ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన.

“జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడిని ఖండిస్తు పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం

వర్ధన్నపేట (నేటిదాత్రి):

 

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాం లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువుల పై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు. భారత దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మత సంస్థలు ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయని ఇప్పటికైనా వారు ఉగ్రవాదులకు సహాయం అందించడం ఆశ్రయం కల్పించడం మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో వారికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతుందని అదేవిధంగా పాకిస్తాన్ కి కూడా దీటైన సమాధానం ఇస్తుందని ఈట్ క జవాబు పత్తర్ సే దేంగే నినాదాన్ని చేసి చూపెడతారని మహేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని లేదంటే సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల నవీన్. పింగిలి రాజేందర్. రెడ్డి ఇటికాల ప్రశాంత్. చిర్రా కిరణ్. ఏబీవీపీ నాయకులు బెల్లం కార్తీక్. వడ్డే శ్రీకాంత్. గోరుకంటి శివ. బండారి రేవంత్. చిర్ర రాకేష్. వేము నూరి నాగరాజు. హరీష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version