ప్రభుత్వ పాఠశాలలో చదవండి.!

ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం. స్థానిక సెస్. ఆధ్వర్యంలో. ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాల సిరిసిల్ల అధ్యాపక బృందం. ప్రభుత్వ కళాశాలలో చేరండి మీ మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అనే.నినాదంతో సారంపల్లి బద్దెనపల్లి గ్రామాల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటింటికి వెళ్లి కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్మీడియట్ విద్యను చదవండి చదవడం వల్ల కలిగే లాభాలు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ సీతారాము శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ .నవీన్ రెడ్డి. జెబి ఉల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు

కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్.

కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ సన్మానం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కష్టపడి చదివే విద్యార్థులు ఎక్కడ చదివిన వారు తమ ప్రతిభను కనబరుస్తారని టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ర్ జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూప్ నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బిజీ సరయు 440/436 సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించడం పట్ల ఆయన అభినందించారు
నేడు ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా మారుమూల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే ఇది విద్యార్థిలకు పట్టిన ప్రతిభను బట్టి గుర్తించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి సరయు రాష్ట్ర స్థయిలో ర్యాంకు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులకు అభినందించి విద్యార్థినికి పూలమాల, శాలువాలతో సన్మానించీ ఇంకా ఉన్నతమైన ర్యాంకులు సాధించి జహీరాబాద్ నియోజకవర్గానికి తమ కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈరోజు ఏ రంగంలో చూసిన గ్రామీణ స్థాయి విద్యార్థులే రాణిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో ఏ కార్యక్రమం చేయాలనుకున్న దాన్ని విజయవంతంగా చేయగలుగుతారని అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉత్తమమైన విద్యాబధన చేయడంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాన్ కాల్ సుభాష్ గుప్తా, సీనియర్ నాయకులు రంజుల్ వైద్యనాథ్, శ్రీ కాంత్ రెడ్డి, మహమ్మద్ కుతుబుద్దీన్, మహమ్మద్ జహంగీర్ , రంగా అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, బిజీ సందీప్, బాల్ రెడ్డి, నిజాం తదితరులు పాల్గొన్నారు.

చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత

చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

భవిష్యత్తు బాగుండాలంటే మంచిగా చదువుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 15, చిన్న దర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను మరోసారి రివిజన్ చేయాలని చెప్పారు. మీరంతా ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని అక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్మీడియట్ తో పాటుగా ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోసం తన సొంత నిధులతో ఉచితంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం 200 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని, మీరు ఇంటర్మీడియట్ ప్రభుత్వం కళాశాలలో చేరితే మీ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయులు శైలజ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు లక్ష్మణ్ నాయక్, రమేష్ నాయక్, యాదయ్య యాదవ్, యం. నాగరాజు యాదవ్, రమేష్ యాదవ్, రవి నాయక్, యాదగిరి నాయక్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలి

టెన్త్ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలి.

జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉన్నత పాఠశాలను మంగళవారం రోజున జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ రకాల రికార్డులను పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి కష్టపడి ప్రణాళిక బద్ధంగా చదివి విద్యార్థులందరూ అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి జవాబులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా అతని మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆనందాన్ని వెలిబుచ్చాడు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో చిట్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ప్రేరణ కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కూచనపల్లి శ్రీనివాస్ బొమ్మ రాజమౌళి నీలిమ రెడ్డి సుజాత విజయలక్ష్మి కల్పన ఉస్మానాలి మౌనిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version