సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి! ఎందులో అంటే
ఎలాంటి హాడావుడి లేకుండా, ప్రచార ఆర్బాటాలు లేకుండా రూపొంది గత నెల మే9న థియేటర్లలోకి వచ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా బ్లైండ్ స్పాట్.
ఎలాంటి హాడావుడి లేకుండా, ప్రచార ఆర్బాటాలు లేకుండా రూపొంది గత నెల మే9న థియేటర్లలోకి వచ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా బ్లైండ్ స్పాట్ (Blind Spot).
నవీన్ చంద్ర (Naveen Chandra), అలీ రెజా (Ali Reza), రాశి సింగ్ (Rashi Singh), రవి వర్మ (Ravi Varma), గాయత్రి భార్గవి కీలక పాత్రలు పోషించారు.
మూవీ రిలీజ్ అయ్యాక పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎలాంటి ప్రచారం లేక పోవడంతో జనాలకు రీచ్ కాలేక పోయింది.
ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి ఆశ్చర్య పరిచింది.
రాకేష్ వర్మ (Rakesh Varma) ఈ సినిమాతో దర్శక, రచయితగా ఎంట్రీ ఇచ్చాడు.
యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది.
సినిమా పుస్తకాలు
Blind Spot
జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు వీరికి ఓ చిన్న పాప ఉంటుంది.
వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పని మనిషిగా వర్క్ చేస్తుంటుంది.
అయితే ఒక రోజు రాత్రి దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపిస్తుంది.
సమాచారం అందుకున్న పొలీసాఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) కేసు టేకప్ చేసి ఇంటి కొచ్చి అంతా పరిశీలించి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని డిసైడ్ అవుతాడు.
ఈ నేపథ్యంలో విక్రమ్ పరిశోధన స్టార్ట్ చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరినీ ఇంటరాగేట్ చేస్తూ వెళుతుంటాడు.
ఈ సందర్భంగా వారు చెప్పే అన్సర్ సైతం అనుమానాస్పదంగా గోచరిస్తుంటాయి.
వాళ్లు చెప్పే జవాబులు నిజంగా అనిపించినా అందులో ఎక్కడో, ఎవరో అబద్ధం చెబుతున్నారని అనిపిస్తుంటుంది.
ప్రతిసారీ ఓ కొత్త విషయం తెలుసుకుంటాడు.
ఈ నేపథ్యంలో విక్రమ్ అసలు హంతకుడిని పట్టుకోగలిగాడా, లేదా అసలు దివ్య ఎలా చనిపోయిందనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది.
కాగా.. ఇది రెగ్యులర్గా వచ్చే మర్టర్ థ్రిల్లర్ అయినప్పటికీ చూసే వారికి ప్రతి క్షణం ఉత్కంఠను కలుగ జేస్తూ తర్వాత ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
ఒక హత్య పది మంది అనుమానితులు వీరిలో అసలు హంతకుడిని కనిపెట్టే క్రమంలో అంతా అనుమానితులుగా అనిపించడం, పోలీసులు వ్యవహరించే విధానం బాగా చూయించారు.
సినిమా ఆరంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే డైరెక్ట్ కథ స్టార్టవడం చివరి వరకు హంతకుడెవరనే పాయింట్తో సస్పెన్స్ను మెయింటెన్ ఏశారు.
Blind Spot
చివరిలో వచ్చే ట్విస్టు లు సైతం అదిరిపోయేలా ఉంటాయి.
రవి వర్మ, పని మనిషి పాత్రలు కీ రోల్ పోషించాయి.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఎక్కువగా మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లైండ్ స్పాట్ (Blind Spot) చిత్రాన్ని మిస్ చేయకుండా ఫ్యామిలీతో చూసేయవచ్చు.
చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలి.
మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ.
రాష్ట్ర పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా నేటిధాత్రి:
జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ, మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని, రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని గిరిజన భవన్ లో యు ఎస్ టి, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన కుటుంబాలకు 25 తెప్పలు చేపలు పట్టే వలలు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్యకారులకు నిర్మాణ్ సంస్థ వారు తెప్పలు , వలలు అందించడం చాలా అభినందిందనీయం అని నిర్మాణ్ సంస్థ వారికి అభినందించారు.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్.ఎం కథానాయిక. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో కల్యాణ్ మంతిన…
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్.ఎం కథానాయిక. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు, బీవీ వర్క్స్తో కలసి సమర్పిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ‘మిత్రమండలి’ టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బన్నీ వాసు సమర్పిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్ చాలా బావుంది. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘వినోదాత్మకంగా, ఉల్లాసంగా సాగే నలుగురు స్నేహితుల కథ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి’ అన్నారు. ‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెంట్తో వస్తున్నాం’ అని విజయేందర్ ఎస్. అన్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.
రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం. రేపాక గ్రామంలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు చెక్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జూన్ 13న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు 10 అంశాల పైన అవగాహన కల్పించారు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోని యూరియాను ఉపయోగించడం పచ్చి రొట్ట ఎరువుల వర్మి కంపోస్ట్ పశువుల ఎరువుల వాడడం భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటకు. ఎరువులు అందించడం రసాయన ఆధారిత పురుగుమందులను అవసరం మీదకు మాత్రమే ఉపయోగించడం మరియు పంటల్లో పద్ధతులు పాటించడం పంట వైభవ సమయంలో. పంట బీమా పొందడానికి మరియు నష్టపరిహారం కోసం పంట కోసం కొనుగోలు చేసిన వివిధ విత్తనాల రసాయనిక ఎరువుల మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం సాగునీటి యజమాన్యం. బిందు మరియు తుంపర్ సేద్యం మల్చింగ్ పద్ధతుల సుస్థిరమైన వ్యవసాయం కోసం పంట మార్పిడి మరియు పంట వైవిధ్యాకరణ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం. పి జె టి ఏ యు. యూట్యూబ్ ఛానల్ మరియు బీజేపీ యూ వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడం వర్మీ కంపోస్టు తయారీ మరియు. పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన. పంట బీమా పథకాలు వెదురు మొక్కలు మరియు. ఆయిల్ పామ్ సాగు. అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి సందేహాలను నివృతం చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల అసోసియేట్ డిఎన్ డాక్టర్ సునీత దేవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్. డాక్టర్ జె చిరంజీవి. మండల వ్యవసాయ అధికారి కే సంజీవ్. ఉద్యాన శాఖ అధికారి వి గోవర్ధన్. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్. గౌతమి లక్ష్మణ్. వ్యవసాయ కోర్స్. అభ్యసిస్తున్న. విద్యార్థులు ఏ సాత్విక. ఎస్ బాలకృష్ణ. రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి చెప్పారు…
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.
బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్.
మిర్యాలగూడ నేటిధాత్రి:
మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ నీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ భవన్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలు& కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అడ్మిషన్ ఫీజు పేరిట 5000, రూపాయలు అత్యధిక ఫీజు వసూళ్లు చేస్తున్న కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు ప్రైవేటు పాఠశాలలో పిల్లల్ని చదివించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కత్తి మీద స్వాముల మారిందని ఆయన అన్నారు పాఠశాలలలోని లక్షల రూపాయల ఫీజులు ఎలా కట్టాలో అని ఆందోళనకరంగా ఉన్నారు ప్రైవేటు పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు తొత్తుగా మారి విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక శోభకు గురిచేస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు నిర్ణయించిన ఫీజు కే విద్యార్థులను చదివించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మిర్యాలగూడలో విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా అరికట్టవలసినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆయన హెచ్చరించారు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లో చదువుకునే దుస్థితి లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ప్రైవేటు పాఠశాలలపై ఒక కమిటీని నిర్ణయించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఫీజుల దోపిడి నీ అరికట్టక పోతే మాత్రం అన్ని ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాలతో ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్, సిద్ధం రాజు, నాయిని భాస్కర్, అంజి గౌడ్, గంగాధర్, ఉపేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం…
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్ పిక్చర్స్, ఎ.ఎ. ఆర్ట్స్ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.
గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్ 33-వర్కింగ్ టైటిల్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు…
గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్ 33-వర్కింగ్ టైటిల్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్ను, గ్లింప్స్ను విడుదల చేసింది. గోపీచంద్ విభిన్నమైన లుక్లో కనిపించారు. యుద్ధభూమిలో వీరతిలకం ధరించిన యోధుడిగా ఆయన కనిపించారు. ఏడో శతాబ్దానికి చెందిన ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ఓ పాయింట్తో సంకల్ప్రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్ తెలిపింది.
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారినీ వాసంతి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి టెంకాయ కొట్టి అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య పండితులు మంత్రాలు చదవగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.డి ఈ ఓ విద్యార్థులను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయడం జరిగింది.అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,భీముడి లక్ష్మి,తాళ్లపల్లి మంజుల, శీలం సరిత విద్యార్థులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డిఇఓ అక్షరం అంటే నశించనీదని,అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వీటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం అని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్య లభిస్తుందని,మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేపించాలని, చర్లపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని డిఇఓ మేడం అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కున్సోతు హనుమంతరావు సిఎంఓ బద్దం బాల్ రెడ్డి,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమా,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజ్ కుమార్,మేకల సత్యపాల్,ఐ ఆర్ టి రమేష్,అంగన్వాడీ టీచర్స్ బీమడి లక్ష్మీ, నందిపాటి సంధ్యా,తాళ్లపల్లి మంజుల,శీలం సరిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
కర్నూల్ రోడ్డు లో మురికి కాలువ ని oడి రోడ్డుపై మురికి నీరు
రోడ్డు పై నడిచే ప్రజలకు దుర్వసాన
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు సంగం ఫంక్షన్ హాల్ ఎదురుగా మెయిన్ రోడ్డు మురికి కాలువ నిండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుండడం వల్ల రోడ్డుపై నడిచి వెళ్లే ప్రజలు వాహనదారులు దుర్వాసనకు ఇబ్బందులకు గురవుతున్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నది వర్షాకాలం ప్రారంభమైనది మురుగనీరు జామ్ కావడం వల్ల దోమలు ఈగలు పురుగులు కాలు వ పై వాలి ప్రజలకు కుట్టినచో మలేరియా డెంగ్యూ ఇతర వ్యాధులు ప్రబలించి రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని ప్రజలంటున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పై మురికి నీరు రోడ్డు పై ప్రవహించకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఒక ప్రకటనలో కోరారు
కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్.
మరిపెడ కురవి నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని జుజ్జూర్ తండాలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద వాడికి సొంత ఇంటి నిర్మాణం అని ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు,జిల్లాలో జూన్ పదవ తారీకు వరకు ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బులు వెంటనే ఇస్తామన్నారు , గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి పేదవారికి సొంత ఇల్లు నిర్మాణ పథకం ప్రవేశ పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రిచ్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్, జుజుర్ తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, ఉపాధ్యక్షుడు ధరావత్ మోతిలాల్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు డాక్టర్ ధరావత్ వీరన్న నాయక్, పూల్ సింగ్ నాయక్ , నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమకృత కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.రాబోయే అంతర్జాతీయ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు, యువకులు,వృద్ధులు,జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత,రాజన్న సిరిసిల్ల జిల్లా డి.పి.ఎం తిరుపతి యోగ శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా..
గోదారి జలాలపై తెలంగాణ నీటివాటా కోల్పోయే ప్రమాదం.
చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ రాష్ట్ర నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉన్నదా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడిపై రైతులు,ప్రజలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.తన గురువు చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాజెక్టులకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కాలేశ్వరంపై అవినీతి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వినియోగించకుండా రైతుల పొలాలను ఎండబెడుతూ ఆంధ్రాలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు రామప్ప పాకాల రంగాయా చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను ఎండబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వలన గోదావరి జలాలపై తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందని, నిన్న తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను గోష్ కమిషన్ ముందు పిలిపించి రాక్షసానందం పొందిన రేవంత్ సర్కార్ కు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న నేపంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.నేడు గ్రామాలలో,పట్టణాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.ఈ సమావేశంలో రాయుడి రవీందర్ రెడ్డి,నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,వేములపల్లి ప్రకాష్ రావు,సుకినే రాజేశ్వర్ రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి, గందె శ్రీనివాస్ గుప్త, చెట్టుపెళ్లి మురళిదర్ రావు, కామిశెట్టి ప్రశాంత్, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వాలి.కార్యకర్తలకు కాదు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ మాట్లాడుతూగుంట భూమి కూడా లేని పేదల పేర్లు తొలగించి భూస్వామిని పేరు పెట్టించడం జరిగిందిఅని ఇది ప్రజల ప్రభుత్వం అని గొప్పలు చెప్పి కార్యకర్తల ప్రభుత్వంగా ఇందిరమ్మ ఇల్లు కార్యకర్తలకు,కుటుంబ సంబంధితులకు మాత్రమే ఇల్లు ఇప్పిస్తున్నారు అని ఇది సమంజసం కాదని ఇలా చేస్తే ఒంటెద్దు పోకడ గా వెళ్తే ప్రజలు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని అర్హులందరికీ న్యాయం చేయాలని అన్నారు మాజీ జెడ్పి టిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ. ఇప్పటికి కైనా న్యాయ విచారణ చేసి అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని లేని యెడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని హెచ్చరించారు.నిరుపేదల పక్షాన పోరాటం చేయడానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటది అని తెలిపారు. అర్హులు కి ఇల్లు ఇవ్వకుండా నాయకులకు ఇల్లు ఇస్తూ ఇష్టరీతినా వ్యవహరిస్తే తప్పకుండ ప్రజల నుండి శిక్ష అనుభవిస్తారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్,బి ఆర్ ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు నవీన్, బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు ఎరుగొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, జిల్లా మండల నాయకులు దామెర రాజు, వీరాస్వామి, పెరుమాండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం..
మందమర్రి నేటి ధాత్రి
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. అనే నినాదంతో కూడిన కరపత్రాల ద్వారా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పై సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పట్టణ కూడలిలో అవగాహన కల్పించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు. బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలన్నారు..వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయన్నారు. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదని, బాలలను కార్మికులుగా మార్చిన వారిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, వారి సంకెళ్ళను తెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు, సైకాలజిస్ట్ డా. అంబాల సమ్మయ్య, సభ్యులు రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
గుండెపుడి, రాంపురం పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాసం.
మరిపెడ నేటిధాత్రి:
విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్య క్రమాన్ని 2025 – 26 విద్యా సంవత్సరానికి ఈ నెల జూన్ 6 – 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్, గుండెపుడి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామ చేతుల మీదుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు, పేద మధ్య తరగతి పిల్లలకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు,సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించరు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు,అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ, ఉపాధ్యాయులు నివేదిత, దోమల లింగన్న గౌడ్,మురళి, సునీత,మాధవి, రాంపురం పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి గణేష్, గ్రామ పెద్దలు, బందు పరశురాములు, బందు వీరన్న, ఎడ్ల ఉపేందర్, ఆశా వర్కర్లు బందు మంజుల, మమత, చింతపల్లి ఉమా,తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.