దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా…

దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా 5.5 ట్రిలియన్ డాలర్ల హెచ్చుతగ్గులు

 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కమోడిటీ మార్కెట్స్‌లో నెలకొన్న ఒత్తిడికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరలపై చర్చే! సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్లు, వ్యవస్థాగత మదుపర్ల వరకూ అన్ని వర్గాల వారినీ పసిడి ధరల పరుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రోజు ధర ఎంత పెరుగుతుందో? ఎంత తగ్గుతుందో? అసలు పసిడిపై పెట్టుబడికి ఇది సరైన సమయమో కాదో తెలియక సామాన్యుల తలకిందులవుతున్నారు. అయితే, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందని స్టాక్ మార్కెట్‌ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ది కొబేసీ లెటర్’ చేసిన ట్వీట్ ప్రకారం, గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య (అమెరికా కాలమానం ప్రకారం) బంగారం మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్‌లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్లను చేరింది. నిత్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌ కాయిన్ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లే. కానీ బంగారం మార్కెట్ విలువలో ఇంట్రాడే హెచ్చుతగ్గులే ఇందుకు మూడు రెట్లు ఉండటం కలకలానికి దారితీస్తోంది.

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు…

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

టర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 2 తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,30,200గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి (Gold Rates on Dec
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,19,350. విజయవాడలో కూడా 24 క్యారెట్ పసిడి ధర రూ.1,30,200గా, 22 క్యారెట్ గోల్డ్ రేట్ 1,19,350గా ఉంది. చెన్నైలో వెండి ధర కిలోకు రూ.1,96,000 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా దాదాపు ఇదే ధర ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,88,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం 4,215 డాలర్లు. వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 57.22 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అమెరికా ఫెడ్ రేట్‌లో కోతపై స్పష్టత వచ్చే వరకూ గోల్డ్ రేట్స్‌ ఎగుడుదిగుడులు తప్పవనేది విశ్లేషకుల అంచనా.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు..

 

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

దేశంలో బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యపరుస్తూ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, ఇతర నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.దేశంలో పసిడి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకుని మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 2025 ఉదయం 6:10 గంటల సమయానికి బంగారం ధరలు సరికొత్త స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,010కి చేరుకుంది.

ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి (gold and silver price on August 8th 2025). కిలో వెండి ధర రూ. 1,17,100 స్థాయిలో ఉంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొనసాగుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
  • హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి (1 కిలో) రూ. 1,27,100.
  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710.. 22 క్యారెట్ల పసిడి రూ. 94,160, వెండి రూ. 1,17,100.
  • చెన్నై: 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,27,100.
  • ముంబై: 24 క్యారెట్ల పసిడి రూ.1,02,560, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 94,010, వెండి రూ. 1,17,100.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల పసిడి రూ.94,010, వెండి రూ. 1,17,100.

బంగారం, వెండి ధరల ప్రధాన పెరుగుదలకు కారణాలు

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య అంశాలు తీవ్రతరం కావడం, అమెరికా డాలర్ విలువ క్షీణించడం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు, అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్లకు చేరడం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గేలా చేశాయి. దేశంలో దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.

మార్కెట్ ప్రభావం

ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల విక్రయాలు కొంత తగ్గాయి. చాలా మంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న ఆభరణాల షాపుల వ్యాపారం 20-25% తగ్గినట్లు వర్తకులు తెలిపారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ధరల పెరుగుదలను సానుకూలంగా చూస్తున్నారు.

సలహా

బంగారం తీసుకునే క్రమంలో హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, కొనుగోలుదారులు కొనే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version