చోరవాణి అందజేత
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:
మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు తెలిపినారు.