సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.
రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, కేరన్ సెక్టార్లో గురువారం రాత్రి కొన్ని తక్కువ భూమి కక్ష (ఎల్ఈఓ) ఉపగ్రహాలు కనిపించాయి. రొటీన్ క్రమంలో సాయుధ బలగాలు ఓవరాల్ ఎయిర్స్పేర్ నిఘా కొనసాగిస్తున్నాయి. కాగా, ఈనెల మొదట్లో పూంచ్, సాంబాలోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్లు కనిపించారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. రామ్గఢ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఒక డ్రోన్ కనపించిందని చెబుతున్నారు. దీంతో పాకిస్థాన్తో సరిహద్దు వెంబడి రక్షణ బలగాలు హైఅలర్ట్ కొనసాగిస్తున్నాయి.
