రైతు నేస్తం’ కార్యక్రమం…

రైతు నేస్తం’ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

 

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏ.ఎం.సీ చైర్ పర్సన్, డీఏఓ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయగా, శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువులు కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 100 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని తెలిపారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు. జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సివస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version