నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు
– రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం
చందుర్తి, నేటిధాత్రి 

 

heavy rain.

నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో నిన్న కురిసిన చేతికంది పంట దాదాపు 60% నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పసల్ బీమా యోజన స్కీం ని ఇక్కడ అమలు చేయకపోవడం బాధాకరమని, ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని, ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రం లోకి పంపించి పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 50,000వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్త సత్తయ్య అన్నారు, ఈ పంట నష్టం పర్యవేక్షణలో బిజెపి మండల అధ్యక్షులు మొకిలి విజేందర్, ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేషం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడపెళ్లి ముఖేష్ , మనోహర్ రెడ్డి , బొరగాయ తిరుపతి , లింగాల రాజన్న, నిరటి శేకర్, హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, సిరికొండ తిరుపతి, మట్కామ్ మల్లేశం, పాటి సుధాకర్, కూతురు మహేందర్ రెడ్డి, అల్లం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్.

అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్ లారీ పట్టివేత..!

– అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండలంలో శుక్రవారం నాడు హద్నూర్ ఎస్పై చల్ల రాజశేఖర్ సమాచారం మేరకు అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ఒక లారీ సీజ్ చేశారు హుస్సేల్లి చెక్పోస్ట్ దగ్గర హద్నూర్ ఎస్పై చల్లా రాజశేఖర్ తోటి సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతుండగా గణేష్ పూర్ గ్రామం నుండి ఒక ట్రాక్టర్( కె ఏ 38 టీ 5174 ) అశోక్ లేలాండ్ లారీ (ఏపీ 13 టీ 4188) లో అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తుండగా వాటిని పట్టుకొని వివరాలు అడగగా ఎర్ర రాయికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆ ట్రాక్టర్ లారీ లను స్వాధీన తీసుకొని న్యాల్కల్ మండల్ ఎమ్మార్వోకు తగు చర్య తీసుకోవాలని సీజ్ చేసిన ట్రాక్టర్ లారీని అధికారులకు అప్పగించారు. హద్నూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ తెలిపారు.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ,మునిసిపాలిటీ, జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల అడవులు నశించిపోయి భూభాగం మొత్తం సిమెంటు కాంక్రీట్ జంగల్ గా మారి భూమిలో నీరు ఇంకిపోక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. దీనికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణం వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని,అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రతిభ సంస్థ అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిపై ఏడు పాళ్లు నీళ్లు మూడు పాళ్ళు భూమి ఉన్నప్పటికీ 97.5 శాతం సముద్రాల్లోని పనికిరాని ఉప్పు నీరు ఉండగా రెండున్నర శాతం మాత్రమే మంచినీరు అని అలాగే కూడా ఒక్క శాతం మాత్రమే భూమి ఉపరితలంలో నదులు సరస్సులలో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ,మున్సిపాలిటీ మేనేజర్ సంపత్ కుమార్,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, జూనియర్ అసిస్టెంట్ శివ టెక్నికల్ ఆఫీసర్ నర్సింగరావు, ప్రతిభ సంస్థ వెంకటేశ్వర్లు, వినియోగదారుల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సారంగం, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

ప్రపంచ మంచినీటి దినోత్సవం సందర్బంగా తిమ్మంపేట,తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలవికాస కోఆర్డినేటర్ రజిత, దేవేంద్ర రమాదేవి, లక్ష్మిలు విద్యార్థులను ఉద్దెశించి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.భూగర్భ జలాలను డెవలప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలకు అవగహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

తిరుపతి నేటి ధాత్రి 

 

ఇటీవల అమరావతి లో శాసన సభ్యులు, మరియు శాసన మండలి సభ్యుల మానసిక ఉల్లాసం కొరకు జరిగిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా . ముఖ్యమంత్రి, మరియు శాసనసభ స్పీకర్ లు చే మన్ననలు పొందిన శాప్ చేర్మెన్ అనిమిని రవి నాయుడు ను శనివారం తిరుపతిలో ఎమ్మెలే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సన్మానించారు. క్రీడాల నిర్వహణలో రవి నాయుడు చూపిన చొరవ ను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, నాయకులు రాజారెడ్డి, నైనార్ మహేష్,, బాబ్జి,తదితరులు పాల్గొన్నారు..

సిసి రోడ్లకు భూమి పూజ…

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (NREG S). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి కోటి 75లక్షల రూపాయలు నిధులతో కేటాయించడంతోసిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సారం పెళ్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అధ్యక్షులు రాధా వినయ్ బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్ సందే వేని రాజు సిరిసిల్ల వంశీ బరికెల రాజు బిజెపి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

10 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,తహసీల్దారు వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్ సందర్శించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరియైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సమయస్ఫూర్తితో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు బాగా రాయాలని ఉన్నత ఫలితాలను మండల కేంద్రానికి తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నిజాంపేట, నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత

 

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ నగదును కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ఆ చిన్నారి పాప తల్లికి అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు చాపర్తి రాజమ్మ పాల్గొన్నారు.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*

నర్సంపేట,నేటిధాత్రి:

 

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి

చందుర్తి, నేటిధాత్రి:

 

ఈ రోజు అనగా శనివారం రోజున ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చందుర్తి మండలం ఎన్గల్ గ్రామములో ఉపాధి హామీ పనులో భాగంగా రోడ్డు పనులు చేసి మధ్యలో అన్నం తినేటప్పుడు పసుల లచ్చయ్య s/o రాజయ్య, అకస్మాత్తుగా పడిపపోవడం జరిగినది వెంటనే అంబేలెన్స్ కి కాల్ చేసి తెప్పించి ఏరియా ఆసుపత్రి వేములవాడ కు తీసుకువెళ్లడం జరిగినది అక్కడ డాక్టర్లు ఇసిజి తీసిన తర్వాత లచ్చయ్య చనిపోయాడని తెలియజేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.
– పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
– లుసిడా చేతివ్రాతలో ప్రభంజనం
– ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో జాతీయ మొదటి బహుమతి
– విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కృషి
– ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
– పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంత పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధనలు ప్రారంభించగా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆడియో వీడియో విజువలైజేషన్లో తరగతుల నిర్వహణతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి శిక్ష అవార్డు పొందామని తెలిపారు. అలాగే విద్యార్థి భవిష్యత్తుకు చక్కటి చేతి వ్రాత ఎంతో అవసరమని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో లుసిడ చేతి వ్రాత తరగతులు నిర్వహించామని, చేతివ్రత పోటీలలో నవత విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని అన్నారు. నవత విద్యార్థుల ప్రతిభతో అక్షర చేతివ్రాత ఫౌండేషన్ అధ్యక్షులు మీరజ్ అహ్మద్ ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రస్థాయి సూపర్ 10 లో మూడు బహుమతులు, స్టేట్ 50లో 12 బహుమతులతో పాటు వివిధ కేటగిరీలో మొత్తం 90 అవార్డులు సాధించి రాష్ట్రంలోనే మరే ఇతర పాఠశాల సాధించని ఘనత సాధించామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Anniversary Celebration

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా.

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సునీల్ కు సన్మానం .

చిట్యాల, నేటిధాత్రి ;

 

వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో హన్మకొండ అశోక హోటల్ లో జరిగిన కార్యక్రమంలో చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ ను సన్మానించడం జరిగింది,సునీల్ ఇప్పటికే ఎన్నో పాటలు రాస్తూ జిల్లాలో మంచి పేరు పొందుతున్నాడు సునీల్ సామాజిక కోణంలో గాని సినిమా పరంగా గాని అనేక అంశాల మీద గాని సందర్భాన్ని బట్టి రాసే కవి మ్యాదరి సునీల్ అందులో భాగంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి కవులు ఏమవుతారు అనే అంశం మీద సునీల్ తనదైన శైలిలో పాటను రాయడం జరిగింది అందుకు గాను ఆ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ సిరాజుద్దిన్ మరియు ముఖ్య అతిథి వరంగల్ సైబర్ క్రైమ్ కూజ విజయ్ కుమార్ ఆచార్య రవికుమార్ విప్పనపల్లి రవి కుమార్ మ రియు ప్రముఖుల చేతుల మీదుగా కవి రచయిత మ్యాదరి సునీల్ కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది జూకల్ గ్రామ ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ సంస్థ ఇదివరకు
ప్రజా కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ప్రోపేసర్ జయశంకర్ సర్ లాంటి మహనీయులకు సన్మానం చేసిన సంస్థ నాకు చేయడం పూర్వజన్మ సుకృతంఅని అన్నారు,

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం విజయవంతం.

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని గవర్నమెంట్ స్వతంత్ర సమరయోధులు షహిద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పురస్కరించుకొని సంవేదన 2లో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆక్టివిటీస్ (నిఫా), యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశ సమైక్యత సంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ” గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ” సాధించడం కోసం 1,50,000 యూనిట్ల బ్లడ్ ను కలెక్ట్ చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో 20 దేశాలలో,భారత్లో 28 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు,800 జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,బ్లడ్ క్యాంపు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ),కొత్తకొండ అరుణ్ కుమార్,ఎస్.కె ముస్తఫా ను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా 35 మంది రక్తదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకృష్ణ,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు),కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,విజయ, చందర్రావు,సాధు ప్రసాద్, కునూరు గణేష్,బండి ప్రశాంత్,ఆనంద్,నరేష్, రాజేష్,రమేష్,సాంబరాజు, సంతోష్,శ్రీకాంత్,ఆనంద్, రాకేష్,వినయ్ కుమార్, రాజేష్,రంజిత్,రాజు,అనిల్, నాగరాజు,సాధు రోహిత్, అమర్నాథ్,సంతోష్,మధుకర్, సంజయ్ కుమార్,శివ సాయి, మడి కొండ సదానందం,మడి కొండ షిండే,ప్రవీణ్,రంజిత్, బండి శ్రీధర్,అన్వేష్, కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్,ఊరటి రవికుమార్,సృజన,జ్యోతి, భావన,బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్),యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము,సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రోజా,ప్రమీల, ప్రశాంత్,సుమలత,రమేష్ విష్ణు లు పాల్గొన్నారు.

Blood donation

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత..

రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల చెరువుల నుండి , వర్షాలు పడితే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముందుగా సైడ్ డ్రెయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ ప్రజలు అన్నారు. ఒకవేళ ఇలా నిర్మించకుంటే మురికి నీరు వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే దుస్థితి ఉందన్నారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని కానీ సైడ్ డ్రయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సదర్ కాంట్రాక్టర్ ను అడిగితే తమకు కేవలం రోడ్డు నిర్మాణానికి మాత్రమే తనకు నిధులు వచ్చాయని సైట్ డ్రీమ్స్ కు ఎలాంటి నిధులు రాలేదని కాంట్రాక్టర్ తెలిపారని వార్డు ప్రజలు అన్నారు. సైడ్ డ్రాయింగ్స్ వేయకుండా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నుద్దీన్. ఎండి సల్మాన్. ఎస్.కె షకిల్. సయ్యద్ జియా. సయ్యద్ నాజర్ బాయ్. పల్లె పెంటయ్య. ఎరుకల పోచయ్య. పల్లె యాదగిరి. ఎరుకల మోహన్. శ్రీశైలం. పల్లె కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Municipal officials.

ప్రపంచ నీటి దినోత్సవం…

ప్రపంచ నీటి దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం రోజున బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాన్ని గ్రామంలో ర్యాలీతో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో నీటి వినియోగం గురించి విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన ఉపన్యాసంలో మొదటి బహుమతి రెండవ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ నుండి ఈ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తూ ప్రజల బాగోగులకు తోడ్పడింది.
జలమే జగతికిమూలఆధారం
జలమే ప్రగతికి ప్రణాధారం
జలమే మనకు ఆహారం
జలమే మనకు ఆరోగ్యం
జలాన్ని మనం రక్షిస్తే జలం మనం రక్షిస్తుంది.
నీరు కలుషితం కాకుండా నీటి స్వచ్ఛతను పెంచాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి ఉన్న నీటిని కాపాడాలి. త్రాగునీరు సాగునీరు బాధలన్నీ అరికట్టుటకు యువత ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లలిత, సురేందర్, బాలవికాస సూపర్వైజర్ పరుశురాం,జోనల్ డైరెక్టర్ జీడి తిరుపతి గౌడ్, దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బాలవికాస కమిటీ సభ్యులు మెట్టు వెంకట్, పోలు శ్రీనివాస్, దేవరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను సహించేది లేదు…

అక్రమ అరెస్టులను సహించేది లేదు బిఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టుల అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు త్వరలో బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
మధుసూదన్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్ అరెస్టయ్యారు

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి.

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణిత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతి పై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య,వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version