ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే.

OTT: ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి.

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు పేరెన్నిక‌గ‌న్న అనేక డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే అయా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి.

సినిమా థియేటర్స్

అయితే.. చాలా మందికి వారి వారి భాష‌ల‌లో ఏ కంటెంట్ వ‌చ్చింద‌నే మీమాంస, కుతుహాలం ఉంటుంది. అలాంటి వారంద‌రి కోసం వారి లాంగ్వేజెస్‌లో వ‌చ్చిన కంటెంటు ఏంటో ఇక్క‌డ మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన భాష‌లో, మీకు న‌చ్చిన సినిమానో, సిరీస్‌ను చూసి ఆస్వాదించండి.

 

Malayalam

Nadikar (Mal, Tel,Tam, Kan, Hin) Saina Play

ManasaVacha (Malayalam) Manorama Max

Eth Nerathanavo (Malayalam) Manorama Max

 

Kannada

Timmana Mottegalu (Kannada) PrimeVideo

Hebbuli Cut (Kannada) Sunnxt

 

Hindi

Salakaar (Hin, Telu, Tam, Mal, Kan) [Series] JioHotstar

Bindiya Ke Bahubali Season 1 (Hindi) MxPlayer

Marathi

Jarann (Marathi)

 

Tamil

Maaman (Tamil) Zee5

Trending (Tamil) Sunnxt

ParanthuPo (Tam, Tel, Mal, Kan, Hin) JioHotstar

Oho Enthan Baby (Tam, Tel, Mal, Kan, Hin) Netflix

 

Telugu

Badmashulu (Telugu) PrimeVideo, ETv Win

Mothevari LoveStory (Telugu) [Series] Zee5

Mayasabha (Tel, Tam, Mal, Kan, Hin) [Series] Sony Liv

Arabia Kadali (Tel, Tam, Mal, Kan, Hin) [Series] PrimeVideo

 

English

 

Netflix

Lisa Frankenstein (English)

Stolen : Heist of the Century (English)

SEC Football: Any Given Saturday (English) [Series]

Wednesday: Season 2 Part 1 (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Blood Brothers: Bara Naga (Malaysian) Netflix

 

Prime Video

Sorry Baby (English) Rent

The Occupant (English) Rent

The Pickup (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Abrahams Boys: A Dracula Story (English) Rent

Jurassic World Rebirth   (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Rent

 

Jio Hotstar

Mickey17 (English)

Love Hurts (English, Hindi)

The Yogurt Shop Murders (English) [Documentry]

 

Pretty Thing (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Lions Gate Play

Harvest (English) MUBI

Freaky Tales (English) HBO Max

Bob Trevino Likes It (English) Hulu

సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా..

సైయారా.. వెనుక ఇంత క‌థ‌ న‌డిచిందా

స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’

కొన్నిసార్లు బాక్సాఫీస్‌ మేజిక్‌ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా… నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’ (Saiyaara). కుర్ర హీరోయిన్‌ అనీత్‌ పడ్డా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్‌’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్‌ బ్యూటీ విశేషాలివి.

 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో… ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 22 ఏళ్ల అనీత్‌ పడ్డా (Aneet Padda)కు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. స్కూలింగ్‌ పూర్తయ్యాక ఢిల్లీకి వెళ్లిన అనీత్‌.. అక్కడి జీసస్‌ మేరీ కాలేజీలో డిగ్రీ (సోషియాలజీలో) పూర్తిచేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. ‘సైయారా’ సినిమా చిత్రీకరణ సమయంలోనూ షూటింగ్‌కి హాజరవుతూనే, డిగ్రీ పరీక్షలు రాసింది. ‘ఆమె కమిట్‌మెంట్‌, అంకితభావం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు డైరెక్టర్‌ మోహిత్‌ సూరి (Mohit Suri). అనీత్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేయడానికి డైరెక్టర్‌ మోహిత్‌ సూరికి సుమారు 5 నెలలు సమయం పట్టిందట. ముఖం, శరీరానికి ఎలాంటి కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకోని 20-22 ఏళ్ల యువతి ఆ పాత్రకు కావాలని మోహిత్‌ పట్టుబట్టారట.

 

ఈ క్రమంలో వందలాది మందిని ఆడిషన్‌ చేశారు. అనీత్‌ తన ఆడిషన్‌ వీడియోని మొదట మొబైల్‌లో పంపిందట. అది నచ్చడంతో నేరుగా వచ్చి ఆడిషన్‌ ఇవ్వమన్నారట. తీరా ఆడిషన్‌ ఇచ్చాక, ఆమె నటన బాగాలేదని డైరెక్టర్‌ దాదాపుగా రిజెక్ట్‌ చేయాలనుకున్నాడు. కానీ అహాన్‌ పాండే (Ahaan Panday) (‘సైయారా’ హీరో) డైరెక్టర్‌ని ఒప్పించి, ఆమెకు మరో అవకాశం ఇవ్వమని కోరాడట. కట్‌చేస్తే.. డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యింది. అనీత్‌ ఆడిషన్‌కు వేసుకెళ్లిన డ్రెస్‌ లుక్‌నే సినిమాలో పెట్టారు.సినిమాల్లోకి రావాలని చిన్నతనం నుంచే కలలు కనేదట. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకుంది. మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి నెస్‌ కెఫే, క్యాడ్‌బరీ, మ్యాగీ, పేటిఎం, అమెజాన్‌ లాంటి వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది.

 

మూడేళ్ల క్రితం రూపొందిన ‘క్యాడ్‌బరీ’ యాడ్‌తో బాగా పాపులరైంది. 2022లో కాజోల్‌ ప్రధానపాత్రగా వచ్చిన ‘సలామ్‌ వెంకీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. బోర్డింగ్‌ స్కూల్‌ డ్రామాగా సాగే ఈ సిరీస్‌లో ‘రూహీ’ అనే పాత్రలో రెబల్‌ గాళ్‌గా కనిపించి, అందరినీ ఆకట్టుకుంది అనీత్‌. తాజాగా ‘సైయారా’ సక్సెస్‌ కావడంతో ఆ యాడ్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనీత్‌కు ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆ సమయంలో గిటారు వాయిస్తూ, తనలోని గాయనిని బయటకు తెస్తుంది. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ను తెగ ఇష్టపడుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ అనీత్‌ దిట్టే. మంచి సింగర్‌ కూడా. గతేడాది ‘బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై’ కోసం ‘మాసూమ్‌’ పాటను తనే రాసి, తనే కంపోజ్‌ చేసి పాడింది.

 

ఎప్పటికీ మర్చిపోలేని తన చిన్ననాటి జ్ఞాపకం గురించి ప్రస్తావిస్తూ… స్కూల్‌లో జరిగిన ఒక నాటకం కోసం తన కనుబొమలను, కనురెప్పలను కత్తిరించుకున్నట్లు తెలిపింది. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ సాహసంగానే అనిపిస్తుందట. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ సుందరి తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ పంచుకుంటుంది. ‘సైయారా’ సినిమాకు ముందు ఈ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేల మంది ఫాలో అయితే.. సినిమా విడుదలైన తర్వాత ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. వారిలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం.

సినిమా హిట్

 

కివీలు కుమ్మేశారు…

కివీలు కుమ్మేశారు

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో…

అరంగేట్ర పేసర్‌ జకారికి ఐదు వికెట్లు ఫ 2-0తో క్లీన్‌స్వీ్‌ప

బులవాయో: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీ్‌సను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అంతేకాకుండా ఓవరాల్‌ టెస్టు చరిత్రలోనూ ఇది మూడో భారీ విజయం కావడం విశేషం. కివీస్‌ జట్టులో 23 ఏళ్ల అరంగేట్ర పేసర్‌ జకారి ఫౌల్కెస్‌ సంచలన ప్రదర్శనతో (5/37) అబ్బురపరిచాడు. ఫలితంగా జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే కుప్పకూలింది. నిక్‌ వెల్చ్‌ (47 నాటౌట్‌), కెప్టెన్‌ ఇర్విన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెన్రీ, డఫీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కాన్వే, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హెన్రీ నిలిచారు.

 

తొలి సెషన్‌లోనే..: ఓవర్‌నైట్‌ స్కోరు 601/3 పరుగుల వద్దే కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో ఆ జట్టుకు 476 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక శనివారం ఉదయమే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే తొలి సెషన్‌లోనే కుప్పకూలింది. పేసర్ల ధాటికి కేవలం 28.1 ఓవర్లే ఆడింది. ఓపెనర్‌ బెన్నెట్‌ను ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే పేసర్‌ హెన్రీ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత డఫీ, ఫిషర్‌ల ధాటికి జింబాబ్వే 49/4 స్కోరుతో నిలిచింది. ఇక 16వ ఓవర్‌ నుంచి వరుస విరామాల్లో ఐదు వికెట్లను పడగొట్టిన పేసర్‌ జకారి మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్ల భరతం పట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌: 125

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/3 డిక్లేర్‌;

జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌: 28.1 ఓవర్లలో 117 ఆలౌట్‌ (వెల్చ్‌ 47 నాటౌట్‌, ఇర్విన్‌ 17; ఫౌల్కెస్‌ 5/37, హెన్రీ 2/16, డఫీ 2/28).

టెస్టు క్రికెట్‌లో భారీ విజయాలు

ఇన్నింగ్స్‌ 579 రన్స్‌తో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌

ఇన్నింగ్స్‌ 360 రన్స్‌తో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా

ఇన్నింగ్స్‌ 359 రన్స్‌తో జింబాబ్వేపై న్యూజిలాండ్‌

ఇన్నింగ్స్‌ 336 రన్స్‌తో భారత్‌పై వెస్టిండీస్‌

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం..

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అంబేద్కర్ సెంటర్లోయూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చరణ్, మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, మహబూబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ మిట్ట గడుపుల యాకూబ్, మండల యూత్ ఉపాధ్యక్షులు సమీర్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి కాసు సతీష్ , మండల యువజన నాయకులు కొండేటి కళాధర్, హరికృష్ణ, అభి, దినేష్, సందీప్, యశ్వంత్, తదితరులు పాల్గొనడం జరిగింది.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొన్న..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T142219.426.wav?_=1

కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం అంత్యక్రియలో పాల్గొని ఆదిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంతిమయాత్రలో ఆదిరెడ్డి పాడె ను మోశారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయిందని, ఆదిరెడ్డి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు.

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

పరకాల నేటిధాత్రి
సోదర సోదరీమణుల ప్రేమను ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ.ఈ సందర్భంగా పరకాల పట్టణ మరియు మండల ప్రజలు తమ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు రాఖీ అని చెప్పవచ్చును పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.పట్టణంలోని ఓ కాలనిలోని మామిడి అనన్య శ్రీ అనే చిన్నారి తన అన్న ఉద్భవ్ కుమార్ కు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా,రక్షణగా ఉండాలని,అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమిగా చెప్పవచ్చు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-2.wav?_=2

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శనివారం రోజున అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంటిలో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్నారు అలాగే అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మండల వ్యాప్తంగా ఆడపడుచులు శనివారం రోజున రాఖీ పర్వదినాన్ని సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని జరుపుకుంటున్నారు, రాఖీ పర్వదినాన్ని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు, చెబుతుంటారు. అర్చకుల పంచాంగం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని ఆ సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు తెలిపారు. సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత హారతి ఇచ్చి దీవిస్తారు, హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు మధ్య ప్రేమగా గుర్తుగా పేరుగాంచింది, రాఖీ కట్టిన తర్వాత తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని అలాగే సోదరీమణులు తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి స్వీటు తినిపించి హారతిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక గా బహుమతి ఇచ్చి జీవితాంతం కాపాడుతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు, ఈ రాఖీ పండుగ వేడుకలు మండలంలోని ఆడపడుచులు ప్రభుత్వ కార్యాలయాలలో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T135807.613.wav?_=3

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

*మహదేవపూర్ఆగస్టు9(నేటి ధాత్రి) *

మహాదేవపూర్ మండలంలోని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్శవేణి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులతో సంబరాలు చేశారు
ఈ కార్యక్రమములో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సింగల్ విండో చెర్మన్ చల్ల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కట్కాo అశోక్,మాజీ కాళేశ్వరం దేవస్థానం చెర్మన్ వామన్ రావు,మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాబు,మాజీ ఎంపీటీసీ గంగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోత రామకృష్ణ యూత్ నాయకులు రాజేష్, కడార్ల నాగరాజు,శంకర్,రవిచందర్, సంతోష్,శివరాజు,మనోజ్ రెడ్డి,స్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-2.wav?_=4

* ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రక్షాబంధన్ అంటేనే అక్కా తమ్ముళ్లు..అన్నా చెల్లెల అనురాగం, మమకారంతో..ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రేమని తీలకంగా పెట్టి..రాఖీని రక్షగా కట్టి..మంగళ హారతిని ఆశీస్సులుగా ఇచ్చి..నోటిని తియ్యగా చేసి..ఆనందించే వనితే సోదరీ..ఏడాదికోమారు అక్కా తమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల అపురూప కలయిక..ఆప్యాయతనురాగాల పొందిక..పవిత్ర బంధాల మేళవింపు..ప్రకాశించే రాఖీ కిరణాల సొంపు..భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాల వేదికగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడెక్కడో ఉండే సోదరీమణులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి..మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్ది కానుకలు ఇస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకొని అనుబంధాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సతీమణి వేముల సునీత హైద్రాబాద్ లో స్థిరపడ్డ తన తమ్ముడు మండల సుమన్ గౌడ్ కు రాఖీ కట్టి తమ్ముడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం ఆమె పండుగ విశిష్టతను వివరించారు. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ (రాఖీ) పండుగను నిర్వహించుకుంటామన్నారు. రాఖీ పండుగపై పురాణాల కథనం ప్రకారం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయన్నారు. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధంలో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బందీ చేసి తీసుకెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ దగ్గరకు వెళ్లి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి ఏం కావాలో కోరుకోమంటే..తన భర్త పురుషోత్తముడిని బందీ నుంచి విముక్తి చేయాలని వేడుకుంటుంది. వెంటనే పురుషోత్తముడిని విడుదల చేసి..సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడనేది చరిత్ర చెబుతుందని..అలాగే దుష్టశక్తులను పార ద్రోలడానికి..యుద్ధంలో విజయం సాధించడానికి..రక్షాబంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మరో కథ ప్రచారంలో ఉందన్నారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, నోములవంటి కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్షను కట్టడంలో ముఖ్య ఉద్దేశం..వారి క్షేమాన్ని కోరడమే..అలాగే ధర్మరక్ష..అంటే ధర్మాన్ని రక్షించడం! ధర్మం అంటే ఇక్కడ మతం అని కాదు..న్యాయాన్ని, సత్యాన్ని రక్షించడం. సహోదరత్వాన్ని, మైత్రీ బంధాన్ని రక్షించడం. బౌద్ధం చెప్పిన జాలీ, దయ, కరుణలను కాపాడుకోవడం. ఇది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినది కూడా కాదు. విశ్వజనుల శ్రేయస్సును ఉద్దేశించి ఏర్పరచుకున్నవి. బౌద్ధంలో సత్యానికి, అహింసకి, శీలానికి, శాంతికి ఎల్లలే లేవు. ఇది చాటి చెప్పడానికి బౌద్దారామాలలో ధర్మరక్షలు ( రక్షాబంధనలు ) కట్టుకుంటారు. దాన్ని ఉపయోగించి రొగ్జానా తన భర్త ప్రాణాల్ని కాపాడుకుంటుంది. అప్పటినుండి అది అన్నాచెల్లెళ్ల..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయ్యింది. మరొక్కసారి హిందూ బంధువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలతో..

జగిత్యాల రూరల్ చలిగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T133656.731.wav?_=5

జగిత్యాల రూరల్ చలిగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి

రాయికల్, ఆగస్టు 9, నేటి ధాత్రి:

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా స్తంభించిపోయింది ఒక విధంగా గృహ నిర్మాణ శాఖను రద్దు చేశారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004 -2014 మధ్యకాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా స్యాచిరేషన్ ప్రాతిపదికన ఇల్లు లేని వంటి పతి నిరుపేదను ఒక ఇంటివారిని చేయాలని లక్ష్యం తో రాజకీయాలకు అతీతంగా గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మళ్లీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా వారిని గుర్తించి పెరిగిన విలువలకు అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల నిర్మాణం మొదటి విడతగా తొలి దశలో చేపట్టడం జరుగుతుంది రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పైచిలుకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందిదశలవారీగా రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రం లోపల ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ లేకుండా అందరిని ఒక ఇంటి వారిని చేయాలని లక్ష్యంతోని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం ఆనాడు ఏ ఇందిరమ్మ తల్లి సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరు ఉండకూడదని గ్రామ గ్రామాన స్థలాలు సేకరింపచేసి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగిందిఈరోజు అదే విధంగా ఇల్లులేని నిరుపేద వర్గాల వారి అందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం అందులో భాగంగానే చలిగల్ గ్రామంలో ఇంటి నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగిందిలబ్ధిదారులు అందరు కూడా 400 గజాల నుండి 600 గజాల లోపు చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్ చలిగళ్ గ్రామంతో పాటు రూరల్ మండలం లో ప్రధానంగా బాధ్యతలు తీసుకొని నిరుపేద వర్గాల వారందరికీ అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని అమలు చేయబడే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను వారికి తోడుగా నిలుస్తున్న పెద్దన్న కి వెంకన్న కి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామ పంచాయతీ కార్యదర్శిలు కూడా చాలా బాగా పని చేస్తున్నారు లబ్దిదారులకు సూచనలు ఇస్తూ వారికి తోడుగా నిలుస్తున్నారు…

ఆత్మీయ అనురాగాలతో ఆడపడుచుల పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-4.wav?_=6

ఆత్మీయ అనురాగాలతో ఆడపడుచుల పండుగ *

మహాదేవపూర్ఆగస్టు9(నేటిధాత్రి )

మహాదేవపూర్ మండల కేంద్రంలో ని రాఖీ పౌర్ణమి అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినా రాఖీ పౌర్ణమి సోదరులకు అక్క చెల్లెలు రాఖీకట్టే సాంప్రదాయం అనాదిగా వస్తుంది రాఖీ రోజు ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖికి సిద్ధపడతారు అక్క చెల్లెలంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు ఈ పండుగ రక్తం పంచుకొని పుట్టిన సోదరుల మధ్య కాదు ఏ బంధుత్వం ఉన్న లేకపోయినా ఒక సోదరుడు సోదరి భావనాలతో రాఖీ కట్టడం జరుగుతుంది కేవలం సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహాయానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం పూజ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T130238.015-1.wav?_=8

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రమైన విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో పూజలు నిర్వహించారు అదేవిధంగా రాఖీ పౌర్ణమి పండగ ముందస్తుగా వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న ప్రధానోపాధ్యాయులు శ్వేత ఉపాధ్యాయులు మల్లయ్య సాయికుమార్ పవన్ కుమార్ వి నాగజ్యోతి స్రవంతి ఈశ్వరమ్మ ప్రతిభ సుష్మిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

◆:- మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంటున్న రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ ఒక రైతుకు రెండు బస్తాల ఎరువు ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారు ఎరువుల కొరత లేదు అని చెప్పే అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కూడా ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్ స్టేషన్ లో టోకెన్ తీసుకొని చెప్పులు క్యూ లైన్లో పెట్టి చిమ్మ చీకటిలో పక్కన నిద్రపోయే వారు ఇప్పుడు మళ్ళీ అవే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-3.wav?_=9

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సిఐఎస్ఎఫ్ ఎమర్జింగ్ ఇండియా భద్రత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T135530.386.wav?_=10

సిఐఎస్ఎఫ్ ఎమర్జింగ్ ఇండియా భద్రత

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

సిఐఎస్ఎఫ్ బలగాల సంఖ్య 2.2 లక్షలకు పెరుగుతోంది. రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 14,000 వేల మందిని చేర్చుకుంటామని తెలిపారు.పారిశ్రామిక భద్రతను మరింత బలోపేతం చేయడం,దేశ ఆర్థిక అభివృద్ధికి సురక్షితమైన పునాదిని అందించడం దిశగా ఒక ప్రధాన చర్యగా,కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) యొక్క అధికార బలాన్ని ప్రస్తుతమున్న 1,62,000 నుండి 2,20,000 కు పెంచడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొత్త ఎత్తులకు చేరుకుంటున్నందున ఈ పెరుగుదల వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం,ఓడరేవు రంగం,థర్మల్ విద్యుత్ ప్లాంట్లు,అణు సంస్థాపనలు,జలవిద్యుత్ ప్లాంట్లు,జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్ల వంటి ముఖ్యమైన సంస్థాపనలు వంటి అనేక కీలక రంగాలలో సిఐఎస్ఎఫ్ విస్తరణను బలోపేతం చేస్తుందన్నారు.ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టడంతో,కొత్త పారిశ్రామిక కేంద్రాలు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు.ఈ యూనిట్లకు సమగ్రమైన,ప్రభావవంతమైన భద్రతను అందించడానికి బలమైన ఏ ఎస్ ఎఫ్ ఉనికి అవసరం అన్నారు.దళం యొక్క బలగాల బలం పెరుగుదల కొత్త ఉపాధి అవకాశాలను కూడా తెస్తోంది. 2024 సంవత్సరంలో 13,230 మంది కొత్త సిబ్బందిని నియమించారు.అలాగే 2025లో 24,098 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది.రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం సుమారు 14,000 మంది కొత్త సిబ్బందిని సిఐఎస్ఎఫ్ లో చేర్చుకుంటారని అంచనా.ఇది దళానికి యువత శక్తిని ఇస్తుంది.సవాలుతో కూడిన పరిస్థితులకు మరింత సిద్ధం చేస్తుంది.ప్రతి స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా పనిచేస్తున్న సిఐఎస్ఎఫ్ విధానాల ద్వారా ఈ నియామకాలలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.దళం యొక్క ఈ పెరుగుదల కొత్త బెటాలియన్ ఏర్పాటుకు కూడా మార్గం సుగమం చేస్తుంది.ఇది అంతర్గత భద్రత, అత్యవసర విస్తరణ వంటి అవసరాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.గత సంవత్సరం సిఐఎస్ఎఫ్ దాని భద్రతా విభాగం కింద ఏడు కొత్త యూనిట్లను ప్రారంభించింది.పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్,అయోధ్య విమానాశ్రయం, హజారీబాగ్‌లోని ఎన్టిపిసి బొగ్గు గని ప్రాజెక్ట్,పూణేలోని ఐసిఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, బక్సర్,ఎటాలోని థర్మల్ పవర్ ప్లాంట్లు,మండిలోని బియాస్ సట్లెజ్ లింక్ ప్రాజెక్ట్ అదనంగా సంసద్ భవన్ ఎటా వద్ద రెండు కొత్త అగ్నిమాపక విభాగాలు ఈ ప్రాజెక్టుకు జోడించబడ్డాయి.భారత దేశంలో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి,మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు కీలకమైన జాతీయ ఆస్తులను రక్షించడంలో సిఐఎస్ఎఫ్ పాత్ర పెరుగుతున్నట్లు ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది. మారుతున్న భద్రతా దృష్టాంతానికి అనుగుణంగా సిఐఎస్ఎఫ్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది. తద్వారా భారతదేశం యొక్క వేగవంతమైన అభివృద్ధి వేగానికి అనుగుణంగా దళం బలమైన అప్రమత్తమైన భద్రతా సంస్థగా ఉంటుందని తెలిపారు.

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

 

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏ.ఎం.సీ చైర్ పర్సన్, డీఏఓ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయగా, శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువులు కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 100 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని తెలిపారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు. జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సివస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T134729.909-1.wav?_=11

సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు నిరాశే కొత్తగూడెంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డు కు 55 మంది కార్మికులను పిలిచి కేవలం ఐదుగురిని మాత్రమే మెడికల్ బోర్డు మెడికల్ చేసింది
దాదాపు 9 నెలలుగా ఎలాంటి వేతనాలు లేకుండా మెడికల్ లో ఉంచి కార్మికులను తొమ్మిది నెలలు ఎదురుచూసిన కార్మికుల నోట్లో మట్టి కొట్టిన సీమాంధ్ర అధికారులు
ఈసారి మెడికల్ బోర్డు విషయంలో దళారి వ్యవస్థకు చెక్కు పెట్టిన అంటున్నా అధికారులు
అంటే గతంలో ఈ రూల్స్ పాటించలేదా గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని కార్మికులకు అన్యాయం తల పెట్టిందని సింగరేణి వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలను కార్మిక వర్గం గెలిపిస్తే ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అన్యాయం తలపెడుతున్నది
కాంగ్రెస్ ప్రభుత్వంలో టాప్ రెండు పదవులలో ఉన్న నాయకుల మధ్య కోల్డ్ వార్ లో సమిదాలైన మెడికల్ బోర్డు దరఖాస్తు దారులు ఇన్నాళ్లుగా అన్యాయంగా మెడికల్ ఇన్వాల్విడేషన్ చేసిందిఎవరు సింగరేణి ఉన్నంత యాజమాన్యానికి ఇది తెలియదా
ప్రభుత్వ ఆది నాయకత్వానికి తెలియదా
జరుగుతున్న ఉల్లంఘన తెలిసే నూతనంగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం తన తర్వాత ఉన్న వారికి చెక్కుపెట్టి మెడికల్ బోర్డులో జరిగే లావాదేవీలను నియంత్రించడానికి ఇతనిని నియమించారు అనుకుందాం ఈ మెడికల్ బోర్డు ఫలితాలు తార్ మార్ కావడంతో ఎన్నో కుటుంబాలు వీధిపాలయ్యాయి ఈ కొత్తగా వచ్చిన అధికారి ఇంతటితో ఆగలేదు 35 సంవత్సరాల నుండి 45 ఏళ్ల లోపు వారికి కారుణ్య నియామకాలకు అర్హత ఇచ్చింది కంపెనీ ఆ మాజీ ఉద్యోగులు వారి పిల్లలకు ఉద్యోగం దొరకాలనే గంపెడు ఆశతో ఓపెన్ స్కూల్ టెన్త్ సర్టిఫికెట్లువయసు 35 లోపు ఉండేలా పెట్టుకున్నారు 40 కి అర్హత వచ్చాక సింగరేణి యాజమాన్యం అడగడంతో వారి ఒరిజినల్ రెగ్యులర్ టెన్త్ సర్టిఫికెట్లు సంక్షేమ అధికారులకు అమాయకంగా ఇచ్చారు
కొత్తగా వచ్చిన బాస్ వాళ్లను మోసగాళ్లుగా ప్రకటించారు ఉద్యోగాలు కాదు కదా యంఎంసి డబ్బులు కూడా వారికి రద్దు చేశారు ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి
సింగరేణిలో కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతున్న సింగరేణి కార్మిక వర్గం ఓట్లతో గెలిచిన గుర్తింపు ప్రాతినిత్య సంఘాలు నోరు మేతపడకపోవడంలో అంతరాయం ఏంటి
మూడు నెలలుగా కారుణ్య నియామకాలు ఆగిపోయినాయి ఒక్కరికి సైత్యం ఆర్డర్ ఇవ్వలేదు
కార్మిక వర్గం పడుతున్న బాధలు తెలియని ఇతర ప్రాంతాల అధికారులు ఇరువురు ఈ కారుణ్యనియామక నష్టానికి కార్మికులు రక్త మాంసాలను ద్వారా పోసి ఇన్ని సంవత్సరాలు కంపెనీకి సేవ చేస్తే కార్మికుల యం ఎం సి డబ్బులు రాకుండా ఉండడానికి కారణం ఎవరు అని కార్మికులు భావిస్తున్నారు
ప్రజా పాలనతో రాష్ట్రాలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమీలను అమలు పరచాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికునిమెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబంలో ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కంపెనీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కార్యక్రమంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
నామల శ్రీనివాస్
కాసర్ల ప్రసాద్ రెడ్డి
రాళ్ల బండి బాబు
జయశంకర్
కే నరసింహారెడ్డి
ఎండి సలీం
తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version