దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

నిజాంపేట నేటి ధాత్రి:

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ఈస్టర్.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ( ఈస్టర్) పండుగ

నేటి ధాత్రి/ భద్రాచలం

 

 

స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు

సిసి రోడ్లకు భూమి పూజ…

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (NREG S). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి కోటి 75లక్షల రూపాయలు నిధులతో కేటాయించడంతోసిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సారం పెళ్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అధ్యక్షులు రాధా వినయ్ బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్ సందే వేని రాజు సిరిసిల్ల వంశీ బరికెల రాజు బిజెపి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరుపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ ఏ ఎంసి డైరెక్టర్ కరీమ్, మాజీ ఎంపిటిసి మొకానపెల్లి దేవరాజు మంజుల, బాణాల లక్ష్మా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి,పోతుగంటి రంజిత్, చిగుర్ల మల్లేశం, చిగుర్ల నాగేష్,భూమాండ్ల కొమురయ్య, మ్యాదరి లచ్చయ్య, పుల్లూరి జెలందర్, భూమాండ్ల మధు,తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

దేవరకద్ర /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version