నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప.

నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప

మందమర్రి నేటి ధాత్రి:

మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని పరామర్శించిన మాజీ సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేడు మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని కలిసి ఆరోగ్య స్థితి ని తెలుసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యం తో ఇబ్బందిపడుతు ఇటీవలే కోలుకున్న నల్లాల ఓదెలు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

Singareni

 

 

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

 

Singareni

 

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

 

Singareni

 

 

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు…

మందమర్రి నేటి ధాత్రి:

*కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి మార్కెట్ సంజయ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరు నియోజక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేష్,రాయబారపు కిరణ్,చిప్పకుర్తి శశిధర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు గ్రహీత, తొలి తెలుగు ప్రధాని
తెలంగాణ నుండి కూడా మొట్టమొదటి ప్రధాని మంత్రి అని
బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఆ మహనీయుని కి ఇదే ఘన నివాళి అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్,చోటు,సూరజ్ కిరణ్,సతీష్,బాచి,చింటూ,శంకర్, రాజ్ కుమార్,రాజేష్,రాజు పాల్గొన్నారు.*

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సఫియా సుల్తానా గారు ఎంపిక అయ్యారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )

ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి. వెంకటేశ్వర్లు గారి నుండి.సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

భూపాలపల్లి మండలం: గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమెతల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

 

గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన.

చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది

అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన.

చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే…

 

గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తన బిడ్డ బాబు ఫొటోను అభిమానుతో పంచుకున్నారు.
”మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్‌’ని (Keanu Rafe Dolan) పరిచయం చేస్తున్నందుకు మా  మనసు  సంతోషంతో నిండిపోయింది’ అనే క్యాప్షన్‌ పెట్టారు.
ఇలియానా పోస్ట్ చూసిన ఫాన్స్, పలువురు నెటిజన్లు ఇల్లి బేబీకి  అభినందనలు చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ  ప్రియాంక చోప్రా ఈ పోస్ట్‌కు స్పందిస్తూ విష్ చేశారు.  

2023లో మైఖేల్‌ డోలన్‌ను (Michael Dolan) ఇలియానా వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరు కోవా ఫీనిక్స్ డోలన్‌.   పెళ్లి, భర్త గురించి వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు ఇలియానా. ‘నన్నేమన్నా భరిస్తా.. కానీ నా కుటుంబసభ్యులను ఏమైనా అంటే ఊరుకోను’ అని గతంలో ఆమె పోస్ట్ పెట్టిన  సంగతి తెల్సిందే.  

రామ్  పోతినేని హీరోగా వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఆమె అగ్ర కథానాయికగా ఎదిగింది. స్టార్ హీరోస్ సరసన అవకాశాలు అందుకుంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో చివరిగా  నటించారు.  గతేడాది బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

బాలీవుడ్ లో విషాదం..నటి హఠాన్మరణం.

బాలీవుడ్ లో విషాదం..  నటి హఠాన్మరణం 

 

 

 

 

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (Actress Shefali Jariwala 42) కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. నాటి ‘కాంటా లగా’ (Kaanta Laga Song) పాటతో ఆమె (Shefali Jariwala) దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, అనారోగ్యానికి గురైన షెఫాలీని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. అయితే, ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

2002లో ‘కాంటా లగా’ పాటలో నటించిన షెఫాలీ రాత్రి రాత్రికి పాప్ కల్చర్ సెన్సేషన్‌గా మారిపోయారు. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 2004 నాటి ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలో కూడా నటించారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో కూడా పాల్గొన్నారు. తన కాన్ఫిడెన్స్, క్లారిటీతో జనాలను ఆకట్టుకుని మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. 2015లో ఆమె యాక్టర్ పరాగ్ త్యాగి ని పెళ్లి చేసుకున్నారు. ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాలిటీ షో 5, 7 సీజన్‌లలో భర్తతో కలిసి పాల్గొన్నారు. చిన్న వయసులో ఆమె కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

 

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెల్సిందే. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇప్పుడు మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3’ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. తాజాగా టీమ్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు భారీస్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ న్యూ సీజన్‌ కోసం రెడీ గా ఉండండి అని టీజర్ లో చెప్పారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

గర్జన వినడానికి కాదు భయపెట్టడానిక.

గర్జన వినడానికి కాదు భయపెట్టడానిక…

సాంప్రదాయక చీర, ముక్కు పుడక, ఇతర ఆభరణాలతో గోండు యువతిగా రష్మిక కనిపించే కొత్త చిత్రం మైసా. దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లే ఈ సినిమాతో దర్శకుడిగా పరియమవుతున్నారు.

సాంప్రదాయక చీర, ముక్కు పుడక, ఇతర ఆభరణాలతో గోండు యువతిగా రష్మిక కనిపించే కొత్త చిత్రం ‘మైసా’. దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లే ఈ సినిమాతో దర్శకుడిగా పరియమవుతున్నారు. అజయ్‌, అనిల్‌ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌ను దర్శకుడు హను రాఘవపూడి విడుదల చేశారు. తమిళ పోస్టర్‌ను తమిళ హీరో ధనుష్‌, మలయాళ పోస్టర్‌ను దుల్కర్‌ సల్మాన్‌, కన్నడ పోస్టర్‌ను శివరాజ్‌ కుమార్‌, హిందీ పోస్టర్‌ను విక్కీ కౌశల్‌ విడుదల చేశారు. వీరందరూ రష్మికకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ముఖాన రక్తపు మరకలు, చేతిలో ఆయుధంతో కొత్తగా కనిపించారు రష్మిక. ‘ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. టైటిల్‌, ఆమె లుక్‌.. ప్రాజెక్ట్‌ మీద అంచనాలు పెంచాయి. ‘రెండేళ్ల కష్టానికి రూపం ‘మైసా’ చిత్రం. గోండు తెగల ప్రపంచం ఆధారంగా ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పారు.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా…

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో పలు రేషన్ డిపోలను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తనిఖీ నిర్వహించారు రేషన్ డిపోలు వివరాలను తెలుసుకొని సరుకులను పరిశీలించారు ఈ తనిఖీలు సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అధికారులు తనిఖీలు చేపట్టారు బియ్యం పంపిణీ పై ఆరా ఈ సందర్భంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనపురం షాపు నెంబర్ మూడు రేషన్ డిపో తనిఖీ చేశామన్నారు ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్న విధానం రేషన్ బియ్యం వివరాలు నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని చెప్పారు ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించకపోతే రేషన్ షాపులపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి వెంట భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ పలు మండలాల తాసిల్దార్లు అధికారులు ప్రజలు పాల్గొన్నారు

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు.

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు…

మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది.మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం శుక్రవారం విడుదలైంది. మనోజ్‌ ఈ సినిమాను థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్‌ యాక్టింగ్‌ అదిరింది. మా అన్న కూడా ఇంత బాగాచేస్తాడనుకోలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న కలహాలు తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఒక రోజు ముందు ‘కన్నప్ప’ చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ మనోజ్‌ ట్వీట్‌ చేశారు. ఇందులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సినిమా చూసిన తర్వాత తన అన్న విష్ణును మనోజ్‌ మెచ్చుకోవడంతో ఫ్యామిలీ అంతా మళ్లీ ఒక్కటయ్యే సమయం ఆసన్నమవుతోంది అంటూ మంచు అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

 జూనియర్‌ నో ఫియర్‌.

 జూనియర్‌ నో ఫియర్‌….

ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త గాలి జనార్థన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘జూనియర్‌’. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్థన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘జూనియర్‌’. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ‘జూనియర్‌.. నో ఫియర్‌’ అనిపించే హుషారైన కాలేజీ కుర్రాడిగా కిరీటి కనిపించారు.

తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం ఉన్న ఈ యువకుడు శ్రీలీలను ఇష్టపడతాడు.

గొడవతో మొదలైన వారి జర్నీ క్రమంగా ఎట్రాక్టివ్‌ కెమిస్ర్టీగా మారుతుంది.

ఈ టీజర్‌లో కిరీటి అదరగొట్టాడనే చెప్పాలి. తన డ్యాన్స్‌, స్టంట్స్‌, స్పాట్‌ ఆన్‌ కామిక్‌ టైమింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. అలాగే కిరీటి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు.

టీజర్‌ చివరిలో బాస్‌ పాత్రలో జెనీలియా డిసౌజా కనిపించడం ఆసక్తికరం.

అలాగే హాస్య పాత్రలో వైవా హర్ష కనిపించారు.

కె.కె.సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ గ్రాండ్‌ విజువల్స్‌తో అద్భుతంగా ఉంది.

అలాగే దేవిశ్రీప్రసాద్‌ సంగీతం కూడా అలరించింది. తెలుగు, కన్నడ, తమిళ మలయాళ హిందీలో భాషల్లో జులై 18న గ్రాండ్‌గా ‘జూనియర్‌’ విడుదల కానుంది.

 కావాల్సినంత వినోదం

 కావాల్సినంత వినోదం…

 

హవీష్‌, కావ్య థాపర్‌ జంటగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రం నేను రెడీ. హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ బేనర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు.

హవీష్‌, కావ్య థాపర్‌ జంటగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రం నేను రెడీ’.
హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ బేనర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
హీరో హవీష్‌ మాట్లాడుతూ ‘త్రినాధరావు అన్ని సినిమాల్లో కంటే ఇది బెస్ట్‌ స్ర్కిప్ట్‌ అవుతుంది.
మిక్కీ మ్యూజిక్‌, నిజార్‌ విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి’ అని అన్నారు. హీరోయిన్‌ కావ్య థాపర్‌ మాట్లాడుతూ ‘ఈ రోజు మేము చూపించింది చిన్న గ్లింప్స్‌ మాత్రమే. సినిమాలో మీకు కావాల్సినంత వినోదం ఉంది.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది అని అన్నారు.
చిత్రదర్శకుడు త్రినాధరావు మాట్లాడుతూ అప్పట్లో ‘పెళ్లిసందడి సినిమాలో ఇండస్ట్రీలోని హాస్య నటులంతా నటించారని విన్నాం.
ఈ సినిమా కూడా ఫ్రేమ్‌ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది అని అన్నారు.
నిర్మాత నిఖిల కోనేరు మాట్లాడుతూ నా మొదటి చిత్రాన్ని త్రినాధరావు లాంటి పెద్ద దర్శకుడితో తీయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

 కమల్‌ హాసన్‌కు అరుదైన గౌరవం

 కమల్‌ హాసన్‌కు అరుదైన గౌరవం…

 

ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడెమీలో కోలీవుడ్‌ అగ్ర నటుడు కమల్‌ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్‌ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ…

ప్రపంచ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడెమీలో కోలీవుడ్‌ అగ్ర నటుడు కమల్‌ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్‌ అకాడెమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్‌ హాసన్‌తో పాటు పలువురు భారతీయ ప్రముఖ నటీనటులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో కమల్‌ హాసన్‌ పేరు ఉంది. ఎంతోమంది హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో కమల్‌ హాసన్‌ పాలుపంచుకోనున్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యే చిత్రాల్లో ఫైనల్‌ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాగా, ఈ ఏడాది మొత్తం 534 మంది సభ్యులను ఆహ్వానించినట్టు అకాడెమీ తెలిపింది. ప్రతిభావంతులైన వీరికి అకాడెమీలో చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.

నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు.

నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుల సమస్యలు పరిష్కారం ఎలా

◆ ఎమ్మెల్యే మాణిక్ రావు నేటి ధాత్రి:

ఝరాసంగం నేటి ధాత్రి:

ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వడం జరిగిందని అవి ఎలా పరిష్కరిస్తున్నారని అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనేంటి మాణిక్ రావు తహ సీల్దార్ తిరుమలరావు ను ప్రశ్నించారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన ఆర్ ఓ ఆర్ 2025 చట్టం భూభారతి పేరుతో తీసుకువచ్చిందని ఇందులో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు 100 ఆప్షన్స్ ఇస్తామని ప్రకటించిందని అవి ఆన్లైన్లో ఉన్నాయా అని ఎమ్మెల్యే అడిగారు. దీనికి తహసిల్దార్ మాట్లాడుతూ ఇంకా ఆన్లైన్లో ఆ అవకాశం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలోసర్వర్ కనెక్షన్ సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నా దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే అడగగా పైనుండే సర్వర్ సమస్య నెలకొన్నదని స్లోగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని తహసిల్దార్ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సీసీ ఎస్ఏ కార్యాలయానికి ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు ప్యాలవరం మాజీ ఉప సర్పంచ్ మాణిక్యం యాదవ్, నర్సింలు, తదితరులు ఉన్నారు.

బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సుభాష్ రావు దేశముఖ్.

బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సుభాష్ రావు దేశముఖ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ రావు దేశ్ముఖ్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపి ఆహ్వానించారు. అదేవి ధంగా వివిధ రాజకీయ, పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెల పడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, జహీరాబాద్ కు మళ్ళి కమిషనర్ గా రావడం ఎంతో శుభసూచకంగా ఉం దని, తమ వద్దకు మున్సిపల్ పట్టణ పరిధిలోని ఉన్నటువంటి ఆయా బస్తీల, వార్డులల్లో ఉన్నటువంటి ఆయా సమస్యలు తమ వద్దకు వచ్చినచో వాటిని పరిష్కారమయ్యేలా చూసే విధంగా అడుగులు వేస్తామని, అంతేకాకుండా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రబలకుండా చూస్తామని వారు తెలిపారు.

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం..

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం..

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

◆ – తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండలంలోని దేవరం పల్లి,చీలపల్లీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను,మరియు దేవరం పల్లీ గ్రామంలో డా౹౹సిద్దం.

ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.

ఉజ్వల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఝరాసంఘం మండల అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్ గారితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.

నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని,రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద రూ.12000 ఎకరా నికి అందిస్తున్నామని తెలిపారు.

 

N. Giridhar Reddy.

 

 

మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్,సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కేతకి దేవాలయం చైర్మన్ మల్లన్న పాటిల్,మాజీ యూత్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,మాజీ యం.పి.టి.సి హఫీజ్,మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,శామ్ రావు పాటిల్,అశ్విన్ పాటిల్,సంగమేశ్,శ్రీకాంత్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,అక్బర్,నథానెయల్,మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,ఇమామ్ పటేల్,ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ తదితరులు పాల్గొన్నారు.

తవ్వుకు పోతున్నాం.. దమ్ముంటే అపండి…

తవ్వుకు పోతున్నాం.. దమ్ముంటే అపండి…

◆:అక్రమ దందా..అంతాజీరోలోనే

◆: అసైన్మెంట్ భూములే లక్ష్యం

◆: యథేచ్చగా ఎర్రరాయి వ్యాపారం

◆: ధర నిర్ణయం వారిష్టమే

◆: ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యానికి తూట్లు

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

 

 

జహీరాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఎర్రరాయిని తవ్వుకు పోతాం చూడు.. దమ్ముంటే ఆపుకోండి అంటూ మైనింగ్ మాఫియా సవాల్ విసురుతోంది. డివిజన్ లోని ఓ పోలీసు అధికారి గతంలో సీరియస్ గా తీసుకుని ఈ మాఫియాకు అడ్డుకట్ట వేసినా పూర్తిస్థాయిలో నిరోధించ లేకపోయారు. వీరి ఆగడాలపై ప్రభుత్వం జోక్యం లేకుండా పోవడంతో, ఇష్టం వచ్చిన కాడికి విక్రయిస్తూ అందిన కాడికి దోచేస్తున్నారు. మైనింగ్ సెస్ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి వేస్తున్నారు. అక్రమార్కుల దందాకు అంతే లేకుండా పోయిందని స్థానిక ప్రజల వాపోతున్నారు.

జహీరాబాద్ ప్రాంతంలో దశాబ్దాలుగా అక్రమ ఎర్రరాయి తవ్వకాల దందాతో బలపడ్డ స్థానిక మాఫియా అధికారులకే సవాల్ గా మారారు. “తవ్వుకు పోతాం చూడు.. దమ్ముంటే ఆపు” అంటూ అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డివిజన్ లోని ఓ పోలీసు అధికారి కొంతమేర అక్ర మ తవ్వకాల నిరోధానికి అడ్డుకట్ట వేసినప్పటికీ పూర్తిస్థాయిలో నిరోధించ లేకపోయారని స్థానికులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతం లోని ఎర్రరాయి నిక్షేపాలు అక్రమార్కుల పరమవు తున్నాయి. ఘనుల తవ్వకాలపై అజమాయిషి లేక పోవడంతో అడ్డగోలుగా వీరి అక్రమ దందా మూడు పూల ఆరుకాయలు సాగుతోంది. కనీసం ధర నిర్ణ యంలోను ప్రభుత్వం జోక్యం లేకుండా పోవడంతో ఇష్టం వచ్చిన కాడికి ధర నిర్ణయించి అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ సెస్ చెల్లించకుండా ఆదాయం గండి వేస్తున్నారు. ఇదిలా ఉండగా దీని ప్రభావం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా పదుతోంది.

 

 

Indiramma’s housing.

 

 

 

ఎర్రరాయిపై ఉదాసీనత..

ప్రజాప్రతినిధుల అండదండలు, అధికారుల ఉదాసీ నత కారణంగా ఈ ప్రాంతంలో ఎర్రరాయి తవ్వకా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెద్దమొత్తంలో సాగుతున్న జీరో వ్యాసా రంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడు తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ అక్రమ దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. అక్కడక్కడ పట్టా భూముల్లో ఎర్ర రాయి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అసైన్మెంట్ భూముల్లోనే ఎక్కువ మొత్తంలో ఈ అక్రమ వ్యాపా రం సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు అక్రమ మైనింగ్ దందాపై ఉక్కుపాదం మోపాల్సిన

పెద్ద మొత్తంలో అక్రమ మైనింగ్..

ఈ ప్రాంతంలో భారీగా ఎర్రరాయి తవ్వకాలు సాగు తున్నాయి. అనునిత్యం వేలకొలది ఎర్ర రాయి నెలిక్ తీసి లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. ప్ర జాప్రతినిధుల అండ దండలు, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. జహీరాబాద్ ప్రాంతంలోని కోహీర్, ఝరాసంగం, న్యాల్ కల్, మొగుడంపల్లి తదితర మండలాల్లో సుమారు 50కి పైగా రాయి ఘనులున్నాయి. అదే మొత్తంలో కోత మిషన్లు నడుస్తు న్నాయి. ఒక్కొక్క మిషన్ రోజుకి సుమారు 2వేలకు పైగా రాయిని వెలికి తీస్తాయి. ఈ విధంగా తీసిన రాయిని సమీపంలోని పట్టణాలకు తరలించి విక్ర యిస్తారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో రోజుకి 1లక్షకుపైగా ఎర్రరాయిని విక్రయిస్తున్నారు. ఒక రాయికి రూ.15 నుంచి 25వరకు విక్రయిస్తారు. దీంతో రోజుకి 15లక్షల నుంచి 25 లక్షల వరకు ఎర్ర అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే నెలకు రూ.4.5 నుంచి రూ.5.5కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సంప త్సరానికి ఒక ఎర్ర రాయి రూ.54 నుంచి 6.5కోట్ల వరకు ఎర్ర రాయుళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ అనుమతులు ఉంటే ఈ వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూలేదని నిపుణులు పేర్కొన్నారు. అనుమతులు లేని కారణం గా ప్రభుత్వానికి రావల్సిన సొమ్ము సైతం అక్రమా ర్కుల జేబులనే నింపుతుంది.

 

 

Indiramma’s housing.

 

 

 

పాతాళాన్ని మైమరిపించే గుంతలు

ఈ ప్రాంతంలో ఎర్రరాయి తవ్వకాల ద్వారా ఏర్పడు తున్న భారీ గుంతలు పాతాళాన్ని తలపిస్తున్నాయి. కోతలు పాతాళానికి నిచ్చెనలు వేసినట్లు భ్రాంతిని కలిగిస్తున్నాయి. కోతల అనంతరం ఘనిలో ఏర్పడ్డ భారీ గుంతలు మృత్యు కుహరాలుగా మారుతు న్నాయి. ఈ ఘనిలో పని చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. ఘని ప్రారంభానికి ముందు జెసిబి సాయంతో నేలను చదును చేసి పైపొర మట్టిని తొలగించిన అనంతరం కోత యంత్రాల సాయంతో కావలసిన సైజులో వాటిని కోస్తారు కోసిన రాళ్లను కూలీల సాయంతో పైకి తీసి వాహనాల్లో మార్కెట్ కు తరలించి విక్రయిస్తారు ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సమీప పట్టణానికి తీసుకెళ్లి
రూ.4,5 అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ఎర్ర రాయి తీసేందుకు ఘనిలో 4, 5 మంది కూలీలు పని చేస్తారు. ఇలా పనిచేసిన వారు కూడా శ్రమదో పిడీకి గురౌతున్నారు.

సైన్మెంట్ భూముల్లో వ్యాపారం..

స్థానిక వ్యాపారులు అసైన్మెంట్ భూములను తమ వ్యాపార కేంద్రాలుగా మలుచుకుని ఎర్రరాయి. తవ్వకాలు విచ్చలవిడిగా చేపట్టారు. సుమారు ఈ ప్రాంతంలోని దాదాపు వంద ఎకరాలకుపైగా అసైన్మెంట్ భూముల్లో ఇలాంటి తవ్వకాలు కొనసా గుతున్నాయి. అధికారులు అడపాదడపా దాడులు: చేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడితో ఎలాంటి చర్యలు లేకుండా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి.

అంతా జీరోలోనే..

జీరో దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈ జీరో దందాకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయప డుతున్నారు. నిర్మాణ రంగంలో ఎర్రరాయి వినియో గం తప్పనిసరైంది. సిమెంట్ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణంలో సైతం బేస్ మెంట్ కోసం ఎర్ర రాయిని ఎక్కువ గా వినియోగిస్తున్నారు. కనీసం ప్రతి ఇంటికి కనీసం రెండు వేల వరకు ఎర్ర అవసరమ వుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఎర్ర రాయిని వినియోగించి ఇల్లు నిర్మాణం చేస్తు న్నారు. ఎక్కువ మొత్తంలో రాయి వాడతారు. చూడచక్కని ఎర్ర రాయి వినియోగం ఎక్కువ వాడటంతో వ్యాపా రస్తులు జీరోలో విక్రయించి పెద్ద మొత్తంలో దండు కుంటున్నారు. ఇదిలా ఉండగా దీని ప్రభావం ఇంది. రమ్మ ఇండ్ల నిర్మాణంపై పడుతోంది. ఇండ్ల కోసం ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తుం ది. రాయి ధర పెంచడంతో ఇండ్ల నిర్మాణం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version