asathya pracharalu cheste kesule, అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

– రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

సోషల్‌ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ హెచ్చరించారు. గత కొద్దికాలంగా ఇవిఎంలపై సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలను ఆయన ఖండించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సోషల్‌ మీడియాలో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని రజత్‌కుమార్‌ మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతోపాటు పలుచోట్ల ఇవిఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని..దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయని అన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఇవిఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

 

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

ముందస్తు సాకులు…సేమ్‌ సీన్‌

నేటిధాత్రి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ సీన్‌నే రిపీట్‌ చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ముఖాముఖి ఏకి పారేసిన చంద్రబాబు దేశ రాజధానిలోను అదే సీన్‌ను కొనసాగించారు. సిట్టింగ్‌ ఎంపీలు, మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఆయన వైఎస్సార్‌సీపీ, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని కౌంటింగ్‌ కాకముందే బాబు కొత్త పల్లవి అందుకున్నారు. అయితే చంద్రబాబు చేసిన ఈ కామెంట్లపై ఏపీలో రకరకాల విమర్శలు వినవస్తున్నాయి. ఓటమికి కావల్సిన సాకులను బాబు ముందస్తుగానే వెతుక్కుంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రం రావణకాష్టం

ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని తాము అనుమానిస్తున్నట్టు చంద్రబాబు ఆరోపించారు. శని, ఆదివారాలు ఢీల్లీలోనే ఉంటానని, ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి కారణం ఎవరు అని ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15మంది టిడిపి ప్రతినిధుల బందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలలో తలెత్తిన లోపాలు తదితర అంశాలను ఈసీ దష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఇష్టప్రకారం అధికారులను బదిలీ చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఉదయం నుంచి తిండీ, నీళ్లు లేకుండా ఓటర్లు క్యూలైన్లలో ఇబ్బందులు పడ్డారన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ దెబ్బతీస్తున్నారని దేశంలోని అన్ని పార్టీలూ ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవస్థాగతంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే పద్ధతి మళ్లీ రావాలన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించి కారణాలు చెప్పకుండానే అధికారులను బదిలీలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను సైతం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల మొరాయింపుపై వైఎస్సార్‌సీపీ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.

మోడీ సూచనలతో ఈసీ ఏకపక్ష వైఖరి

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులతో భారీగా ఓట్లు తొలగించారని, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. తమ నేతలపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు ఫిర్యాదులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓటువేసే ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను పంపలేదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించడానికి ఆరు రోజులు సమయం పడుతుందని ఈసీ చెబుతోందని, బ్యాలెట్‌ విధానంలో అయితే ఒట్ల లెక్కింపు ఒక్క రోజులో పూర్తయ్యేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోడీ సూచనల మేరకే ఈసీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదన్నారు.

తెల్లవారు వరకు పోలింగ్‌..ఇదేం ప్రజాస్వామ్యం?

సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీచేసి సీబీఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్‌ను సీఎస్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా పట్టించుకోలేదని, తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరిగిందంటే ఇదేం..ప్రజాస్వామ్యం..ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజల ఓపికను పరీక్షించిందంటూ సీఎం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హత్య జరిగినా..మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వేలసంఖ్యలో ఈవీఎంలు ఫెయిల్‌ కావడానికి కారణమేంటని నిలదీశారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్‌ బ్యాలెట్‌లు వాడుతున్నాయని సీఎం గుర్తు చేశారు.

ఆ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులా?

పోలింగ్‌ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈవీఎంల పనితీరుపై అందరికీ సందేహాలు ఉన్నాయని, తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేపర్‌ బ్యాలెట్‌లపై అందరికీ అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయన్నారు. బ్యాలెట్‌ను లెక్కించేందుకు 16గంటల సమయం పడుతుందని, మరి వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరురోజుల సమయం ఎందుకు అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

 

4va anthasthu nunchi duki vidhyarthini atmahatya, 4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

రాయదుర్గం, నేటిధాత్రి : హైదరాబాద్‌ మణికొండ చిత్రపురికాలనీలో ఇంటర్‌ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్రపురికాలనీలో నివసించే ఇందుశ్రీ (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తన ఇందుశ్రీ బాబాయి కుమార్తె ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఇందుశ్రీ తన తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతోగానీ చెప్పలేదు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఇందుశ్రీ తండ్రి తమకెందుకు చెప్పలేదంటూ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందుశ్రీ ఎల్‌ఐజీ బ్లాక్‌-18లో నాలుగో అంతస్తు పైనుంచి కిందకి దూకింది. తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

mulugu rajakiya terapie senior journalist, ములుగు రాజకీయ తెరపై సీనియర్‌ జర్నలిస్టు

ములుగు రాజకీయ తెరపై సీనియర్‌ జర్నలిస్టు

నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ వైపు రంగం సిద్ధమవుతుండడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. ములుగు జిల్లా నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిపై ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్‌ కావడంతో ఈ పీఠాన్ని కైవం చేసుకోవడానికి పలువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాజకీయాల్లోకి సీనియర్‌ జర్నలిస్ట్‌

గత రెండు దశాబ్ధాలుగా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో జర్నలిస్టుగా సేవలందించిన సీనియర్‌ జర్నలిస్టు తుమ్మ శ్రీధర్‌రెడ్డి ప్రాదేశిక ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనరల్‌ స్థానం కావడంతో ఏటూరునాగారం జడ్పీటిసిగా పోటీచేసి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ములుగు జిల్లాలో విస్తృతమైన సంబంధాలు కలిగిన శ్రీధర్‌రెడ్డి ములుగు రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ప్రయత్నాలలో తుమ్మ శ్రీధర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు తెలియవచ్చింది. అందరిని సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రం ఎక్కేందుకు ఇప్పటికే ఆయన పని చేసుకుంటూ పోతున్నట్లు తెలిసింది.

గులాబీ అధిష్టానం ఆశీస్సులు

ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనరల్‌ స్థానం కావడంతో అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఈ సంఖ్య విషయం ఎలా ఉన్న అత్యధికులు తుమ్మా శ్రీధర్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధిష్టానాన్ని సైతం సంప్రదించిన ఆయన హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లాలో స్థానికంగా బలం ఉన్న నాయకుడి కోసం చూస్తున్న గులాబీ బాస్‌ శ్రీధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీధర్‌రెడ్డి ఈ స్థానం కోసం బరిలో దిగితే జర్నలిస్టుల నుంచి సైతం సంపూర్ణ మద్ధతు లభించే అవకాశం ఉన్నందున గులాబీ బాస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ సైతం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా, టియుడబ్ల్యుజె (ఐజెయు) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ శ్రీధర్‌రెడ్డి జర్నలిస్టు యూనియన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ అతనికి కలిసివస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి టికెట్‌ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?

నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…? అక్కడ జగన్‌ వాహా కొనసాగుతుందా…? గురువారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఆంద్రప్రజలు జగన్‌ వైపే మొగ్గుచూపారా…? ప్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలు కానుందా…? ఇలాంటి అనేకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్నాయిట. మెజార్టీ ప్రజలు జగన్‌నే సమర్థించారని సంకేతాలు వెలువడుతున్నాయట. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఇక్కడ జోరుగానే కొనసాగుతుంది. రెండోసారి అధికార పీఠం ఎక్కేందుకు చంద్రబాబు తన సర్వశక్తులు ధారపోసి విజయం బాటన కొనసాగేందుకు ప్రయత్నించిన ఈసారి జగన్‌కే ఎపీ ప్రజలు పట్టం కట్టనున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

బాబుకు ముందే తెలుసా…?

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఆధారంగా తాము ఓటమి బాటపట్టనున్నామని అర్థమయిపోయిందని తెలిసింది. అయితే దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈసితో గొడవకు దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఈసి పక్షపాంతంగా వ్యవహరిస్తుందని ఎన్నికల కార్యాలయం ముందు ధర్నాకు దిగడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు నేరుగా వార్నింగ్‌లు ఇవ్వడం ఇవన్ని ఓటమిని ఒప్పుకున్నట్లు సంకేతాలేనని అంటున్నారు. దీనికి తోడు ఓట్ల లెక్కింపు విషయంలో సైతం అనుసరించాల్సిన విషయాలు, వివిప్యాట్‌ స్లిప్పుల విషయంలో సైతం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ టూర్‌ పెట్టుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేంద్ర ఎన్నికలకమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం…వింటే సరేసరి లేదంటే అక్కడ ధర్నా చేస్తాం అంటూ బాబు మరోసారి సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు నిజంగానే ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఎపీలో కొనసాగుతుంది.

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తోందా…?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం కోల్పోనున్నాడు. జగన్‌ అధికారంలోకి వస్తాడని తెలంగాణ సీఎం కేసిఆర్‌ ముందే తెల్చేశారు. చంద్రబాబుకు తాము రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని ప్రకటించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే బాబు ఓడిపోవడం, జగన్‌ అధికారంలోకి రావడమేనని ప్రస్తుతం ఆంధ్రా ప్రజలకు అర్థమయ్యిందట. బాబు అధికారం కోల్పోతే కేసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ విజయవంతం అయినట్లేనని ప్రజలు భావిస్తున్నారట. మొత్తానికి కేసిఆర్‌ జగన్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ పాఠాలు చెప్పి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేలా సహకరించారని తెలంగాణ కేసిఆర్‌ సక్సెస్‌ కావడమే కాకుండా ఎపీలో జగన్‌ను సైతం తానే విజయం బాట పట్టించాడని, అనుకున్న రీతిలో జరిగితే ఇద్దరికి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికసంఖ్యలో ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సైతం టిఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలు కీలకం కానున్నాయనే తెలుస్తుంది. కేంద్రంలో ఒకవేళ హంగ్‌ చాన్స్‌ ఉంటే వీరు కీలకం కావడంతోపాటు, ఇటీవల మోడ శత్రువునైనా కలుపుకుంటామని అనడంతో వీరు ఎన్డీయే వైపు మొగ్గుచూపుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తానికి ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుపు గుర్రం ఎక్కబోతుందనే భయం బాబులో కనపడుతుందని టిడిపిలో సైతం చర్చజరుగుతోందట.

ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ – పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది

ఓటు ‘పడిపోయింది’

కౌంట్‌ ‘డౌన్‌’

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం బాగానే పడిపోయింది. ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు కనిపించలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలన్ని దాదాపు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించిన ఆశించిన మేరకు పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఓటర్లను చైతన్యం చేసి వాహనాల్లో తరలించేందుకుగాను, వాహనం సౌకర్యం కల్పించేందుకుగాను అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతోపాటు గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండి చదువు, ఉద్యోగం నిమిత్తం నగరాల్లో ఉంటున్న వారు సైతం ఓటుహక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు రాలేదు. దీంతో కొన్ని గ్రామాల్లో ఉన్న ఓట్లలో 50శాతం కూడా నమోదు కాలేదు. కారణంగా మొత్తంగా పోలింగ్‌ శాతం 60దాటకుండా పోయింది.

ఆసక్తి చూపని హైదరాబాదీలు

ఓటు వేయడానికి భాగ్యనగరవాసులు ఈసారి అంతగా ఆసక్తి కనబర్చనట్లే కనపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోనే అత్యత్పంగా పోలింగ్‌ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో 39.49, సికింద్రాబాద్‌లో 39.20శాతం నమోదు అయ్యింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పార్లమెంట్‌ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపనట్లు కనపడుతోంది.

మెదక్‌లో అత్యధికం

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా శాతాలు పరిశీలిస్తే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 68.60శాతం పోలింగ్‌ అత్యధికంగా నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లో ఓటు వేయడానికి ఓటర్లు కాసింత ఆసక్తి చూపినట్లే కనపడింది.

నిజామాబాద్‌లో 54.20శాతం

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 54.20శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ నుంచి కేసీఆర్‌ తనయ కవిత బరిలో నిలువగా రైతులు అత్యధిక సంఖ్యలో నామినేషన్‌ వేశారు. దీంతో ఈ స్థానంలో పోలింగ్‌ శాతంపై ఆసక్తి ఏర్పడింది.

నగదు పంపిణీ కారణమేనా…?

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు నగదు పంపిణీ చేయకపోవడం పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణంగా కొంతమంది చెపుతున్నారు. అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం అధికంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఈ ప్రవాహం అధికంగా లేకపోవడంతో కొంతమంది ఓటర్లు ఓట్లు వేయడానికి నిరాసక్తత ప్రదర్శించారని కొందరు అంటున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఓటుకు వంద ఇవ్వడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణవ్యాప్తంగా పోలింగ్‌ శాతం వివరాలు

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5గంటల సమయానికి అత్యధికంగా మెదక్‌, కరీంనగర్‌లో పోలింగ్‌ శాతం నమోదు కాగా.. హైదరాబాద్‌ జంట నగరాల్లో అత్పల్పంగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌ 39.49

మల్కాజ్‌గిరి 42.75

మెదక్‌ 68

మహబూబ్‌నగర్‌ 65

నాగర్‌కర్నూల్‌ 57.12

పెద్దపల్లి 59.24

సికింద్రాబాద్‌ 39.20

వరంగల్‌ 59.17

నల్గొండ 66.11

ఆదిలాబాద్‌ 66.76

ఖమ్మం 67.96

కరీంనగర్‌ 68

చేవెళ్ల 53.08

భువనగిరి 68.25

మహబూబాబాద్‌ 59.90

నిజామాబాద్‌ 54.20

 

thiragabadda voterlu…, తిరగబడ్డ ఓటర్లు…!

తిరగబడ్డ ఓటర్లు…!

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్‌ను బహిష్కరించి రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామంలో గత 80సంవత్సరాలుగా తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను 200ఎకరాల భూములు మావి కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో స్థానిక విఆర్వో తమను వేధిస్తున్నాడని, తాము సాగు చేసుకుంటున్న భూముల్లో జెండాలు పాతించి ఇవి ప్రభుత్వ భూములని చెప్పి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నాడని గ్రామస్తులు అంటున్నారు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించి ధర్నాకు దిగారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. గ్రామస్తులంతా ఏకమై ఓటింగ్‌ను బహిష్కరించడంతో పోలింగ్‌ కేంద్రం మొత్తం బోసిపోయింది. మధ్యాహ్నం వరకు ఓటు వేసే వారు లేక పోలింగ్‌ సిబ్బంది ఓటర్ల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చున్నారు.

బుజ్జగించిన తహశీల్దార్‌

గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించిన విషయం తెలుసుకున్న నూగూరు వెంకటాపురం తహశీల్దార్‌ గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ట్రైబల్‌ ఏరియాలో నాన్‌ట్రైబ్‌కు భూమి ఇచ్చే రూల్‌ లేదని ప్రభుత్వం ఎలా చెపితే తాను అలా చేస్తానని, విఆర్వోను తాను జెండాలు పాతమని చెప్పలేదని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వ భూములు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల భూములను తాము స్వాదీనం చేసుకోమని తహశీల్దార్‌ హామీ ఇచ్చారు. ఇక ముందు గిరిజనేతరులు ఎవరు భూములను ఆక్రమించుకోకూడదని సూచించారు. అయినా రైతులు శాంతించలేదు. దీంతో జోక్యం చేసుకున్న వెంకటాపురం ఎస్సై తిరుపతి సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని, తాను సహకరిస్తానని ఓటు వేయాలని కోరడంతో రైతులు శాంతించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారు

– శేషగిరిరావు, రైతు

బెస్తగూడెం గ్రామంలోని 200ఎకరాల్లో విఆర్వో రాజేందర్‌ జెండాలు పాతించి తమను వేధిస్తున్నాడని గ్రామ రైతు శేషగిరిరావు ఆరోపించారు. ఈ విషయం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అవి గిరిజనుల భూములు మీరు చచ్చిపోండని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్తగూడెం గ్రామానికి చెందిన అనేకమంది రైతులు గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం తమను కరుణించి సమస్య పరిష్కారం చేయాలన్నారు.

 

encounter chesthava…, ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, పరకాల సీఐ మధు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన స్వగ్రామం అయిన పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో సీఐ టిఆర్‌ఎస్‌కు సహకరించాడని దొమ్మాటి సాంబయ్య ఆరోపించారు. తమ కార్యకర్తలను ఎందుకు బూతులు తిడుతున్నావని గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సీఐతో దొమ్మాటి వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో సీఐ తాను ఎవరిని దూషించలేదని స్పష్టం చేశారు. దొమ్మాటి సీఐతో వాగ్వాదానికి దిగుతూనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రాతపూర్వకంగా తాను ఫిర్యాదు చేస్తానని సీఐ మధు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. దీంతో మరోసారి కలగజేసుకుని సీఐ తాను అమర్యాదగా ఎంతమాత్రం ప్రవర్తించలేదని, వీడియో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. సీఐ వివరణతో సంతృప్తి చెందని దొమ్మాటి ఎన్‌కౌంటర్‌ చేస్తావా…? చెయ్యి అంటూ ముందుకు వెళ్లారు. తాను అలా అనలేదని సీఐ చెప్పిన అదేం పట్టించుకోని దొమ్మాటి తీవ్ర స్వరంతో సీఐతో వాగ్వాదానికి దిగారు.

 

police sibbandipie suspention veetu,పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. సస్పెషన్‌ వేటుకు గురైయిన వారిలో యు.రాజు సుబేదారి పోలీస్‌స్టేషన్‌, వి.నిరంజన్‌ సంగెం పోలీస్‌ స్టేషన్‌, ఇ.గణేష్‌ సిటి గార్డ్స్‌, కె.ఉపేందర్‌ కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, డి.శ్రీనివాస్‌ రఘనాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారు వున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా సెలవుల్లో వున్న 69మంది సిబ్బంది తక్షణమే విధుల్లో చేరి ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వుంది. ఇలా సెలవులో వెళ్లిన వారికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు సెలవులో వున్న పోలీస్‌ సిబ్బంది తక్షణమే ఎన్నికల విధుల్లో చేరిపోవాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల ద్వారా నోటీసులను సైతం జారీచేశారు. అందులో 64మంది సిబ్బంది తిరిగి విధుల్లో చేరగా ఈ నోటీసులకు స్పందించకుండా ఎన్నికల విధుల్లో చేరేందుకు రాకుండా ఆలసత్వంతో వ్యవహరించిన మిగితా ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ల తీరుపై ఎన్నికల కమీషన్‌ నియమాలను అనుసరించి సదరు ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

……………………………………………….

parlament ennikalaku kattudettamaina bhadratha erpatlu

పార్లమెంట్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు ఐదువేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. ఈనెల 11వ తేదీన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరగబోయే ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌తోపాటు పాక్షికంగా వున్న మహబూబాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ప్యూహత్మకమైన ప్రణాళికను రూపోందించామని చెప్పారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 2127పోలింగ్‌ కేంద్రాలు 1053 ప్రాంతాల్లో వున్నాయని, అందులో 246 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 234మార్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయని, ఇందుకు సంబంధించి పోలీస్‌శాఖ తరుపున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్డ్‌ ప్రకటించిన నాటి నుండే నియోజకవర్గం వారిగా స్టాటిక్‌ సర్వేలేన్స్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు గత రెండు నెలలకాలంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ బందాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపణీ చేసే డబ్బు, మద్యంతో చట్ట వ్యతిరేకమైన అయుధాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా గత రెండునెలల నుండి 8 సంఘటనల్లో 58,29,860రూపాయల డబ్బును సీజ్‌ చేయడంతోపాటు, 1523 కేసుల్లో 9302మందిని బైండోవర్‌ చేశామని చెప్పారు. ఇందులో రౌడీ షీటర్లు, బెల్టుషాపు నిర్వాహకులు, అనుమానితులతోపాటు గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారు వున్నారని, అధేవిధంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న 143తుపాకులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయగా, మరో 79 తుపాకులు బ్యాంక్‌ సెక్యూరిటీగార్డుల వద్ద వున్నాయని, రెండునెలల నుండి పెండింగ్‌లో వున్న 133 నాన్‌-బెయిల్‌బుల్‌ వారెంట్లలోని నిందితులను కోర్టుకు హాజరుపర్చామని అన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్‌కు సంబంధించి 74 కేసులు నమోదు చేయడంతోపాటు, 3,31,695రూపాయల విలువ గల 1144లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నేరస్థుల నియంత్రణలో భాగంగా పోలీస్‌ మిషనరేట్‌ పరిధిలో మొత్తం 58మంది నిందితులపై పీడీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేయబడ్డాయని, ఇక ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 10కేసులు నమోదయ్యాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తుకు సంబంధించి తొలిసారిగా పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, ఎన్నికల బందోబస్తు కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ సిబ్బందితోపాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి ఓటరు తమ హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అలాగే ఎవరైనా ఎన్నికలకు ఆటంకంపర్చడం గానీ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్‌ నమోదుచేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.

……………………………………………….

votuku velaye, ఓటుకు వేళాయే…

ఓటుకు వేళాయే…

– ఓటింగ్‌కు సర్వం సిద్దం చేసిన ఎన్నికల కమీషన్‌

– పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

– కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసుశాఖ

– ఎన్నికల విధులకు గైర్హాజరైన పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

– ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వేశాఖ

– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

నేటిధాత్రి బ్యూరో : మొదటిదశ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్దమయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. పోలింగ్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వివిధ పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వేసవికాలం అయినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు చలువ పందిళ్లు, షామియానాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌ సిబ్బంది బుధవారం ఉదయమే వివిధ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పోలీస్‌శాఖ అదనపు భద్రత ఏర్పాట్లను చేసింది.

మొదటి దశకు అంతా సిద్ధం

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల ద్వారా దేశ ప్రజలు తీర్పునివ్వనున్నారు. దేశంలోని 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న (గురువారం) దేశంలోని మొత్తం 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను సిద్ధం చేశారు. అవి మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25, తెలంగాణలోని 17, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, అసోంలోని 5, బిహార్‌లోని 4, ఛత్తీస్‌గఢ్‌లోని 1, జమ్ముకశ్మీర్‌లోని 2, మహారాష్ట్రలోని 7, మణిపూర్‌లోని 1, మేఘాలయలోని 2, మిజోరంలోని 1, నాగాలాండ్‌లోని 1, ఒడిశాలోని 4, సిక్కింలోని 1, త్రిపురలోని 1, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, ఉత్తరాఖండ్‌లోని 5, పశ్చిమ్‌బెంగాల్‌లోని 2, లక్షద్వీప్‌లోని 1, అండమాన్‌ నికోబార్‌లోని 1స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

అసెంబ్లీ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటికి ఏప్రిల్‌ 11, 18, 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటన్నింటికీ గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.

సిక్కింలో ఒక లోక్‌సభ స్థానం, 32శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ గురువారం ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల వేళ.. 36 ప్రత్యేక రైళ్లు!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేలాదిమంది ప్రయాణికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సతీష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు 40రైళ్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇవేకాకుండా వేసవి, ఎన్నికల రద్దీ దష్ట్యా రానున్న మూడురోజుల్లో ప్రత్యేకంగా 36రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, విశాఖకు ప్రతిరోజు 28 రైళ్లు నడుస్తుండగా..రోజుకు 11 రైళ్ల చొప్పున అదనంగా నడపనున్నారు. గుంతకల్‌, కర్నూలు, తిరుపతికి 16 రైళ్లు ఉన్నప్పటికీ అదనంగా 9 రైళ్లు నడుపుతామని తెలిపారు.

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి…

సీఇఓ రజత్‌కుమార్‌

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర సిఇఓ రజత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 నియోజకవర్గాలలో పోలింగ్‌ సామగ్రి చేరుకున్నాయని, నిజామాబాద్‌లో సామగ్రి మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా బుధవారం రాత్రికి పోలింగ్‌ సామగ్రి చేరుకుంటుందని, గురువారం ఉదయం 5.30కి మాక్‌ పోలింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7గంటల నుండి పోలింగ్‌ ప్రారంభమవుతుందని, నిజమాబాద్‌లో ఉదయం 8నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో 5గంటల వరకు లైన్లో ఉండే వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓటర్‌ స్లిప్‌ ఐడి ప్రూఫ్‌ కాదు..12రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. 48లక్షల మందికి ఓటర్‌కార్డులు పంపిణీ చేసామని, ఓటరు లిస్ట్‌లో పేరు ఉందో…లేదో చెక్‌ చేసుకోవాలని, ఎపిక్‌ ఉంటే ఓటు ఉన్నట్టు కాదని అన్నారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లలో మొబైల్‌ అనుమతించబడవని, ఏదైనా ఇబ్బంది కలిగితే తప్ప అక్కడ అధికారి మాత్రమే మొబైల్‌ తీసుకెళ్తారని, కానీ ఎవరూ కూడా పోలింగ్‌ తేదీన మొబైల్‌ తీసుకొని రాకూడదని చెప్పారు.

ఏర్పాట్లు పూర్తయ్యాయి…

నిజామాబాద్‌లో 600మంది ఇంజనీర్లు విధుల్లో ఉంటారని, మొత్తం 2లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై వచ్చిన కంప్లైంట్‌ ఓ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇసిఐ నేడు నోటీస్‌ ఇచ్చిందని, 171 కేసు కింద కొండ సందీప్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యిందని, కానీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధం లేదు అని తాను చెప్పారు…టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇప్పుడు పిర్యాదు చేసిందని, 55వేల పోలీస్‌ సిబ్బంది పోలింగ్‌ భద్రతలో ఉంటారని, 3లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రగతిభవన్‌లో చేరికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని ఇసిఐకి నివేదించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్‌లో ఒక్కో బూత్‌ లో 12మెషీన్లు వాడుతున్నామని, అదనపు గదులు తీసుకుని మాక్‌ పోలింగ్‌కు ఉపయోగించుకునున్నామని తెలిపారు.

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి

దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జరిగే రెండురోజుల ముందే మావోయిస్టులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది

– పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

– శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి…

నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ బరిలో ఉండగా, నర్సంపేట నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వస్తాయని భావించినట్లు సమాచారం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేయగా ఆయనకు 1476ఓట్లు (0.78శాతం) మాత్రమే నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ పార్టీ రెండవస్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మూడవస్థానంలో ఉండగా, ఎడ్ల అశోక్‌రెడ్డికి నాల్గవ స్థానం లభించింది. దీనికి కారణం అభ్యర్థి ఎడ్ల అశోక్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కలుపుకోకపోవడమే కారణమని పలువురు నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలకు ముందు నర్సంపేట పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా 1500మంది కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలపగా ఓటింగ్‌ శాతం మాత్రం ఎందుకు తగ్గిందని నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్‌శాతం పెరిగేనా అని పలువురు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పట్టిపట్టనట్లుగా ఉంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ ఓటింగ్‌ శాతం పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించేనా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖేల్‌ ఖతమేనా…?

తెలంగాణ, మహారాష్ట్రలో యథేచ్చగా కలప వ్యాపారం చేస్తున్న తెలంగాణ వీరప్పన్‌ కథ ఈ అరెస్టుతో ముగిసినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. గత 10సంవత్సరాలుగా పోలీసులకు కోట్ల రూపాయల కలప వ్యాపారం చేస్తూ అధికారులను సైతం ఇతగాడు గడగడలాడించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో కలప వ్యాపారం చేస్తూ ఫారెస్ట్‌ అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తిరిగి ఎట్టకేలకు చిక్కాడు. కలప స్మగ్లింగ్‌లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎవరు సహకరిస్తున్నారు. తదితర విషయాలు పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సూత్రధారులకు గుబులు

తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ శ్రీను అరెస్టుతో ఇంతకాలంగా అతనికి సహకరిస్తున్న కొందరికి గుబులు మొదలైనట్లు తెలిసింది. అరెస్టు అయిన తెలంగాణ వీరప్పన్‌ తమ పేరు ఎక్కడ చెబుతాడోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వాటాలు అందుకుంటూ స్మగ్లర్‌కు సహకరిస్తూ వస్తున్న వారు సైతం తమ పేర్లు ఎక్కడ చెబుతాడోనని వణికిపోతున్నారట. మొత్తానికి తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు అటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతుందట.

 

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖేల్‌ ఖతమేనా…?

తెలంగాణ, మహారాష్ట్రలో యథేచ్చగా కలప వ్యాపారం చేస్తున్న తెలంగాణ వీరప్పన్‌ కథ ఈ అరెస్టుతో ముగిసినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. గత 10సంవత్సరాలుగా పోలీసులకు కోట్ల రూపాయల కలప వ్యాపారం చేస్తూ అధికారులను సైతం ఇతగాడు గడగడలాడించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో కలప వ్యాపారం చేస్తూ ఫారెస్ట్‌ అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తిరిగి ఎట్టకేలకు చిక్కాడు. కలప స్మగ్లింగ్‌లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎవరు సహకరిస్తున్నారు. తదితర విషయాలు పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సూత్రధారులకు గుబులు

తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ శ్రీను అరెస్టుతో ఇంతకాలంగా అతనికి సహకరిస్తున్న కొందరికి గుబులు మొదలైనట్లు తెలిసింది. అరెస్టు అయిన తెలంగాణ వీరప్పన్‌ తమ పేరు ఎక్కడ చెబుతాడోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వాటాలు అందుకుంటూ స్మగ్లర్‌కు సహకరిస్తూ వస్తున్న వారు సైతం తమ పేర్లు ఎక్కడ చెబుతాడోనని వణికిపోతున్నారట. మొత్తానికి తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు అటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతుందట.

……………………………………….

ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా ..

ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.

నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో

వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో పాల్గొని కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందఠంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ముందు సమన్వయం లేకపోవడం వలనే ప్రచారాలు కూడా చేసుకోలేక పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం బలవంతంగా సీటు కేటాయించాలని పత్రికల ప్రకటనలు బలరామ్‌నాయక్‌ చెసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారని, ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపు ఖాయమని అన్నారు.ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం కషి చేయాలని సూచించారు .

పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద బిడ్డగా ఉంటానని తెలిపారు. ఆడబిడ్డగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు .నర్సంపేట నియోజకవర్గ అభివద్ధి కోసం నర్సంపేట కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాల్టీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పొన్నం మొగిలి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి సానబోయిన రాజకుమార్‌, మనోహర రెడ్డి, సంజీవరెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఆకుల శ్రీనివాస్‌, బానోతు సారంగపాణి, అజయ్‌ కుమార్‌, రాయిడి రవీందర్‌రెడ్డిలతోపాటు అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.

 

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?


అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?

  • – పోచాపురం మినీ గురుకులంలో చిన్నారుల అవస్థలు
  • – పిల్లల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న ప్రిన్సిపాల్‌
  • – నీళ్ల పప్పు, చాలీచాలని ఉప్మా, పనికిమాలిన మెను
  • – నీటి సౌకర్యం లేక అల్లాడుతున్న విద్యార్థినులు-వ్యవసాయ బావులే దిక్కు
  • – ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…?
  • – ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు

నేటిధాత్రి బ్యూరో : నేటి బాలలే రేపిటి పౌరులు, తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అంటారు. ఇవన్ని అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. అప్పుడప్పుడు వీరు సైతం ఈ నీతి సూత్రాలను వల్లిస్తుంటారు. ఆచరణలో మాత్రం ఆవగింజతైనా పాటించారు. ఓవైపు సర్కార్‌ బాలకార్మికులు లేని రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దాలని చూస్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం బడికి వెళుతున్న బాలికలను బాలకార్మికులుగా మారుస్తున్నారు. పోషకాహారం అందిస్తున్నాం, సన్నబియ్యం, గుడ్డు, చికెన్‌ అంటూ తెలంగాణ సర్కార్‌ చెపుతుంటే వాటిని అధికారులు మింగుతున్నారో, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ మింగుతున్నారో తెలియదు కానీ నీళ్లచారు, చాలీచాలని ఉడికి ఉడకని, నీళ్లను పోసి బాగా కాచిన ఉప్మాతో అర్థాకలితో బాలికలు చదువును కొనసాగిస్తున్నారు. అంతేకాదు సభ్యసమాజం తలదించుకునేలా నిసిగ్గుగా ఇక్కడ విద్యనభ్యసిస్తున్న బాలికలతోనే ప్రిన్సిపాల్‌ మరుగుదొడ్లు కడిగిస్తూ తన తెలివి తక్కువతనాన్ని ప్రదర్శిస్తోంది. ఇదంతా జరుగుతుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపురం మినీ గురుకుల పాఠశాలలో ఇక్కడి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శ్రీలత తన వ్యక్తిగత పనుల మీద ఉన్న శ్రద్ద విద్యార్థినులపై చూపడం లేదు. తన పిల్లలను చూసుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతో ఇదే గురుకులం తిండి పెడుతూ కేర్‌టేకర్‌ను నియమించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మినీ గురుకులంలోనే ఉంచుతున్న ప్రిన్సిపాల్‌ పిల్లల బాగోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

75మందికి కిలో పప్పు

పోచాపురం మినీగురుకులం పాఠశాలలో 75మంది గిరిజన బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి అందిస్తున్న భోజనం తీరును చూస్తే జాలేస్తుంది. 75మంది బాలికలకు కిలోపప్పుతో ఆలుగడ్డలు ఇతర సామాగ్రి కలిపి నీళ్లచారులా కూర తయారుచేసి వడ్డిస్తున్నారు. రోజు ఇదే కూర పిల్లలకు పెడుతూ ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు తెలిసింది. సరైన ఆహారం లేక అర్థాకలితో తాము అలమటిస్తున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు అందించాల్సిన అల్పాహారం విషయంలో ప్రిన్సిపాల్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలీచాలని ఉప్మాను అందిస్తున్నారు.

బాలికలచే మరుగుదొడ్లు శుభ్రం

పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన చేతులు వంతులవారీగా బ్రష్‌ పట్టుకుని మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నాయి. పోచాపురం మినీ గురుకులం పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలను చూస్తుంటే జాలేస్తుంది. ఇక్కడి ప్రిన్సిపాల్‌ రోజు పిల్లల చేతే మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తుంది. కొంతమంది పిల్లలు అందుకు నిరాకరిస్తే బెదిరిస్తుందని, కొడుతుందని బాలికలు ఆరోపిస్తున్నారు. ఓవైపు బాలకార్మికులను పనిలోంచి బడికి పంపుతుంటే ఇక్కడి ప్రిన్సిపాల్‌ మాత్రం బడికి వెళ్లిన బాలికలను పనిమనుషులుగా మారుస్తుందనే విమర్శలు వినవస్తున్నాయి.

నీటి సౌకర్యం లేదు

మినీగురుకులంలో నీటి సౌకర్యం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులపై ఆధారపడి నీళ్లు తెచ్చుకుంటున్నారు. స్నానం చేయాలంటే ఆరుబయటే వ్యవసాయ బావుల వద్దకే వెళుతున్నారు. ప్రిన్సిపాల్‌ మాత్రం అధికారులతో మాట్లాడి విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు చొరవ చూపడం లేదు.

గురుకుల పాఠశాలలో బయటివ్యక్తులు

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అందులో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు బయటి వ్యక్తులెవరికి అనుమతి ఉండదు. కానీ ప్రిన్సిపాల్‌ మాత్రం బయటివ్యక్తులు గురుకులంలోనే ఉండేలా సహకరిస్తోందని తెలిసింది. ప్రిన్సిపాల్‌ అనుసరిస్తున్న విధానాలు, పిల్లలకు అందిస్తున్న భోజన విషయాలు అధికారుల దృష్టికి వెళ్లకుండా కొంతమంది స్థానికులను గురుకుల పాఠశాలలోకి అనుమతించి వారికి భోజన సౌకర్యాలు కల్పిస్తుందని, వీరు ఇక్కడే తిష్ట వేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు.

అధికారులు మొద్దునిద్ర వీడతారా…?

తాడ్వాయి మండలం పోచాపురం మినీగురుకులంలో ఇంత జరుగుతున్న అధికారులెవరికీ తనిఖీ చేయడానికి మనసు రావడం లేదు. బాలికలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న వీరు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. పట్టణాలకు, మైదాన ప్రాంతాలకే పరిమితమైన అధికారులు ఏజెన్సీ గురుకులాలను పట్టించుకోవడం మానేశారని విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా గురుకులాన్ని తనిఖీ చేసి బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తారా…లేదా చూడాలి.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

– ఎస్‌ఎఫ్‌ఐ

పోచాపురం మినీగురుకులంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్‌ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు. గురుకులంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారులకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురుకులాన్ని సందర్శించి సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేక విద్యార్థినులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. గురకులాన్ని సందర్శించిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నారా దిలీప్‌, సానబోయిన ప్రశాంత్‌ ఉన్నారు.

 

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

  • – మంత్రి దయాకర్‌రావు అతిపై ఆరా…
  • – దూకుడు కాస్త తగ్గించాలని సూచన
  • – సీనియర్లతో సమన్వయం పాటించాలని హితవు

నేటిధాత్రి బ్యూరో : మంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుండి మునుపటి కంటే కాసింత దూకుడు ప్రదర్శిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఖమ్మం, వరంగల్‌లలో ఎర్రబెల్లి ప్రసంగం ఆయన చేస్తున్న అతిపై ఆరా తీసిన సీఎం గట్టిగానే క్లాస్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించావ్‌ అందరిని కలుపుకుని వెళ్లు, సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ క్యాడర్‌ పట్ల మర్యాద పాటించాలని సీఎం మంత్రికి చెప్పినట్లు తెలిసింది. వరంగల్‌ నగరంలో నిర్వహించిన డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడిన భాషపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, పార్టీ క్యాడర్‌ను సీనియర్లను అలా సంభోధిస్తే మొదటికే మోసం వస్తుందని సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్నందున పదవికి తగ్గట్టుగా హుందాగా ఉండాలని కేసిఆర్‌ హితవు పలికినట్లు గులాబీవర్గాలు అనుకుంటున్నాయి. మంత్రి పదవి చేపట్టిన నుంచి బ్రేకులు లేకుండా దూసుకువెళ్తున్న మంత్రి దయాకర్‌రావుకు సీఎం కేసిఆర్‌ బ్రేకులు వేశాడని ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్లు, ప్రజాప్రతినిధులు ఎర్రబెల్లి తమను ఎంతమాత్రం లెక్క చేయడం లేదని మాటల విషయంలో సైతం ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో కేసిఆర్‌ మంత్రికి ఆక్షింతలు వేసినట్లు టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ మంత్రి ఈ విధంగా ప్రవర్తించలేదని, లేకలేక మంత్రి పదవి దక్కించుకున్న ఎర్రబెల్లి మాత్రం తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తు అధినేత దగ్గర మార్కులు కొట్టెస్తున్నానని అనుకున్నాడని, సీన్‌ రివర్స్‌ కావడంతో సీఎం ఆగ్రహానికి గురికావల్సి వచ్చిందని వారు చర్చించుకుంటున్నారు.

కడియంకు అప్పగింత…?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవర్తన, క్యాడర్‌తో మసలుకుంటున్న తీరుపై గులాబీవర్గాల్లో అంతర్గతంగా నిరసన వ్యక్తం కావడంతో మొన్న జరిగిన వరంగల్‌ సభ బాధ్యతలు చివరి నిమిషంలో సీఎం కేసిఆర్‌ కడియంకు అప్పగించినట్లు తెలిసింది. వరంగల్‌ డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాటలతో మనసు నొచ్చుకున్న కొంతమంది సీనియర్లు, కార్పొరేటర్లు ఈ విషయాన్ని అధిష్టానం దాక తీసుకుపోవడంతో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఎర్రబెల్లిని కొనసాగిస్తున్నట్లు సభా బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం క్లాస్‌తో మంత్రి ఎర్రబెల్లి ఒక దారికి రానున్నాడని అతి తగ్గించి అందరితో సమన్వయం చేసుకుంటూ పదవికి తగ్గట్టు హుందాగా ప్రవర్తిస్తాడని ప్రస్తుతం గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా

కిట్టుబాయి దేనా…

  • – గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా
  • – సిగరేట్ల రూపంలో విక్రయం…ఒక్కో సిగరేట్‌ ఐదువందల రూపాయలు
  • – కోడ్‌ చెపితేనే సిగరేట్‌ దొరుకుతుంది
  • – లేదంటే…అలాంటివి మా దగ్గర దొరకవని అమాయకత్వం నటిస్తారు
  • – పాన్‌షాపులే ప్రధాన విక్రయ కేంద్రాలు

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి దందా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగుతోంది. సినిమా తరహాలో గంజాయిని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు గంజాయి విక్రయదారులు. గంజాయికి అలవాటుపడిన యువత దానికి బానిసలా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒక్క గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోనే గంజాయి విక్రయం లక్షల్లో నడుస్తుందని ఓ అంచనా. గట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న కేటుగాళ్లు ఓ మాఫియా తయారై అన్ని ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుకుని నగరంలో ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు…ఆరు కాయల్లా కొనసాగిస్తున్నారు. వీరికి తెర వెనుక అన్నిరకాల సపోర్టు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కేవలం పరిచయం ఉన్న వారికే వీరు గంజాయి సిగరేట్లను విక్రయిస్తున్నారు.

ఒక్కసారి పీల్చారా…?

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో సిగరేట్ల రూపంలో దొరుకుతున్న గంజాయిని ఒక్కసారి పీల్చారా…? ఇక అంతే సంగతులు. ఆ సిగరేట్‌కు బానిస కావాల్సిందే. ఒక్క దమ్ములాగితే…ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లు అవుతుందట. ఎవరితో సంబంధం లేకుండా, అసలు ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా 24గంటలు మత్తులో జోగవచ్చు. ఎక్కువగా అలవాటు ఉన్న వారు. సిగరేట్‌ను ఒక్కసారే కాల్చి మత్తులో ఊగుతుంటే, కొందరు ఈ ఒక్క సిగరేట్‌ను మూడురోజులపాటు తాగుతూ మత్తులో ఏం కానరాకుండా ఊగి…ఊగి పోతున్నారట. ఐదువందల రూపాయల ధర ఉనన& ఈ సిగరేట్‌ కొనడానికి యువత నుంచి మొదలుకుని అన్ని వయస్సుల వారు విక్రయిస్తూ మత్తులో చిత్తవుతూ జేబు గుల్ల చేసుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని హన్మకొండ, వరంగల్‌ ప్రాంతాలలో ఈ గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. హన్మకొండ అశోకా థియేటర్‌ ప్రాంతం, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వెనకాల ప్రాంతాల్లో ప్రధానంగా పాన్‌సాపులల్లో ఈ సిగరేట్‌లను విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయి సిగరేట్లు గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని పాన్‌షాపులలోనే కాకుండా యాచకుల ద్వారా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లు రద్దీగా ఉండే ప్రాంతాలలో యాచకుల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. వీరికి ఎంతో కొంత కమీషన్‌ ముట్టజెపుతూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. యాచకుల ద్వారా గంజాయి సిగరేట్లను అమ్మిస్తే ఎవరికి అనుమానం రాదని గంజాయి కేటుగాళ్లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

కిట్టుబాయ్‌…హోనా…

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పాన్‌షాపులలో గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. అయితే ఈ సిగరేట్లను ఎవరికి పడితే వారికి విక్రయించకుండా కేవలం పరిచయం ఉన్న వారికే విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే ‘కిట్టుబాయ్‌’ అనే కోడ్‌ చెప్పాలి. గంజాయి సిగరేట్‌ అనకుండా కిట్టుబాయ్‌ కావాలంటే ఆ పాన్‌షాప్‌ యజమానికి అర్థం అయిపోతుందట. ఐదువందలు చెల్లించగానే గంజాయి సిగరేట్‌ చేతిలో పెడతారట.

కొరవడిన నిఘా

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి మాఫియా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించకుంటుపోతుంటే నిఘా వ్యవస్థలు కళ్లు మూసుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. బహిరంగంగా, ఇంత విచ్చలవిడిగా కోడ్‌ భాషలో రోజు లక్షల రూపాయల బిజినెస్‌ నడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పాన్‌షాపులు కేంద్రాలుగా గంజాయి సిగరేట్లు విక్రయిస్తున్న సిగరేట్లు పీల్చి యువత మత్తులో చిత్తవుతున్న వీరు మాత్రం తమకేం పట్టనట్లుగానే వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

 

కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం

– ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి

– కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు

– ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌

– ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు

– దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…?

– గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…?

– త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం…

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని భూమిని అన్యాయంగా కబ్జాచేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ, అదే స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న ఓ కబ్జాకోరు నేటిధాత్రి కార్యాలయంపై దాడి చేసేందుకు తన కబ్జాగ్యాంగ్‌ను ఉసిగొల్పాడు. బరితెగించి సామాన్యుని భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ నీచపు పనిని సామాన్యుడి తరపున ‘నేటిధాత్రి’ ప్రశ్నించినందుకు దాడి చేసుందుకు రెక్కి నిర్వహించారు. గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఐదు మోటారు సైకిళ్లపై మోటాదర్కార్లు నేటిధాత్రి కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసిఉండడంతో పక్కనే ట్రాన్స్‌ఫోర్టులో పనిచేసే ఓ హమాలీ కార్మికుడిని ఎప్పుడు వస్తారు…; ఎప్పుడు వెళ్తారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

ఇంత ధైర్యం ఎక్కడిది

కాసేపు బిల్డర్‌నంటూ బిల్డప్‌ కాదు, కాదు పైనాన్సర్‌ను అంటూ బిల్డప్‌ ఇచ్చే హనుమంతరావు అనే వ్యక్తి ‘నేటిధాత్రి’ కార్యాలయానికి సైతం ఫోన్‌చేసి బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో రమ్మని అనడంతో తగ్గిన సదరు బిల్డర్‌ అలియాస్‌ కబ్జాకోరు. గురువారం రాత్రి దాడి చేసేందుకు తెగించాడు. అయితే అతనికి ఇంత ధైర్యం ఎక్కడిది…? కబ్జా వెనకాల ఉండి అంతా నడిపిస్తూ గ్రేటర్‌ వరంగల్‌లో కబ్జా కథలన్నింటికి సూత్రధారి అయిన ఎమ్మెల్యే తమ్ముడి అండ చూసుకునే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. వీరు కబ్జా చేసే దగ్గర బాధితులను బెదిరించేందుకు ఉపయోగించుకునే చిల్లర రౌడీమూకలను ‘నేటిధాత్రి’ కార్యాలయం పైకి ఎమ్మెల్యే తమ్ముడే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కబ్జాలు8 చేయడానికే ఈ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంటూ బలవంతంగా బాధితులను బెదిరించి దాడులతో లొంగదీసుకుని భూములను కబ్జా చేసేందుకు ఈ ముఠాను ఎమ్మెల్యే తమ్ముడు పెంచి పోషిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈ గ్యాంగ్‌ గతంలో అనేకమందిని బెదిరించి దాడులకు దిగి భూములను కబ్జా చేశారని విశ్వసనీయ సమాచారం. బాధితులను బెదిరించినట్లే ‘నేటిధాత్రి’ని బెదిరించాలని చూశౄరు.

బెదిరింపులకు లొంగుతామా…?

జనం పొట్టగొట్టి, పాపాలు మూటగట్టుకుని సంపదను పోగేయాలనుకుంటున్న వారి బెదిరింపులకు ‘నేటిధాత్రి’ ఎప్పుడు లొంగదని గుర్తుంచుకోవాలని సామాన్యులను బెదిరించి భూములు కబ్జా పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి కోట్లు కూడబెట్టి ప్రజాప్రతినిధిని అంటూ నిసిగ్గుగా చెప్పుకుంటూ తిరుగుతున్న గోముఖ వ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యయుతంగా అక్షరాలతో గట్టి సమాధానమే చెప్తాం.

Exit mobile version