ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జరగబోయే
ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని ఈ కార్యక్రమం ద్వారా న్యాయ సంబంధిత సమస్యలు తెలుపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

రామయంపేట మార్చి ఒకటి నేటి ధాత్రి (మెదక్)

మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు శనివారం రామాయంపేటలో మాదిగ అమరవీరు సంస్మరణ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరులను జాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాతూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ, నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు బొర్ర అనిల్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటపురం బాబు, రత్నం,మురళి, జాన్,
కర్రె రమేష్, బొర్ర సంజీవ్, స్వామి,రాము తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version