ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. ఫైనల్లో అడుగు పెట్టిన అల్కరాజ్…

ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. ఫైనల్లో అడుగు పెట్టిన అల్కరాజ్

 

ఆస్ట్రేలియా ఓపెన్ 2026 తుది దశకు చేరుకుంది. స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 తుది దశకు చేరుకుంది. స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌(Australian Open 2026)లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికీ.. జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు.
అయితే ఈ మ్యాచ్ మూడో సెట్‌లో అల్కరాజ్(Carlos Alcaraz) కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఒకానొక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలుగుతాడనే అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు. మెడికల్ టైం అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో 3-5తో అల్కరాజ్‌ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్‌.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. మరోవైపు సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు తలపడనున్నారు.

గుండెపోటుతో ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి సీహెచ్ నారాయణ మృతి

గుండె పోటుతో సీహెచ్ నారాయణ (55) ఆకస్మిక మృతి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్ కల్ మండలం, చీకూర్తి గ్రామ, నివాసి జహీరాబాద్ నివాసి సిహెచ్. నారాయణ (ఇంటలిజెన్స్ పోలీస్ విభాగం) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం జహీరాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. వృత్తినే దైవంగా భావిస్తూ, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న నారాయణ మృతి చెందడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ. నియోజకవర్గ ప్రజలు,

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

 

 

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2026) ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..

 తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Telangana TET 2026) ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026 జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది. 2026లో మాస్టర్ టెట్ పరీక్షలు రెండు విడతలుగా జరిగిన సంగతి తెలిసిందే.
‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ..

తెలంగాణ టెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 30వ తేదీ నుంచి స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 1 వరకు అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలను రివ్యూ చేసేందుకు.. పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్ద్వారా తెలుసుకోవాలని సూచించింది.

దరఖాస్తుల సంఖ్య..

ఈసారి తెలంగాణ టెట్‌కు 2.37 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 71,670 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు కూడా తమ ఆర్జన పత్రాలను సమర్పించారు. పేపర్ 1, పేపర్ 2 కోసం మొత్తం ఈ దరఖాస్తుల సంఖ్య పరిగణనలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు…

సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు

 

ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్‌లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్‌లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.

కుప్వారా: జమ్మూకశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌ జోధా మకాన్-బీరండోరి ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి శుక్రవారం 15 డోన్లు సంచరించినట్టు గుర్తించారు. ఆర్మీ బలగాలు వెంటనే స్పందించినట్టు అధికారులు తెలిపారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్‌లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్‌లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ జరగలేదని తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, పాక్ డ్రోన్ల కదలికల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించి నిఘాను మరింతం తీవ్రం చేశామని అధికారులు వివరించారు.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, కేరన్ సెక్టార్‌లో గురువారం రాత్రి కొన్ని తక్కువ భూమి కక్ష (ఎల్‌ఈఓ) ఉపగ్రహాలు కనిపించాయి. రొటీన్ క్రమంలో సాయుధ బలగాలు ఓవరాల్ ఎయిర్‌స్పేర్ నిఘా కొనసాగిస్తున్నాయి. కాగా, ఈనెల మొదట్లో పూంచ్, సాంబాలోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్‌లు కనిపించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. రామ్‌గఢ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఒక డ్రోన్ కనపించిందని చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి రక్షణ బలగాలు హైఅలర్ట్ కొనసాగిస్తున్నాయి.

ఐసీసీతో గూగుల్ ఒప్పందం..

ఐసీసీతో గూగుల్ ఒప్పందం

 

ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్‌ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీ(ICC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచులను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది. ఈ మేరకు గూగుల్(Google) సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఏఐ జెమిని 3 ప్రో లైవ్ మ్యాచును గమనించి, కామెంటరీని విని, ఏం జరిగిందనేది సరళమైన భాషలో ఫ్యాన్స్‌కు వివరిస్తుంది. మ్యాచు హైలైట్స్, ఆటగాళ్లు, ఆటకు సంబంధించి ఇతర ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. ఈ అధునాతన సాంకేతికతను వాడి మహిళల క్రికెట్‌ను మరింతగా అభిమానులకు చేరువ చేయడం కూడా ఈ భాగస్వామ్యం ఉద్దేశం.

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా…

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

 

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్.. భారత్‌కు రాబోమని, మ్యాచుల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీ(ICC)పై ఒత్తిడి తెచ్చింది. అయితే బంగ్లా చెప్పినట్లు భారత్‌లో ఎలాంటి భద్రతా సమస్యలు లేకపోవడంతో ఐసీసీ దీనిని తిరస్కరించింది. బీసీబీ(BCB) మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి తప్పించి.. ర్యాంకుల ఆధారంగా దాని స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.
బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు వచ్చాయి. తమ ప్రభుత్వ నిర్ణయం బట్టే తదుపరి ప్రణాళికలు ఉంటాయని పీసీబీ ఛైర్మన్ నఖ్వి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ హెచ్చరించడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) కోసం ఆ జట్టు శ్రీలంకకు వెళ్లబోతోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) షెడ్యూల్‌ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 2న పాక్‌ కొలంబోకు చేరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పీసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) స్పందించాడు. ‘ప్రస్తుతం ఏదైతే జరిగిందో అదంతా బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధం. భారత్‌లో భద్రత పరమైన సమస్యలు లేవు. నా ఉద్దేశంలో ఇదంతా బంగ్లాదేశ్ తప్పు. ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌కు రాకపోవడం వల్ల చాలా కోల్పోనుంది. నిజానికి ఆ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బంగ్లా స్పిన్నర్లకు భారత్ పిచ్‌ల గురించి బాగా తెలుసు. అయితే టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు ఎవరైతే భారత్‌కు రారో.. వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. అలాగే ఆ దేశ క్రికెట్ బోర్డులు కూడా భారీగా నష్టపోయే అవకాశమూ ఉంది’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ…

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ (BJP MP Paka Satyannarayana) వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌తో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, నేడు నాల్గోస్థానానికి చేరుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల అద్భుత పరిపాలనకు నిదర్శనమని ఉద్ఘాటించారు. 2014లో రూ. 14.30 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్, నేడు రూ. 50.40 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడమే కాకుండా, ప్రపంచ యుద్ధాల ప్రభావం భారత్‌పై పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు భారతదేశ పరపతిని పెంచాయని తెలిపారు.

భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు చెప్పడం విశేషమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందనుందని వెల్లడించారు.

ప్రపంచ ఆక్వా ఎగుమతుల్లో భారత్ వాటా 76 శాతం కాగా, అందులో 60శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వివరించారు. ఈ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం పెరిగి, భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా, ఈ బడ్జెట్ అటు దేశ భద్రతకు, ఇటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

విజయవాడలో బీజేపీ వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకా సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కరించేలా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ‘వారధి’ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలపారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను, సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య ఒక ‘వారధి’లా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.

రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!

రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!

 

పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.

 అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కాలువ (Panama Canal) సమీపంలోని రెండు ప్రధాన ఓడరేవుల నిర్వహణ ఒప్పందాలను పనామా దేశపు సుప్రీంకోర్టు రద్దు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘సీకే హచిసన్’ (CK Hutchison) గ్రూప్‌నకు చెందిన(సబ్సిడియరీ) ‘పనామా పోర్ట్స్ కంపెనీ’ (PPC) తో కుదుర్చుకున్న ఈ కీలక కాంట్రాక్టులు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన కనిపిస్తోందని, ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విధివిధానాలను విస్మరించారని కోర్టు పేర్కొంది.

పనామా కాలువకు రెండు వైపులా ఉన్న బాల్బోవా (Balboa) ఇంకా క్రిస్టోబల్ (Cristobal) ఓడరేవులను నిర్వహించేందుకు 2021లో అప్పటి ప్రభుత్వం పనామా పోర్ట్స్ కంపెనీ ఒప్పందాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లను విచారించిన పనామా సుప్రీం కోర్టు, ఆ ఒప్పందాలు చెల్లవని తీర్పునిచ్చింది. కాగా, సీకే హచిసన్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి. తాజాగా పనామా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ కంపెనీకి పనామాలో ఉన్న పట్టు సడలే అవకాశం ఉంది. అయితే, వీటి నిర్వహణ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలుస్తుందా? అనే అంశాలపై సందిగ్ధత నెలకొంది.

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…

బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

 

ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.

అహ్మదాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రంలో శుక్రవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని, బాంబు పెట్టామంటూ ఒక నోట్ విమానంలో కనిపించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 6.40 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి విమానం బయలుదేరేందుకు అనుమతిస్తామని తెలిపారు.

ఇదే తరహా ఘటన

ఈనెల 22వ తేదీన కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-పుణె ఇండిగో విమానం 6E 2608కు బాంబు బెదిరింపు రావడంతో పుణె విమానాశ్రయానికి రాగానే సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రతా ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

 

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకోనున్నారు.

ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్..

పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంను విచారిస్తున్న స్పీకర్

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.

హైదరాబాద్, జనవరి 30: పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) విచారణ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్‌ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది.

సమయం ఇవ్వండి: మహేశ్వర్ రెడ్డి

ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు.ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… నేడు దానంను స్పీకర్ విచారిస్తున్నారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.

ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా…

దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా 5.5 ట్రిలియన్ డాలర్ల హెచ్చుతగ్గులు

 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కమోడిటీ మార్కెట్స్‌లో నెలకొన్న ఒత్తిడికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరలపై చర్చే! సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్లు, వ్యవస్థాగత మదుపర్ల వరకూ అన్ని వర్గాల వారినీ పసిడి ధరల పరుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రోజు ధర ఎంత పెరుగుతుందో? ఎంత తగ్గుతుందో? అసలు పసిడిపై పెట్టుబడికి ఇది సరైన సమయమో కాదో తెలియక సామాన్యుల తలకిందులవుతున్నారు. అయితే, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందని స్టాక్ మార్కెట్‌ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ది కొబేసీ లెటర్’ చేసిన ట్వీట్ ప్రకారం, గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య (అమెరికా కాలమానం ప్రకారం) బంగారం మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్‌లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్లను చేరింది. నిత్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌ కాయిన్ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లే. కానీ బంగారం మార్కెట్ విలువలో ఇంట్రాడే హెచ్చుతగ్గులే ఇందుకు మూడు రెట్లు ఉండటం కలకలానికి దారితీస్తోంది.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

 

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్(Special Weapons and Tactics Teams)లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27), తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కలిచివేసే వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. ‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు.

ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పడం గమనార్హం.

ఘటన నేపథ్యం..

జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ (Dumbbell)తో ఆమె తలపై దాడి చేశాడు.

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి…

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

అమరావతి, జనవరి 30: ఈ రోజు జనవరి 30 భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

‘జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు.

గట్టికేసా..లోట్టపీసా?

”కేసీఆర”ను పిలవడం అంత “ఆశ మాసి కాదు”?

`సహజంగా కేసుల విషయంలో ప్రభుత్వ వాదన బలంగా వుంటుంది?

`ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రతి పక్షం గట్టిగా వుంది?

`ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమే అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా

అన్నారు?

`తన ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని పదే పదే చెప్పారు?

`అప్పట్లోనే ఎందుకు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టలేదు?

`అధికారం లోకి వచ్చిన నాటి నుంచి సాగదీస్తున్నారు?

`ప్రభాకర్ రావు రాగానే అంతా అయిపోతుందన్నారు?

`ప్రభాకర్ రావు ను అనేక సార్లు విచారించారు?

`ఇప్పుడు బాండ్స్ ట్యాపింగ్ ఆధారంతో వసూలు చేసారంటున్నారు?

`తమను భయపెట్టి బాండ్స్ తీసుకున్నట్లు ఒక్కరైనా చెప్పారా?

`కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నాయకులు ఇదే మాట అంటున్నారు?

`అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అవే కంపెనీలు ఇచ్చాయి?

`అందులో దాపరికం లేదు, వుండదు?

`తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు బీజేపీ నాయకులు అనేక మంది చెప్పారు?

`వారిలో ఒక్కరైనా కంప్లైంట్ ఎందుకివ్వలేదు?

`ఫోన్ ట్యాప్ లో రెండో సిట్ వేశారు?

`హరీష్ రావును నిందుతునిగా విచారణకు పిలువలేదు?

`కేటీఆర్ ను,సంతోష్ రావు ను పిలిచారు?

`వారిని కూడా సాక్షలుగానే పిలిచారు?

`నెక్స్ట్ మాజీ సీఎం “కేసీఆర” ను పిలుస్తారని మీడియా లో వార్తలు వస్తున్నాయి?

`అవగాహన లేని వ్యక్తులు మీడియాలో తయారయ్యారు?

చట్టం మీద కనీస అవగాహన వారిలో శూన్యం?

మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం అంత ఆశమాషి కాదు?

`ఫోన్ ట్యాప్ విషయంలో “కెసిఆర” ను ఏరకంగా పిలుస్తారు?

`నిందితునిగా పిలిచే అవకాశం లేదు?

`సాక్షులుగా పిలిచే సందర్భం అసలే కాదు?

”కేసీఆర” ను పిలిస్తే అప్పటి డీజీపీని పిలవాల్సి ఉంటుంది?

అప్పటి హోం సెక్రటరీని పిలవాల్సిన అవసరం ఉంటుంది?

`ఇంటెలిజెన్స్ ఐజీని కూడా పిలిచి “కేసీఆర” ముందు కూర్చో బెట్టాలి?

`ఇప్పటి వరకు అప్పటి అధికారులు సిఎం చెబితేనే చేశామని ఎక్కడా చెప్పలేదు?

`మాజీ సీఎం “కేసీఆర” ను సాక్షిగా పిలిచి ఫోన్ ట్యాప్ మీద అనుమానం ఉందా అని

అడుగుతారా?

`కాళేశ్వరం వంటి అంశం మీద నోటీస్ అనేది సాహెతుకం?

`ఫోన్ ట్యాప్ లో మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం సాధ్యమా?

`”కేసీఆర” ను ముందు కూర్చో బెట్టుకొని ప్రశ్నలు అధికారులు అడగ గలరా?

`ఇప్పటి వరకు సాక్షులుగా వెళ్లిన వారితో ఇన్ని ఫోన్ నెంబర్లు ఎక్కడివి అని అడిగినట్లు

మీడియాలో వచ్చింది?

`సామాన్యుల ఫోన్ లోనే వేలాది నంబర్లు ఉంటున్నాయి?

`హరీష్,కేటీఆర్,సంతోష్ వద్ద వేలాది నెంబర్లు ఉండడం విచిత్రమా?

`నిజం కానీ అబద్దం లో సాగదీత తప్ప ఏమీ లేదు?

`ఇంకా తెలంగాణా ప్రజలను మాయ చేయడం సాధ్యం కాదు?

`ట్యాప్ విషయంలో కొండను తవ్వినా ఎలుక కూడా దొరకదు?

`ప్రతిపక్షం మీద పగ సాధిస్తా అనేలా ఉన్నా నెరవేరడం కనిపించడం లేదు?

నేటిధాత్రి:
రెండు సంవత్సరాలుగా జీడి పాకం సాగుతున్నట్లు నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులు రకరకాల మలుపులు తిప్ప్పుతున్నారు. ఇంత కాలం సాగి, సాగి ఇప్ప్పుడు జోరుమీద వున్నట్లు మరో ప్రయత్నం గట్టినే చేస్తున్నారు. కాని అది గట్టి కేసా? లేక బిఆరఎస్ నాయకులు అంటున్నట్లు లొట్టపీసా? అనేది తేలడానికి కూడా ఇంకా సయమం తీసుకుంటారా? అనేది తేలాల్సి వుంది. ఇప్పటి వరకైతే బిఆరఎస్ నాయకులు చెబుతున్నదే నిజమౌతోంది? గత వారం రోజుల హడావుడిలో ముగ్గురు నాయకులను సిట్ పిలిచింది. అది కూడా సాక్ష్యులుగా మాత్రమే విచారించింది. ఇంత వరకు సరే..కాని ఇప్ప్పుడు తర్వాత పిలిచే ఏకంగా మాజీ సిఎం. కేసిర్? అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి వార్తలు మీడియా సంస్దలు కూడా పనిగట్టుకొని చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించడం అనేది అంత సులువైన పనికాదు. చట్టం తల్చుకుంటే ఏదైనా చేయొచ్చు? అనేది అన్ని విషయాలకు వర్తించదు. గత ప్రభుత్వాధినేతను ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించాలంటే ఆశామాషీ కాదు? ఒక వేళ పిలిచారే అనుకుందాం? ఏ అంశాన్ని ప్రస్తావించి పిలుస్తారు? నిందుతుడిగా పిలిచే అవకాశం అసలే లేదు? సాక్షిగా పిలిచే సందర్భం అసలే ఉత్పన్నం కాదు? కేసిఆర్‌ను అందుకు బాధ్యుడిని చేయడం అంత సులువైన పని అసలే కాదు? ఇంకా ఎలా పిలుస్తారు? ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? కాకతాళీయంగా ఏ మీడియా ఇలాంటి వార్తలు రాయడానికి కూడా ముందుకు రాదు? ఎలాంటి సంకోచం లేకుండా రాస్తున్నారంటే అందులో ప్రభుత్వ ప్రోద్భలం లేకుండా వుండదు? ఎందుకంటే మీడియా పెద్దలకు చట్టం గురించి తెలియంది కాదు? చట్ట పరిధిని దాటి మీడియా వార్తలు రాసే అవకాశం లేదు? ఒక వేళ రాస్తే వారికి ఎలాంటి అవగాహన లేదన్న సుస్పష్టం. చట్టం మీద ఎలాంటి అవగాహన లేకుండా వార్తలు రాస్తే చిక్కుల్లో పడతామన్న కనీస జ్ఞానం లేని వాళ్లు మాత్రమే అలాంటి వార్తలు రాస్తారు. సిట్ అధికారులు తాము ఎ మీడియా సంస్ధకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని లిఖిత పూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. అయినా లేని పోని వార్తలు ఎందుకు వస్తున్నాయి? అలా వార్తలు రాసే వారి మీద కూడా చర్చలు తీసుకునే అధికారం సిట్ అదికారులకు వుంది. అయినా ఎందుకు చూసి చూడనట్లు వుంటున్నారు? మీడియా ఊహాగానాలు రాస్తుంది? కాని కొన్ని విషయాల్లో ఊహాగానాలు అనేవి ఊరికే రావు? నిప్ప్పులేనిదే పొగ రాదన్న సామెత తెలియంది కాదు? అధికారులు లీకులు ఇవ్వకపోయినా పాలకపెద్దలు ఇచ్చే లీకులు కూడా వుంటుంటాయి? అదికూడా ఇలాంటి కేసుల్లో లీకులు సముచితం కాదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేద సామాన్యమైన విషయం కాదు. అలాంటి కేసుల్లో ఊహాగానాలకు తావుండదు. పక్కా సమాచారం వుంటే తప్ప కేసు నిలబడదు? సహజంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్రం అనుమతితో ఖచ్చితంగా వుంటుంది. కేంద్ర ఫ్రభుత్వానికి తెలియకుండా దేశ రక్షణ విషయంలో చీమ కూడా చిటుక్కుమనే అవకాశమే లేదు. పాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాదారణం అనేది కూడా అందరకీ తెలిసిందే. దాన్ని రాద్దాంతం చేస్తూ పోతే ఇలా జీడిపాకమే అవుతుందే తప్ప మరేం తేలదు. 1861 టెటీగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. గతంలో కర్నాటక సిఎం.గా పనిచేసిన రామకష్ణ హెడ్డే పదవి పోగొట్టుకున్నారు. అప్పటి పరిస్ధితుల్లో పూర్తి సాక్ష్యాదారాలలో కేసులు నమోదు చేశారు. మరి తెలంగాణలో రెండేళ్లులో ఒక్క సాక్ష్యం లేదు. ఒక్క అధికారిక దవీకరణ లేదు. దానిపై ఎవరూ పిర్యాధు చేసింది లేదు? ఏ ఒక్కరు తమకు అన్యాయం జరిగిందని చెప్పింది లేదు? తమను బిఆరఎస్ పెద్దలు బెదిరించారన్నదానిపై కేసులు లేవు? కాని ఎన్నికల ముందు చేసిన రాజకీయ హడావుడిని వదిలేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందు వేసుకున్నది? ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తాయనుకున్నప్ప్పుడల్లా తెరమీదకు తెస్తున్నది అని అంటున్న బిఆరఎస్ వాదనలో నిజం కూడా కనిపిస్తోంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత పాలకపక్షంలో కీలకభూమిక పోషించిన కేటిఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావులను నిందితులుగా పిలవలేదు. ఎందుÅ£ంటే వారి మీద కేసులు నమోదు కాలేదు. ఇక వారిని సాక్ష్యులుగా మాత్రమే పిలిచారు. వారి వంతు అయిపోయింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను పిలుస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ ఆ వార్తలే నిజమనుకుంటే కేసిఆర్‌ను పిలిచి విచారిచండం అంత సులువైన పని కాదు. అంత ఆశామాషీ వ్యవహరం కాదు. ఎందుకంటే గత పదేళ్లు ఆయనే పాలకుడు. నిత్యం ఇంటలిజెన్స్ అదికారులు అన్ని విషయాలు చెబుతారు. రాష్ట్రంలో ఏదైనా అశాంతి నెలకొనేలా వుందనుకున్నప్ప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందిన సమాచారాన్ని మాత్రమే కేసిఆర్‌కు వివరిస్తారు. ఇంతకు మించి కేసిఆర్‌కు కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశమే వుండదు. ఒక వేళ వుందని అనుకున్నా.. ఆ సమయంలో పనిచేసిన డిజీపిలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో పిలవాల్సిన అవసరం వుంటుంది. ఫోన్ ట్యాపింగ్‌ను హాండిల్ చేసే ీVAం సెక్రెటరీలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో ఆయన ముందు హజరుపర్చాల్సివుంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు? అయినా మాజీ సిఎం. కేసిఆర్‌కు నోటీసులు ఇస్తారంటూ వార్తలు రావడం విడ్డూరం. ఒక వేళ కేసిఆర్‌ను కూడా సాక్ష్యంగా పిలిస్తే ఏమని ప్రశ్నిస్తారు? మీ ఫోన్ ట్యాప్ అయ్యిందా? అని అడుగుతారా? ఏమని విచారిస్తారు? ఇప్ప్పుడున్న అదికారులు కేసిఆర్‌ను విచారించేంత ధైర్యం చేస్తారా? సాద్యమౌతుందా? ప్రభుత్వం చెప్పినట్లు చేసే సమయంలో కేసిఆర్‌కు నోటీసులిచ్చేంత సాహసం చేస్తారా? గతంలో ఎన్నికల ముందు పదే పదే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందన్న అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే పోలీసులకు పిర్యాధు చేశారా? ఆఖరుకు హరీష్‌రావు మీద పిర్యాధు చేసిన వ్యక్తిలాగా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు ధైర్యం చేయలేదు? పిర్యాధులు ఎందుకు చేయలేదు? తమ ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెప్పే బిజేపి నాయకులు కేంద్రంలో అదికారంలో వుండి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? కేంద్ర ీVAం శాఖ సహాయ మంత్రిగా వున్న బండి సంజయ్ తన ీVAదాను మర్చిపోయి రాజకీయం చేస్తుండడం సమంజసమేనా? నిజంగా ఆయనకు అనుమానం వుంటే ఎందుకు ఇప్పటి వరకు పిర్యాదు చేయలేదు. కేంద్రం నుంచి ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు? తన ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెబుతున్న కవిత ఎందుకు ఇ ంత వరకు పిర్యాధు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల స్దాయిలో జరిగేది కాదు? అదికారులు మంత్రుల ఎంత సమర్దులైన వివరాలు చెప్పే ఆస్కారం వుండదు. అయినా చట్టం గురించి, చరిత్ర గురించి, పాలనా పరమైన విషయాల గురించి, పరిపాలనలో వుండే ఇబ్బందుల గురించి తెలిసిన కేసిఆర్ అలా ఫోన్ ట్యాపింగ్‌లు చేయిస్తారా? నిజంగానే ఆ ట్యాఫింగ్‌లు నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? నాయకులు ఎన్నికల్లో గెలిచేవారా? బిఆరఎస్ పార్టీ ఓడిపోయేదా? ఇక తాజాగా బిఆరఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ తో పెద్దఎత్తున ఎలక్రోరల్ బాండ్లు సేకరించిందని కూడా కాంగ్రెస్ నాయకులు, బిజేపి నాయకులు అంటున్నారు. దేశంలో అత్యధిక ఎలక్రోరల్ బాండ్లు సేకరించిన పార్టీగా బిజేపి ముందు వరుసలో వుంది. ఈ పన్నెండేళ్ల కాలంలో సుమారు 13వేల కోట్ల రూపాయల ఎలక్రోరల్ బాండ్లు సేకరించినట్లు వివరాలున్నాయి? ఇదంతా బహరింగ రహస్యమే? ఇందులో ఫోన్ ట్యాపింగ్ ఏమి వుంటుంది? ఒక వేళ అదే నిజమైతే ఏ ఒక్క పారిశ్రామిక వేత్త అయినా బైటకు వచ్చి చెప్పారా? తమను బిఆరఎస్‌పార్టీ వేధించడం వల్లనే ఎలక్రోరల్ బాండ్లు ఇచ్చామని కేసులు పెట్టారా? దేశంలో అన్ని పార్టీలకు అందరు పారిశ్రామిక వేత్తలు ఎలక్రోరల్‌బాండ్లు ఇస్తారు. బిజేపికి , కాంగ్రెస్‌కు ఇచ్చిన వాళ్లే, బిఆరఎస్‌కు కూడా ఇచ్చారు. తలాతోక లేకుండా కొత్త కొత్త ఆరోపణలు తెరమీదకు తెచ్చి ఫోన్ ట్యాపింగ్‌ను రెండేళ్లుగా సాగి, మూడో ఏడుకు కూడా నడుస్తోంది. ప్రజా సమస్యలను చాలా పక్కాగా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బిఆరఎస్ విమర్శిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనే కేసుల లొట్టపీసు అని అందుకే అంటోంది!!

“జీఎం” అండగా ఉండగా..దిగులెందుకు దండగా?

”నేటిధాత్రి” వార్త ఢిల్లీలో సంచలనం?

ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి!?

`మిల్లర్లకు కొత్త సలహా ఇచ్చిన “ఎఫ్ సిఐ.జీఎం?”

ఎఫ్ సిఐ.జీఎం ప్లాన్ ఏ “బంపర్ ఆఫర” బ్లాస్ట్?

`కేంద్ర మంత్రికి మెయిల్స్ మీద మెయిల్స్?

`ఆగిపోయిన బంపర్ ఆఫర్ ప్లాన్?

`”జీఎం” ఇచ్చిన కొత్త ఆలోచనకు ఎగిరి గంతేస్తున్న బాయిల్డ్ మిల్లర్లు?

`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ పట్టుకొని ఢిల్లీకి వెళ్ళండి?

కేంద్ర మంత్రితో మళ్ళీ మాట్లాడతా? అని “జీఎం” హామీ?

`యాసంగి వడ్లతో బకాయిలు పూడ్చుకున్నే పన్నాగం?

`15 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్రం తీసుకునేలా మరో దొడ్డి దారి ప్రయత్నం?

కేంద్రం ససేమిరా అంటున్నా ఒప్పిచేందుకు “ఎఫ్ సిఐ,జీఎం.” మరో రాయబారం?

`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని అడ్డం పెట్టుకునే వ్యూహం?

`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా బియ్యపు గింజ మిలర్ల వద్ద లేదు?

ఒట్టి చేతులతోనే కేంద్రం, రాష్ట్రాన్ని నిండా ముంచే మిలర్ల దుర్మార్గం?

`యాసంగి పంట చేతికొస్తే గాని బియ్యం పెట్టలేరు?

`అయినా బియ్యం ఉన్నట్లు నాటకాలడుతున్నారు?

`బాయిల్డ్ మిల్లర్లు ఎప్పుడో బియ్యం అమ్ముకొని చేతులు దులుపుకున్నారు?

`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుండడంతో కుడితిలో పడ్డ ఎలుకలవుతున్నారు?

`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా పెట్టలేరు?

`గత ఏడాది బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు? దాచుకున్నారు?

`ప్రభుత్వానికి ఎగనామం పెట్టేశారు?

`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని బాయిల్డ్ మిల్లర్లు ఊహించలేదు?

`15 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలడం తో తెలుకుట్టిన దొంగలయ్యారు?

`ఇప్పటికే “12 వేల కోట్ల రూపాయలు” ప్రభుత్వానికి బకాయిలు వున్నారు?

`యాసంగి వడ్లు తీసుకుంటే మరో “12 వేలకోట్లు” కొత్త బకాయిలు పేరుకుపోతాయి?

`గతంలో టెండర్ ప్యాడి బకాయిలు ఇంకా “4 వేల కోట్లు” పైచిలుకు పెండింగ్ లోనే వున్నాయి?

`ఇవన్నీ కలిపితే బాయిల్డ్ మిలర్ల బకాయిలు ఎంత లేదన్నా 20 వేల కోట్లు ఆవుతాయి?

ఈ బకాయిలు వసూలు చేస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్క దెబ్బతో అమలు చేయొచ్చు?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                                               

 శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటే ఇలానే వుంటాయేమో! ప్రభుత్వ సొమ్ము పక్కదారి మళ్లించి, అప్పనంగా బియ్యం అమ్ముకదొబ్బి, ఆస్దులు పెంచుకొని, కోట్లు కూడేసుకొని, ఇంకా ప్రభుత్వాన్ని ఎలా మోసం చేయాలా అని చూస్తున్నవారికి ప్రభుత్వ అదికారుల అండనా? వినడానికే విడ్డూరంగా వుంది. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాద్యతలో వున్న అధికారులు లంచాలకు అలవాటు పడి, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మోసాలు చేస్తుంటే వ్యవస్ధ ఎక్కడ బాగుపడుతుంది. ఆరు గాలం రైతులంగా శ్రమించి, వడ్లు పండిస్తే, ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఆ వడ్లను బియ్యం చేసి ఇవ్వాల్సిన బాయిల్డ్ మిల్లర్లు అప్పనంగా బియ్యాన్ని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం దర్జాగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి మొండి చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి చేస్తే, అక్రమ అదికారులతో కలిసి, ప్రభుత్వాన్ని మరింత మోసం చేయాలని చూస్తున్నారు. ఇదేనా వ్యవస్దల పనితీరు..ఇంతేనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారి కర్తవ్యం? అసలు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను బియ్యం చేసి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సిన మిల్లర్లు ఇష్టాను సారం అమ్ముకోవడమా? పైగా ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుంటే అధికారులతో కలిసి మరింత మోసానికి తెగబడడమా? ఇదేనా మిల్లర్లు చేయాల్సిన పని? ప్రభుత్వాల మెతక వైఖరిని అలుసుగా చేసుకొని కొందరు మిల్లర్లు ఆటలాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిండామోసం చేస్తున్నారు? ఇంతకీ ఏం జరిగిదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి సుమారు 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ పడ్దారు. దాని విలువ వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ శాఖ నుంచి అందాల్సిన రాయితీలు అనేకం పెండింగ్‌లో వున్నాయి. వాటిని విడుదల చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణలో వున్న బాయిల్డ్ రైస్‌ను ఇస్తామని ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకున్నది. కేంద్రం బాయిల్డ్ రైస్ అవసరం లేదు! రా రైస్ వుంటే ఇవ్వండి. రా రైస్ మాత్రమే తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి కేంద్ర 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం బాయిల్డ్ మిల్లర్ల దగ్గర ఒక్క బియ్యం గింజ లేదు. అందులోనూ బాయిల్డ్ రైస్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పూడ్చేందుకు కూడా కొంత సమయం కావాలి. అందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. పైగా కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా ఒక దారి కావాలి. అందుకోసం తెలంగాణలోని మిల్లర్లంతా కలసి ఫుడ్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ జిఎంను కలిశారు? తమ పరిస్దితి విన్నవించారు? తనకు ఇరవై కోట్లు ఇస్తే పరిస్ధితి చక్కదిద్దుతానని చెప్పినట్లు కూడా సమాచారం. అందులో భాగంగా ముందు కోటి రూపాయలు అందజేయాలి. కేంద్ర మంత్రి నుంచి అనుమతి తెచ్చిన వెంటనే మిగతా సొమ్ము ఇచ్చేలా మిల్లర్లు, కాంట్రాక్టర్ల మధ్య డీల్ కుదిరింది? ఈ సంగతి నేటిధాత్రికి ఉప్పందింది. వెంటనే నేటిధాత్రి జరుగుతున్న విషయాన్ని వెల్లడించింది. ఎఫ్‌సిఐ జిఎం. బంపర్ ఆఫర్ అని వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అది డీల్లీకి చేరింది. డీల్‌కు క్యాన్సలైంది. కేంద్రం సీరియస్ అయ్యింది. ఇక నేనేం చేయలేనని జిఎం. చేతులెత్తేశారు. కాని ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి చెబుతానని మిల్లర్ల చెవిలో వేశారు? గతంలో రాష్ట్ర ఫ్రభుత్వం కేంద్రానికి రాసిన ఉత్తరం తోనే పని పూర్తి చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఎందుకంటే గతంలోనే రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాశారు. తెలంగాణలో 15లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ వుందని, దానిని కొనుగోలు చేయాలన్నది ఆ లేఖ సారాంశం. కాని అప్ప్పుడు కేంద్రం ఒప్ప్పుకోలేదు. ఉప్ప్పుడు బియ్యం వద్దే వద్దని తెల్చి చెప్పేసింది. రా రైస్ వుంటే ఇవ్వండి తీసుకుంటామని చెప్పింది. ఎలాగైనా బాయిల్డ్ రైస్ మిల్లర్లను గట్టెంచాలని ప్రభుత్వం కూడా అనుకున్నది. కాని బాయిల్డ్ రైస్ మిల్లర్ల బాగోతం ప్రభుత్వానికి తెలియలేదు. ప్రభుత్వాన్ని బాయిల్డ్ రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని గమనించలేదు. అయితే ఇప్ప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన లెటర్‌ను పట్టుకొని , డిల్లీకి వెళ్లండి? నేను మళ్లీ కేంద్ర మంత్రితో మాట్లాడతానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడే అసలు చిక్కంతా వుంది. కేంద్రం ఒక వేళ ఒప్ప్పుకున్నా బియ్యం ఇచ్చేందుకు మిల్లర్ల దగ్గర ఒక్క గింజ కూడా లేదు. యాసంగి పంట వస్తే, ప్రభుత్వం కేటాయిస్తే ఆ వడ్లను మరాడిస్తే తప్ప బాయిల్డ్ మిల్లర్లకు బియ్యం లేవు. యాసంగి పంట వచ్చే దాక రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలి. కేంద్రాన్ని ఒప్పించాలి? ఇదీ బాయిల్డ్ రైస్ మిల్లర్ల అసలు బాగోతం. చేతిలో బియ్యంపు గింజ లేకపోయినా, కేంద్రాన్ని ఒప్పించేట్లు కొత్త నాటకం మిల్లర్లు ఆడుతున్నారు. ఎఫ్‌సిఐకి బియ్యం మిల్లర్లు ఇస్తారన్న సంగతి జిఎం చూసుకుంటారు. దాంతో కేంద్రం నుంచి రాష్ట్ర ఫ్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వస్తాయి. అప్ప్పుడు ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి వుండదు. బియ్యం లేవన్న సంగతి అసలే తెలియదు. ఇదీ అసలు స్కెచ్. ఇలా ప్రభుత్వాన్ని నిండా ముంచే ఎత్తుగడ అందరూ కలిసి వేశారు. ప్రభుత్వం కళ్లు గప్ప్పుతున్నారు. అయితే ఇక్కడ మరో అతిపెద్ద ట్విస్టు వుంది. బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి ప్రభుత్వానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయల బకాయిలు వున్నారు. అయితే ఇందులో కొంత మంది బకాయిలు చెల్లించిన వారున్నారు. కాని నాయకులుగా చెలామణి అయ్యే వారు..పెద్ద పెద్ద మిల్లర్లు పెద్దఎత్తున బకాయిలు పడ్డవారున్నారు. ఆ బకాయిలు గత ఏడాది ఖరీఫ్ నుంచి వున్నాయి. ఆ బకాయిలే రూ.12వేల కోట్లకు చేరుకున్నాయి. ఇప్ప్పుడు మళ్లీ యాసంగి వడ్లు ఇస్తే మరో రూ.12వేల కోట్లు బకాయిలు పడతారు. అంటే రెండేళ్లకు గాను మొత్తం రూ.24 వేల కోట్లు బకాయిలు పడుతున్నట్లు లెక్క. అందులో కొన్ని చెల్లింపులు ఒక వేళ చేసినా బకాయిలు సుమారు రూ.20వేల కోట్లైనా వుంటాయి. వీటికి తోడు ఈ మిల్లర్లు గతంలో ప్యాడీ టెండర్‌కు సుమారు రూ.4వేల కోట్లు ఇంకా ఇప్పటికీ బకాయిలు వున్నారు. వాటిని కూడా చెల్లించలేదు. మొత్తం బకాయిలన్నీ లెక్కేస్తే సుమారు రూ.25వేల కోట్ల వరకు బకాయిలు వుండే అవకాశం వుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ప్రతి ఏడాది వడ్లు తీసుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ప్రబుత్వం ఒత్తిడి చేసిన సందర్భాలలో అప్ప్పుడింత, అప్ప్పుడింత చెల్లిస్తున్నారు. పెద్దమెత్తం బకాయిలు మాత్రం అలాగే పెండింగ్ పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ బకాయిలను వసూలు చేస్తే ఏటా సంక్షేమ పథకాలను రూపాయి లోటు లేకుండా అమలు చేయొచ్చు. కొత్త పథకాలు కూడా ప్రకటించి, అప్ప్పులేకుండా పాలన సాగించొచ్చు. వేలాది కోట్లరూపాయలు మిల్లర్ల వద్ద పెండింగ్‌లో పడిపోతున్నాయి. అయినా మొసలి కన్నీరు కారుస్తూ, మిల్లర్లు సానుభూతి పొందే ప్రయత్నం మరింత చేస్తున్నారు. ఒక్కొ మిల్లర్ వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి మిల్లర్లను కట్టడి చేసి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. మిల్లర్లు ఇచ్చే లంచాలను మింగుతున్నారు. ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. ప్రజల సొమ్ము దిగమింగుతున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రతినిధులు కూడా అండగా నిలుస్తున్నారు. అటు మిల్లర్లు, ఇటు అదికారులు కలిసి ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలు కుంటే మిల్లర్ల నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయొచ్చు. మిల్లర్ల బకాయిలు కొండలా పేరుకుపోకుండా కాపాడొచ్చు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవచ్చు. ఇదీ మ్యాటర్!!

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 22 వార్డుల నుండి పోటీ…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం రెండో సారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మిత్ర పక్షంగా మెలిగి గెలుపుకు సహకరించామని,సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో స్నేహబంధమే కోరుకుంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సిపిఐ తో పాటు కలిసి పనిచేసేందుకు ఇష్టపడని నేపథ్యంలో సిపిఐ పార్టీ మునిసిపాలిటీలోని 22 వార్డులలో కౌన్సిలర్లు గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు..

CPI Fields Candidates in 22 Wards of Kattanpalli Municipality.

మిత్ర ధర్మాన్ని విస్మరిస్తే కలిసివచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డులలో నామినేషన్ వేస్తామని తెలిపారు. సిపిఐ కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, ఈరవేన రవీందర్, రాజేశం ,మనమ్మ, లక్ష్మణ్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బహుభాష సదస్సుకు ఆహ్వానం….

బహుభాష సదస్సుకు ఆహ్వానం

జహీరాబాద్, నేటిధాత్రి:

 

శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ అక్క మహాదేవి బహుభాష జాతీయ సదస్సు సంస్కృతిక భవన్ ప్రారంభోత్సవ గ్రంథవిష్కరణ కార్యక్రమానికి న్యాల్కల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మారుతీ, మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి, సిద్దారెడ్డిలు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను మంగళవారం నాడు ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అక్క మహాదేవి జాతీయ పురస్కర పురస్కారానికి తప్పని సరిగా హాజరు కావాలని డాక్టర్ రాజశేఖర్ శివ చారి కోరారు.

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం..

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం

జహీరాబాద్, నేటిధాత్రి:

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు  చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆనంద్
ఫీల్డ్ అసిస్టెంట్ శశి కుమార్ గ్రామ పెద్దలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version