వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న.!

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ను తరిమి వేయాలి

 

ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

 

వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు వివిధ రకాల కలర్ బ్రోచర్స్ తో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు జిల్లా సతీష్ యాదవ్ తెలిపారు.

వనపర్తి పట్టణం వనపర్తి పట్టణంలో ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వారు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రభుత్వ స్కూల్స్ చేర్పించే వారిని తరిమి కొట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు.

నూతనంగా చేరుతున్న విద్యార్థులను అభినందించారు.

జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురురాజును ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.

ఈ మేరకు హె చ్ఎం గురురాజును అభినందించారు.

సతీష్ యాదవ్ వెంట అఖిలపక్ష నాయకులు గౌని కాడి యాదయ్య వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ రాజనగరం రామస్వామి శ్రీధర్ కృష్ణయ్య నాగరాజ్ రాఘవేందర్ తదితరులు ఉన్నారు.

వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ లో అంతస్తులు ఉన్నాయని లిఫ్టులు లేవని విద్యార్థులు నోటు బుక్కులు బుక్స్ కలుపుకొని దాదాపు8 కిలోల వరకు ఉండవచ్చని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులు మెట్ల ద్వారా పోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ డిఇఓ వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో తనిఖీలు నిర్వహించి లిఫ్ట్ లేని స్కూల్స్ ను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు బుక్కులు నోట్ బుక్స్ మెట్ల ద్వార పోవడం వల్ల విద్యార్థుల నడుములు కాళ్లు నొప్పులు ఏర్పడి అనారోగ్యాల గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం డీఈఓ కు టి ఏ లు డి ఏ లు సదుపాయం ఏర్పాటు చేసిందని వెంటనే తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అసౌకర్యాల గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

జమ్మికుంట పట్టణంలోని లోటస్పాండ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నిలువు దోపిడి

జమ్మికుంట: నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క యజమాన్యాన్ని అడగగా వారితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఇష్టానుసారంగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాలపై కేసు పెట్టానని పోలీసులతో విద్యార్థి సంఘాలను బెదిరిస్తూ రాజకీయ వ్యవస్థను స్కూల్ పై తీసుకొచ్చి స్కూల్ యొక్క వ్యవస్థా బ్రస్ట్ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కష్టార్జితం దోపిడీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు లోటస్పాండ్ స్కూల్ ముందు నిరసనకు దిగి ఆందోళన చేపట్టారు లోటస్పాండ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద స్కూల్ యొక్క ఫీజు హాస్టల్ యొక్క ఫీజుకి 35 వేలకి మాట్లాడుకోగా విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వద్ద 46 వేల రూపాయలు వసూలు చేయడం పట్ల నిరసిస్తూ ధర్నా చేపట్టారు దీనిపై లోటస్పాండ్ ఒక యజమాన్యంకి పోలీసులకు 100 డయల్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాలని అదుపులోకి తీసుకున్నారు తదనానంతరం యాజమాన్యాన్ని పోలీస్ స్టేషన్కు పిలిపించగా యజమాన్యం విద్యార్థి సంఘాలకు క్షమాపణ కోరారు విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని మళ్లీ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఏదైతే విద్యార్థి తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు తీసుకున్నారు 10000 రూపాయలు విద్యార్థి యొక్క తండ్రికి అప్పజెప్పడం జరిగింది విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల తల్లిదండ్రులకు దక్కుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version