మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబేశ్వర ఆలయం లో వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి రావడం తో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన నాయకులు.
ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ.
ఆలయానికి బోర్ కావాలని అడగ్గానే మంత్రి స్పందించి వెంటనే మంజూరు చేశారు
రోడ్డు వేసి ఇబ్బందులు తొలగించారు.
ప్రజా సేవ కోసమే కాక కుటుంబం ఉంది.
మంత్రి పదవి వస్తె 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం అందుకే మొక్కలు చెల్లిస్తున్నాం
రెండు నెలల నుంచి చాలా మంది లీడర్లు వివేక్ వెంకటస్వామి పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు
ఆరోపణలు చేస్తున్న వారి మెదడు తలలో ఉందో మోకాళ్ళో లో ఉంది అర్థం కావడం లేదు
తెలంగాణ ఉద్యమం కోసం బుల్లెట్ గాయాలు తిన్నది కాక వెంకటస్వామి కాదా
అదే సిద్ధాంతాన్ని కొడుకు వివేక్ వెంకటస్వామి పాటిస్తూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విపిన నాయకులు వివేక్
జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు హుగ్గెల్లి మధు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఏ బాబా,యువ నాయకులు మూర్తుజా,సత్యం ముదిరాజ్ ,డా. నాగరాజ్,పర్వేజ్ పటేల్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
70 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి…
నేటి ధాత్రి మహబూబాబాద్:
గార్ల మండలం,మద్ది వంచ రెవెన్యూ పరిధిలో 116 మరియు 119 సర్వే నెంబర్లలో 900 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 సంవత్సరాల పైగా గిరిజన, గిరిజనేతర పేద రైతులు సేద్యం చేసుకొని జీవిస్తున్నారని,అట్టి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎం -ఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.మద్దివంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులు తాము దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం -ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ, మద్దివంచలో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నాయని,అనాదిగా పేద రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు వారికి పట్టాలివ్వలేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వాధికారుల వైపు నుండి జరిగిన వైఫల్యమేనని అన్నారు.116,119 సర్వే నెంబర్ల లోని భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి రుణ సౌకర్యాలు కానీ, రైతుబంధు రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు గాని అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మాన్యువల్ పహణీల ద్వారా రైతులు బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్నారని ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత పహణీ నకళ్ళు రాకపోవడంతో వారికి రుణమాఫీ కూడా జరగడం లేదని ఆయన అన్నారు.ప్రస్తుత రెవెన్యూ సదస్సులలో ఈభూముల పట్టాల కోసం రైతులు పెట్టుకొంటున్న దరఖాస్తులను కూడా అధికారులు తీసుకోవటం లేదని అన్నారు.116,119 సర్వే నెంబర్లలో సాగులో వున్న గిరిజన,గిరిజనేతర,పేద రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి గుగులోత్ సక్రు,ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి శివ్వారపు శ్రీధర్,పీడియస్యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, మద్దివంచ మాజీ సర్పంచ్ కుసిని బాబూరావు, పార్టీ డివిజన్ నాయకులు గౌని భద్రయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు ముండ్ల రంగారావు,గౌని మల్లేశ్,పెసా కమిటీ చైర్మన్ దారావత్ భావ్ సింగ్,రైతులు నల్లబెల్లి అప్పయ్య,గౌడి మంగయ్య, బాడిశ వెంకటేశ్వర్లు, మహ్మద్ అబ్రార్,పకీర్ మహ్మద్, చిటాకుల రాములు,బాడిశ జయమ్మ,నల్లబెల్లి చంద్రయ్య, దారవత్ రవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి
బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్
పరకాల నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్య అభివృద్ధికీ నోచుకోలేకపోయిందని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ నూ తీసుకొని సంవత్సరం గడిచిపోయిన కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లు ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేద మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ల మీదనే ఆధారపడి చదువుతున్నారని ఇప్పుడు అవి రిలీజ్ కాకపోవడంతో విద్యార్థులు పైచదువులు చదవలేని పరిస్థితిలు ఉన్నాయన్నారు.కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బడా కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యాలకు లక్షలలో ఫీజులు కట్టడం జరుగుతున్నదని ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు.
అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిధాత్రి;
పెబ్బేరు మండలం అయ్యవారి పల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకున్నద ని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పేదల కు వరమని అన్నారు గత బిఆర్ఎస్ పాలనలో మాట ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు_ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది???
మండలంలో మార్క్ చూపని ప్రతిపక్ష పా(ర్టీ)త్ర
ప్రజా సమస్యలపై పోరాటమే లేదు??
సామర్ధ్యం ఉంటే సంఖ్యా బలం ఎందుకు.??
గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ప్రాధాన్యత..
ఎగరటం మరిచిపోయిన పక్షిలా ప్రతిపక్ష పార్టీ???
పెద్ద సారు రెండు పడవల ప్రయాణం పార్టీకి చేటు తెస్తుందా??
నియోజకవర్గ ఇంచార్జి ఇప్పట్లో లేనట్లేనా??
పార్టీ క్యాడర్ పెంచాల్సింది పోయి పదవులకై కొట్లాట??.
నేటి ధాత్రి అయినవోలు :-
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్కగా ప్రజలకు చేరాలన్నా ప్రజల పక్షాన స్థానికంగా ఉన్న ప్రతిపక్షం బాధ్యతగా నిలిచి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేయడంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో కీలకమైంది.
అధికారపక్షం కన్నా ప్రతిపక్షమే ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా పోరాటాలు చేయవలసి ఉంటుంది.
ఐతే అయినవోలు మండలంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరుగుతుంది.
మండలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోలేకపోతోంది.
నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ రెక్కలు ఉన్న ఎగరడం మర్చిపోయిన పక్షిలా అచేతనావస్థలో ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న బిఆర్ఎస్ పార్టీని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో నిలిపారు.
అంతటి బాధ్యతాయుతమైన స్థానాన్ని మోస్తూ మండలంలో సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల తరఫున నిలబడి కొట్లాడితేనే కదా గత ఎన్నికల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందగలిగేది.
మండలంలో సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్న, అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్న, మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అర్హుల తరుపున మాట్లాడింది లేదు.
టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం సభలకు సమావేశాలకు మాత్రమే పార్టీ శ్రేణులు రోడ్లమీద కనిపిస్తరు అన్న అపవాదు స్థానికంగా వ్యక్తం అవుతుంది .
ఇది ఇలాగే కొనసాగితే సంక్షేమ పథకాలు ఇస్తామన్న సాకుతో అధికార పార్టీ గీసే పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో పని చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు సామాన్యులకు ఎంత భరోసా కల్పించాల్సి ఉంటుందో నాయకులు గ్రహించాలి.
అయితే బిఆర్ఎస్ అచేతన వ్యవస్థకు నేతలు చెబుతున్న కారణాలు నియోజకవర్గంలో తమకంటూ ఒక స్థాయి కలిగిన నాయకుడు లేకపోవడము కొంత ప్రతికూల అంశం.
బిఆర్ఎస్ పార్టీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్దన్నపేటలో కర్చిప్ వేసి పాలకుర్తిలో తన కార్యకలాపాలను కొనసాగించడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నా, అది స్థానిక నాయకత్వలేమిని సూచిస్తుంది.
సరైన సంఖ్య బలం లేక అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తుందా అన్నది మరో కారణం అంటే క్షేత్రస్థాయిలో మండలంలోని సుమారు 17 గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు.
మండల స్థాయిలో ఉన్న నాయకులు వారిని సమన్వయపరిచి ఏకతాటి మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనే అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పదవుల కోసం వర్గ పోరాటాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రజల పక్షాన నిలిచేందుకు సంఖ్యాబలం ముఖ్యం అనుకుంటే గత పదిహేను అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తమ పరిపాలన కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరుకున పెట్టింది లేదు.
సంక్షేమ పథకాల అమలులో ప్రశ్నిస్తూ, సంక్షేమ పథకాలలో కొంత వాటాను లబ్ధి పొందడంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు సఫలీకృతం అయ్యారు .
అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బిఆర్ఎస్ విఫలమవుతుందని చెప్పాలి.
అసలు పార్టీ నాయకులకు క్యాడర్ను పెంచాలన్న ఆసక్తి కంటే రాబోయే ఎన్నికల్లో పదవుల కోసం పోరాటం చేయడమే ఎక్కువ అవుతుందన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
మండలంలో పార్టీని విస్తృతపర్చకుండా కేవలం అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును తీసుకొస్తుందన్న బిఆర్ఎస్ నాయకుల భ్రమ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమవుతుందా?
లేదా మరోసారి గత ఎన్నికల మాదిరిగానే ప్రజానాడిని గుర్తించడంలో బొక్క బోర్లా పడతారా అన్నది వేచి చూడాల్సిన అంశం.
కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల వెంకన్న మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కట్టేబోయిన పిచ్చయ్య, చౌకాల బిక్షం, కట్టెబోయిన శ్రీను, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలం సీజన్ దృశ్య ఆతిసార వ్యాధి రాకుండా ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్ ను మండల వైద్యాధికారి అమరేందర్ రావు ఆదేశాను సారము హెచ్ డబ్ల్యూ సి ఇంచార్జ్ బొల్లం దీప్తి జింక్ కార్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది ముత్తారం మండలం మచ్చుపేటలో ఎచ్ డబ్ల్యూ సి సెంటర్ లో ఎమ్ ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి మాట్లాడుతూ ఓ ఆర్ ఎస్ అనేది నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇది ద్రవాలు మరియు లవణాలను తిరిగి నింపడం ద్వారా మితమైన నిర్జలీకరణం మరియు అతిసారం యొక్క చికిత్సకు సహాయపడుతుంది. జింక్ అనేది శరీరానికి అవసరమైన ఒక పోషకం, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఓ ఆర్ ఎస్ మరియు జింక్ రెండూ కలిసి అతిసారం యొక్క చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి, ముఖ్యంగా పిల్లల విషయంలో. ఓ ఆర్ ఎస్ (నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్):అతిసారం ద్వారా కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది, ఇది నిర్జలీకరణం మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. దీనిని నీటిలో కరిగించి త్రాగాలి. ద్రవ స్థాయిలను తిరిగి నింపడానికి క్రమం తప్పకుండా త్రాగాలి అని ఓ ఆర్ ఎస్ అతిసారం చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం, ఇది పిల్లలలో మరణాల సంఖ్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, అతిసారం యొక్క వ్యవధిని తగ్గిస్తుంది మరియు తీవ్రతను తగ్గిస్తుంది రోజుకు ఒకసారి జింక్ టాబ్లెట్ నీటిలో కరిగించి త్రాగాలని సూచించారు ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ సతీష్ లో సిబ్బంది పుష్పలత లత టీచర్ కళావతి లు పాల్గొన్నారు
వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ను తరిమి వేయాలి
ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు వివిధ రకాల కలర్ బ్రోచర్స్ తో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు జిల్లా సతీష్ యాదవ్ తెలిపారు.
వనపర్తి పట్టణం వనపర్తి పట్టణంలో ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వారు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రభుత్వ స్కూల్స్ చేర్పించే వారిని తరిమి కొట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు.
నూతనంగా చేరుతున్న విద్యార్థులను అభినందించారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురురాజును ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఈ మేరకు హె చ్ఎం గురురాజును అభినందించారు.
సతీష్ యాదవ్ వెంట అఖిలపక్ష నాయకులు గౌని కాడి యాదయ్య వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ రాజనగరం రామస్వామి శ్రీధర్ కృష్ణయ్య నాగరాజ్ రాఘవేందర్ తదితరులు ఉన్నారు.
వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ లో అంతస్తులు ఉన్నాయని లిఫ్టులు లేవని విద్యార్థులు నోటు బుక్కులు బుక్స్ కలుపుకొని దాదాపు8 కిలోల వరకు ఉండవచ్చని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులు మెట్ల ద్వారా పోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ డిఇఓ వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో తనిఖీలు నిర్వహించి లిఫ్ట్ లేని స్కూల్స్ ను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు బుక్కులు నోట్ బుక్స్ మెట్ల ద్వార పోవడం వల్ల విద్యార్థుల నడుములు కాళ్లు నొప్పులు ఏర్పడి అనారోగ్యాల గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం డీఈఓ కు టి ఏ లు డి ఏ లు సదుపాయం ఏర్పాటు చేసిందని వెంటనే తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అసౌకర్యాల గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.
◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ ఎరువులను ఎలా వాడాలని శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బహు చక్కగా ఉపయోగపడే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం శుభపరిణామం అని, కాలనుసారంగా ఎలాంటి పంటలను వేయాలో ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు తెలుసుకోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ గారు,బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్ర్తావేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ,సామెల్ గారు,కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ ఎంపీటీసీలు మలన్న పాటిల్, అశోక్, అనిల్ ,కోహిర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి గారు,శంశీర్, మునీర్ పటేల్ ,ముర్జల్,అశోక్,మోసిన్ ,వీరారెడ్డి , దయానంద పాటిల్, నరసింహా రెడ్డి,మరియు INTUC (F) రాజ్ కుమార్ కోహిర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.
అర్హత ఉండి కార్డులు పొందలేకపోతున్న భవన నిర్మాణ కార్మికులు..
కార్డులు రెన్యువల్ లేక ప్రభుత్వ సహాయం నష్టపోతున్న బాధితులు..
నేటి ధాత్రి స్పెషల్ స్టోరీ..
రామాయంపేట జూన్ 13 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట లేబర్ కార్యాలయం కేవలం చూడడానికి మాత్రమే కనబడుతుంది..
లేబర్ ఆఫీసర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు కార్మికులకు గురవుతున్నారు.
కొందరు భవన నిర్మాణ కార్మికులతో పాటు లేబర్ కార్డులు ఉన్నవారు రెన్యువల్ కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.
అలాగే కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు రోజుల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు.
కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకోవడంలో ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని చెప్పడానికి కూడా కార్యాలయం ఖాళీగా ఉంటుంది.
దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Construction Workers
అత్యవసర సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుండి అందే సహాయం కూడా కార్మికులకు కాదని పరిస్థితి నెలకొంది.
గతంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారికి నేటి వరకు ప్రభుత్వ సహాయం అందని పరిస్థితి దాపురించింది.
ఈ విషయంలో పూర్తిగా లేబర్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణమని కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా వచ్చి ఒకటి రెండు గంటలు ఉండి వెళ్లిపోవడం పట్ల కార్మికులతో పాటు ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.
కార్మిక సంఘం నాయకులు సైతం ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన వాటిని అమలు చేయడంలో స్థానిక లేబర్ ఆఫీసర్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది.
నిత్యం ప్రమాదకర పరిస్థితులు పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు అర్హత ఉన్న కార్డులు ఇవ్వకపోవడంతో పాటు రెన్యువల్ చేయకపోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుబాటులో ఉండాలి.
సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి..
లేబర్ కార్మికుల విషయంలో స్థానిక లేబర్ ఆఫీసర్ ఎప్పుడు అందుబాటులో ఉండటం లేదు.
దీంతో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పాత వారితో పాటు కొత్త లేబర్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Construction Workers
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి మంచి పథకాలకు అర్హులైన కార్మికులు దూరమవుతున్నారు.
ఈ విషయంలో త్వరలోనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనలు చేపడతాం.
ముత్తారం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకములు మరియు యూనిఫామ్స్ ఎంపీడీఓ సురేష్ మండల విద్యాధికారి హరిప్రసాద్ లు విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాదేవి, డిపిఎం నాగేశ్వరరావు, ఏపిఎం పద్మ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని..
రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు.
MLA G. Madhusudhan Reddy
అనంతరం గ్రామంలో వడ్డెర, యాదవ సంఘాల కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ పెండింగ్ పనులకు, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు తెలుగు బాలమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో శ్రీమతి మారపెల్లి పద్మ గారి పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు సర్క్యూట్ కావడంతో గేద అక్కడికక్కడే మరణించడం జరిగినది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది మారపల్లి పద్మ ధర్మారం
రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి : మండల వ్యవసాయ అధికారి వెంకటేశం. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం రైతు భరోసా పథకం లో భాగంగా ఝరాసంగం మండలంలోని రైతులందరూ వానకాలం 2025 సీజన్ కి సంబంధించిన తేదీ 05.06.2025. వరకు ఎవరికైతే నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయిన రైతులు రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తు చేసుకోవలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.. కావాల్సిన పత్రాలు: 1. రైతు భరోసా అప్లికేషన్ ఫారం 2. పట్టదార్ పాస్ పుస్తకం 3. ఆధార్ కార్డు జిరాక్స్ 4. బ్యాంకు అకౌంట్ జిరాక్స్ మీ యొక్క సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 20 వ తేదీ వరకు సమర్పించాలని తెల్పడం జరిగింది..
వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను పరిశీలించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం భూమి ఎక్కువ తక్కువ ఉన్న, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ లేకపోవడం, పట్టా పాస్ బుక్ లు లేకపోవడం, ఒక్కరి భూమి మరొకరి మీద పట్టాకు ఎక్కినటువంటి సర్వే నంబర్లను సరిచేసి పాత రికార్డు ప్రకారం పరిశీలించి సరి చేయడం సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో టి టిపి సి సి నెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, ఇల్లంతకుంట టెంపుల్ ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, యూత్ నాయకులు హరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, బండి మహేష్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం
మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి
మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న మొగులపల్లి నేటి ధాత్రి:
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే ఇదొక దురదృష్టకరమైన సంఘటనని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఏకంగా విమాన ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది, విమానం ఒక మెడికల్ కాలేజీ పై కూలడంతో ఎంతోమంది విద్యార్థులు క్షేత్రగాత్రులు అయ్యారని, మరికొంతమంది విద్యార్థులు మరణించారని, ఇలా ఇంతమంది ఒకే ప్రమాద దుర్ఘటనలో మరణించడం మనదేశంలో ఇదే ప్రథమమని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భారతీయులంతా ఒక్కటై బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని, ఇందుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని, ఎన్నో ఆశలతో విమానంలో బయలుదేరిన వారు తమకు తెలియకుండానే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మోటే ధర్మన్న వేడుకుంటున్నట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జరగబోయే ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని ఈ కార్యక్రమం ద్వారా న్యాయ సంబంధిత సమస్యలు తెలుపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
కరీంనగర్-తిరుపతి ట్రైన్ కు కృషి చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలుతెలిపిన ప్రణవ్ హుజురాబాద్ నేటిధాత్రి:
ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ సదుపాయాన్ని వారానికి రెండు సార్లు నడిపేలా అనేక మార్లు కేంద్రానికి విజ్ఞాపన చేసి,కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవి,స్ధానిక ఎంపీ బండి సంజయ్ కు హుజురాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పొన్నం జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేశారని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా మార్చి ఆధునీకరణ చేశారని అన్నారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ రైల్వే స్టేషన్ ల అభివృద్ధికి తగిన నిధులు తీసుకురావాలని మరిన్ని ట్రైన్ సర్వీసులు జమ్మికుంట లో ఆగేలా చూడాలని,అలాగే నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నీ త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
జూన్ మాసం వచ్చి 14 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వరుణుడు కరుణించక పోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందుతున్నారు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానే ప్రారం భించాలని దిశా నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవ డంతో విత్తనాలు విత్తుకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానా కాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేక పోయింది వరుణుడు మొఖం చాటేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్ల రేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురుచూస్తున్నారు ఈసారి ఎండతీవ్రత విపరీ తంగా ఉండడంతో మండలం లోని చెరువులు, కుంటలలో నీళ్లు లేక వెలవెలబోతు న్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎదురుచూస్తున్నాం..
మండలం రైతు ముసికే అశోక్
వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికి కొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరు స్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది
వర్షాలు వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి
మండల వ్యవసాయ అధికారి గంగాజమున
వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలి ముం దస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాo.రైతులు అప్రమత్తంగా ఉండాలి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.