కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి పాడే మోసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని దేవదాసు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి అతని అంతక్రియలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి దేవదాసు పాడే మోసినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిని దేవదాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటామని ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చోరవాణి అందజేత.!

చోరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:

మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు  తెలిపినారు.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

#ఎస్సై వి గోవర్ధన్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version