దున్నపోతు హింస.. తక్షణ శాస్తి అనుభవించిన యువకులు…

మూగజీవి కదా అని హింసిస్తే ఇలాగే అవుతుంది.. ఈ దున్నపోతు ఏం చేసిందంటే..

కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పందేలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

మూగ జీవాలను హింసించడం పాపం, నేరం అని తెలిసినా కొందరు కావాలనే పదే పదే వాటిని టార్చర్ చేస్తుంటారు. ఇంకొందరు అవి బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతుంటారు. అయితే చేసిన కర్మ వెనువెంటనే వెంటాడుతుందనే విషయం వారికి ఆ సమయంలో తెలీదు. తీరా తగిన శాస్తి జరిగాక కానీ అసలు విషయం అర్థం కాదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతును హింసించిన యువకులకు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పోటీలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును (Buffalo) పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా బండిలో ముందు వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. చేతిలో కర్రలు పట్టుకుని దున్నపోతను కొడుతూనే ఉన్నారు.

ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి (Youths tortured buffalo with stick) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేరుగా వెళ్లాల్సిన ఎద్దు కాస్తా.. రోడ్డుకు అవతలి వైపునకు తిరుగుతుంది. ఈ క్రమంలో టైరు డివైడర్ ఎక్కడంతో బండి బోల్తా కొడుతుంది. దీంతో బండిపై కూర్చొన్న వారంతా ఎగిరి దూరంగా పడిపోతారు. కట్లు తెగిపోవడంతో దున్నపోతు అక్కడి నుంచి పారిపోతుంది. కింద పడ్డ యువకులు.. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ మూలుగుతుంటారు.

ఇలా దున్నపోతును హింసించబోయి.. చివరకు ఈ విధంగా శిక్ష అనుభవించిన వీరిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మూగజీవాలను ఇబ్బంది పెడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘తగిన శాస్తి జరిగింది.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

కరెంటు షాక్ తో గేదె మృతి.

కరెంటు షాక్ తో గేదె మృతి
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో శ్రీమతి మారపెల్లి పద్మ గారి పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు సర్క్యూట్ కావడంతో గేద అక్కడికక్కడే మరణించడం జరిగినది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది
మారపల్లి పద్మ ధర్మారం

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి..

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన కథనంప్రకారం, తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రీత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల ఉన్నటువంటి చేనులలో తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందిందని తెలిపారు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని బాధితుడు వేడుకుంటున్నారు.

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి.!

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన ఒంటెరు భాస్కర్ కు చెందిన పాడి గేదే బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఉదయం మేత కోసం బయటకు వెళ్లిన పాడి గేదె సాయంత్రం. ఇంటికి రాకపోవడంతో ఉదయం భాస్కర్ బయటకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెంది కనిపించింది. సుమారు 70 వేల ఈరోజు చేసే గేదె మృతి చెందడంతో రైతు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version