రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం
◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
◆ డా౹౹ఎ.చంద్రశేఖర్ ,మాజీమంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ ఎరువులను ఎలా వాడాలని శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బహు చక్కగా ఉపయోగపడే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం శుభపరిణామం అని, కాలనుసారంగా ఎలాంటి పంటలను వేయాలో ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు తెలుసుకోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ గారు,బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్ర్తావేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ,సామెల్ గారు,కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ ఎంపీటీసీలు మలన్న పాటిల్, అశోక్, అనిల్ ,కోహిర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి గారు,శంశీర్, మునీర్ పటేల్ ,ముర్జల్,అశోక్,మోసిన్ ,వీరారెడ్డి , దయానంద పాటిల్, నరసింహా రెడ్డి,మరియు INTUC (F) రాజ్ కుమార్ కోహిర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.