వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం .

వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం ….

◆ చేతికొచ్చిన పంట కోతకు రాని దుస్థితి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం పరిధిలోని మామిడి మొక్కజొన్న, బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతికొచ్చిన పంటలను కోయలేని పరిస్థితి నెలకొనడంతో రైతు నేలకు భారీ నష్టం సంభవిస్తుంది.మొక్కజొన్న,కూరగాయల వంటి పంటలు కోతకు సిద్ధంగా ఉండగా, నిరంతర వర్షాలు, వడగళ్ల కారణంగా బురదమయ ఏమైనా పొలాల కారణంగా కోత పనులు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యం గల తక్కువ ఎత్తులో ఉన్న పొలాల్లో నీరు చేరడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితి రైతులను ఆర్థికంగా మానసీకం గా కూడా కుంగదీస్తుంది. కొందరు రైతులు పంట కోసేందుకు కూలీలు రాకపోవంతో యంత్రాలు బురదలో కదలలేని స్థితి కారణంగా నష్టం తప్పడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, బొప్పాయి. రైతులు భారీ వర్షాలు వనగళ్లు కారణంగా కాయలు తీ వ్రంగా దెబ్బతినడంతో మార్కెట్లో ధర లేకపోవడం తో చెట్టుపైనే మామిడికాయలు కోయకుండా వదిలేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సూచించారు. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పంట నష్టాన్ని అధిగమించేందుకు సాంకేతిక,ఆర్థిక సహయం అందించాలని స్థానిక రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version