“జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడిని ఖండిస్తు పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం

వర్ధన్నపేట (నేటిదాత్రి):

 

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాం లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువుల పై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు. భారత దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మత సంస్థలు ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయని ఇప్పటికైనా వారు ఉగ్రవాదులకు సహాయం అందించడం ఆశ్రయం కల్పించడం మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో వారికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతుందని అదేవిధంగా పాకిస్తాన్ కి కూడా దీటైన సమాధానం ఇస్తుందని ఈట్ క జవాబు పత్తర్ సే దేంగే నినాదాన్ని చేసి చూపెడతారని మహేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని లేదంటే సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల నవీన్. పింగిలి రాజేందర్. రెడ్డి ఇటికాల ప్రశాంత్. చిర్రా కిరణ్. ఏబీవీపీ నాయకులు బెల్లం కార్తీక్. వడ్డే శ్రీకాంత్. గోరుకంటి శివ. బండారి రేవంత్. చిర్ర రాకేష్. వేము నూరి నాగరాజు. హరీష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం..

ఇంటికో యువకుడు..ఊరికో బస్సుతో దండుగా కదిలి..కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

-బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు నేర్పటి శ్రీనివాస్

ఈనెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇంటికో యువకుడు..ఊరుకో బస్సుతో దండుగా కదిలి..కేసిఆర్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి..అవినీతి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకుడు నేర్పటి శ్రీనివాస్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2021 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ తో తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి..తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి..ఎన్నో కష్టనష్టాలకు, అవమానాలకు, అణచివేతకు వెనుకడుగు వేయకుండా..ప్రజలను అంటిపెట్టుకొని..రాష్ట్ర సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో..ఆ తర్వాత 10 ఏండ్లు అధికారంలో..నేడు ప్రతిపక్షంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు అండగా నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..పదేళ్ల పాలన..మేలవింపు తెలంగాణ గుండె చప్పుడుగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ..ఉద్యమం పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. టిఆర్ఎస్ 25 ఏళ్ల మహా ప్రస్థానం సందర్భంగా ఈనెల 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు.!

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ జరిగిన రాజనెల్లి గ్రామ వాసులు ఆగం. ఇందిరమ్మ – సొలొమోన్ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు శంషీర్ గారు, మాజీ ఎంపీపీ షౌకత్, ఏఎంసీ.డైరెక్టర్ అశోక్,కాంగ్రెస్ నాయకులు అశోక్, ముర్జల్,మాజీద్,నర్సింలు, శాంసన్, పరమేష్,మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజ్జమిల్, తథితరులు పాల్గొన్నారు.

చోరవాణి అందజేత.!

చోరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:

మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు  తెలిపినారు.

వాసుళ్లే వసూళ్లు టి జి ఎండిసి వసూళ్ల పర్వం.

వాసుళ్లే వసూళ్లు.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

శాఖ సిబ్బంది అయి ఉండి కాంట్రాక్టర్ గుమస్తాగా వసూళ్లు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు

టిజిఎండిసి నిద్ర మత్తు వీడడం లేదు, వసూళ్లు ఆగడం లేదు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఐదు ఇసుక రీచు లో మాత్రం వసూళ్ల పర్వం ఆగడం లేదు, తాజాగా పలుగుల ఎనిమిది ఇసుక క్వారీలో టిఎస్ఎండిసి సిబ్బంది, డ్రైవర్ల దగ్గరినుండి దర్జాగా వసూళ్ల పర్వం కొనసాగించడం ఆశ్చర్యకరం. కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక రీచుల్లో ఇసుక కాంట్రాక్టర్లకు గుమస్తాగా టీఎస్ఎండిసి సిబ్బంది వ్యవహరిస్తూ, వసూళ్ల పర్వం కొనసాగించడం జరుగుతుందన్న విషయం ఇప్పటికే, సాక్షాలతో తేర పైకి తీసుకురావడం కూడా జరిగింది, తాజాగా సోమవారం రోజు, పలుగుల 8 ఇసుక క్వారీలో టీఎస్ఎండిసి సిబ్బంది డ్రైవర్ల నుండి వసూళ్ల పర్వం కొనసాగించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఐదు క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం, తేర పైకి వస్తున్న క్రమంలోని టీజీఎండిఎస్ సిబ్బంది వసూళ్ల పరంపర మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం వెనుక అధికారుల హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

వాసుళ్లే వసూళ్లు.

T G MDC

 

కాలేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక రిచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక శరమాములుగానే కొనసాగుతుంది. అడిగే నాథుడు లేకపోవడంతో,పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల సిక్స్, పుసుపల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి, ఒకటి, ఈ ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ల పెత్తనానికి టి జి ఎం డి సి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. ఈ ఐదు ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్లు, లోడింగ్ వద్ద అదనపు రూపాలు తీసుకోవడం, సీరియల్ పేరుతో 700 నుండి 1200 వరకు ఈ క్వారీల్లో లారీల నుండి డబ్బులు వసూలు చేయడం, కాంటాల వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక వేసి మరో 500 రూపాయలు తీసుకోవడం, ఇలాంటి వ్యవహారాలను సాక్షాలతో తేర పైకి తీసుకురావడం జరిగినప్పటికీ నేటికీ టీజీఎండిసి, చర్యలకు మాత్రం ససేమీరా అంటుంది.

టి జి ఎండిసి వసూళ్ల పర్వం,

T G MDC

 

 

 

బాధ్యతగా వ్యవహరించాల్సిన టీజీఎండిసి సిబ్బంది స్వయంగా వసూళ్ల పర్వం కొనసాగిస్తే ,లారీ డ్రైవర్ అక్రమాలు అదనపు వసూళ్ల వ్యవహారం ఎవరికి చెప్పుకుంటారు, కేవలం టీజీఎండిసి సిబ్బంది వసూళ్లకే పెట్టినట్టు వారి ఏకైక లక్ష్యం అదనపు వసూళ్లు పాసింగ్ పై అదనపు అక్రమ ఇసుక రవాణా చేసి మరింత డబ్బులు వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు అధికారులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పీజీఎండిసి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ శాఖ ఏర్పాటు చేసిన సిబ్బంది అవకతవకలు జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, కాంట్రాక్టర్ అక్రమాలు చేపడితే వారిపై చర్యలు తీసుకునుటకు శాఖ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా సిబ్బంది కాంట్రాక్టర్ కు గుమస్తాలుగా మారి కేవలం వసూళ్ల కొరకే తాము ఉన్నామంటూ దర్జాగా వసూలు చేస్తున్నారు.

ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా అధికారులకు లేదు.

T G MDC

 

 

 

ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో ఇసుక రీచుల నుండి ఇసుక రవాణా చేస్తున్న మహాదేవపూర్ కాలేశ్వరం పరిధిలోని పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలుగుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, మహాదేవపూర్ పుసుక్ పల్లి ఒకటి, ఈ ఐదు ఇసుక క్వారీల్లో ఎన్ని అక్రమాలు జరిగిన, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అధికారులకు మాత్రం ఈ ఐదు క్వారీల పై చర్యలు తీసుకునే సత్తా లేదని గ్రామాల్లో చెప్పుకొస్తున్నారు. ఈ క్వారీల యజమానులు రాజకీయంగా పలుకుబడి, అధికారులకు లంచాలు ఇవ్వడం జరిగింది, కనుక అందుకే ఈ క్వారీలపై ఏలాంటి చర్యలు ఉండవని స్థానికులు చెప్పుకొస్తున్నారు. స్థానికుల విషయం వాస్తవమే అని చెప్పుటకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ఐదు ఇసుక క్వారీల్లో టీఎస్ఎండిసి సిబ్బంది గుత్తేదారుల గుమస్తాలుగా మారి వ్యవహరిస్తున్న సాక్షాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం సాక్షాలతో తెరపైకి వచ్చిన కిందిస్థాయి అధికారి నుండి ఉన్నత అధికారి వరకు ఏలాంటి చర్యలకు ఆదేశించకపోవడం, అధికారులు లంచాలు తీసుకున్నారని గ్రామాల్లో ప్రజల మాటలు వాస్తవం అనిపించేలా కనబడుతుంది.

అంతా అధికారుల కనుసైగల్లో, అందుకే దర్జాగా వసూళ్లు.

ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు అదనపు ఇసుక వ్యవహారం, గుట్టుచప్పుడు కాకుండా జరగడం లేదు, ఈ క్వారీల్లో వసూళ్లు చేస్తున్న టీజిఎండిసి సిబ్బంది అధికారులకు కూడా వాటా ఉండడంతో, అంతా అధికారుల కనుసైగల్లోనే అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, వ్యవహారం దర్జాగా కొనసాగుతుందని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు, అక్రమ వసూళ్లలో వాటాదారులు గా అధికారులు ఉండకపోతే సాక్షాలు తెరపైకి వచ్చిన 20 రోజులుగా వరుస కథనాలు వచ్చినా కూడా, ఏ అధికారి కూడా ఈ క్వారీలపై విచారణకు రాకపోవడం, ఏలాంటి చర్యలకు ఆదేశించక పోవడం, రోజురోజుకు వసూళ్ల పర్వం మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం, ఈ వ్యవహారా లాన్నిటిని గమనిస్తే అధికారులు కూడా వాటాదారులేనని స్పష్టమవుతుంది.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా టిజిఎండిసి వ్యవహారం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం అదనపు ఇసుక రవాణా కాసుల కొరకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్ మరియు వారికి గుమస్తాలుగా వ్యవహరిస్తున్న టీజీఎండిసి సిబ్బంది వసూళ్లపర్వంతో, అధికారులకు వాటాలు పంపించి, శాఖపరమైన చర్యలు లేకుండా అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగించడం, వాస్తవాలు సాక్షాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి చర్యలు తీసుకోకుండా ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక తప్పడం లేదు, ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా అక్రమాలపై “డెడ్లైన్” విధించి ఉన్నప్పటికీ, టి జి ఎం డి సి అమలు చేయకపోవడం ఇసుక క్వారీలో అక్రమాలు మరింత పెరగడం, ప్రజల్లో ప్రభుత్వ ఆదేశాలకు విలువ లేకుండా ఉందని చెప్పుకునేలా వ్యవహరిస్తుంది టిజి ఎండిసి, అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న ఈ ఐదు క్వారీలపై ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే ఈ ఇసుక క్వారీలపై చర్యలతో పాటు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నత అధికారులపై ఉంది.

error: Content is protected !!
Exit mobile version